Nalgonda: భారాస అధినేత కేసీఆర్‌ కాన్వాయ్‌లో ప్రమాదం

నల్గొండ జిల్లా వేములపల్లి వద్ద భారాస అధినేత కేసీఆర్‌ కాన్వాయ్‌లో ప్రమాదం జరిగింది.

Updated : 24 Apr 2024 19:09 IST

వేములపల్లి: నల్గొండ జిల్లా వేములపల్లి వద్ద భారాస అధినేత కేసీఆర్‌ కాన్వాయ్‌లో ప్రమాదం జరిగింది. ఒకదానికొకటి ఢీకొనడంతో కాన్వాయ్‌లోని ఎనిమిది వాహనాలు దెబ్బతిన్నాయి. భారాస నేతలకు ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ముందు వెళ్తున్న కారు డ్రైవర్‌ సడెన్‌ బ్రేక్‌ వేయడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.

బస్సు యాత్ర, రోడ్ షోల ద్వారా లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని కేసీఆర్‌ ఉద్ధృతం చేశారు. ఇవాళ మిర్యాలగూడ నుంచి ప్రారంభమైన గులాబీ దళపతి యాత్ర వచ్చే నెల పదో తేదీన సిద్దిపేటతో ముగియనుంది. ఈ యాత్ర ద్వారా ఉదయం పూట 12 లోక్‌సభ నియోజకవర్గాల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో రైతుల కష్టాలు తెలుసుకోనున్నారు. సాయంత్రం రోడ్‌ షో ద్వారా ముఖ్యమైన ప్రాంతాల్లో ప్రసంగించనున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని