ఆర్టీసీ బస్టాండ్లు.. చోరీలకు అడ్డాలు!
మిర్యాలగూడ పట్టణం చింతపల్లి కాలనీకి చెందిన ఓ మహిళ తన బంగారాన్ని బ్యాగులో వేసుకుని ఊరికి వెళ్లేందుకు స్థానిక బస్టాండ్లోని నల్గొండ ప్లాట్ఫాం వద్ద ఆదివారం ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో బస్సెక్కింది.
మిర్యాలగూడ బస్టాండ్లో నేలచూపులు చూస్తున్న నిఘా నేత్రం
మిర్యాలగూడ పట్టణం చింతపల్లి కాలనీకి చెందిన ఓ మహిళ తన బంగారాన్ని బ్యాగులో వేసుకుని ఊరికి వెళ్లేందుకు స్థానిక బస్టాండ్లోని నల్గొండ ప్లాట్ఫాం వద్ద ఆదివారం ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో బస్సెక్కింది. బస్సెక్కిన తర్వాత బ్యాగు జిప్ కొద్దిగా తెరచి ఉండడంతో అనుమానం వచ్చి చూడగా.. బంగారం ఉన్న చిన్న పర్సు చోరీకి గురైనట్లు గుర్తించి లబోదిబోమంది. ఆ వెంటనే ఓ వ్యక్తి పర్సు, మరో వ్యక్తి సెల్ఫోన్ సైతం చోరీకి గురయ్యాయి. ఇటువంటి ఘటనలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిత్యం అనేకం చోటు చేసుకుంటున్నాయి.
మిర్యాలగూడ పట్టణం, నల్గొండ నేర విభాగం, న్యూస్టుడే: అవి నిత్యం వేలాది మంది ప్రయాణించే ప్రాంగణాలు. వారి ద్వారా నిత్యం లక్షల్లో ఆదాయం. అయినా వారి రక్షణకు ఎటువంటి చర్యలు తీసుకోని వైనం. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏడు ఆర్టీసీ డిపోలు ఉండగా.. వీటి పరిధిలో నల్గొండ, మిర్యాలగూడ, సూర్యాపేట, కోదాడ, భువనగిరి, యాదగిరిగుట్ట ప్రధాన ఆర్టీసీ బస్టాండ్లు ఉన్నాయి. వీటి నుంచి నిత్యం వేలాది మంది వివిధ ప్రాంతాలకు ప్రయాణిస్తుంటారు. అయితే ఆయా బస్టాండ్లలో దొంగలు తమ చేతివాటం ప్రదర్శిస్తుండడంతో ప్రయాణికులు రూ.లక్షల్లో నష్టపోతున్నారు. తక్షణమే అధికారులు స్పందించి తమ రక్షణకు పటిష్ఠ చర్యలు చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు.
పని చేయని నిఘా నేత్రాలు..
ఆర్టీసీ బస్టాండ్లలో గతంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు నిర్వహణ లోపంతో పని చేయకుండా అలంకారప్రాయంగా మారాయి. దీంతో దొంగతనాలు జరిగినప్పుడు కేసులను ఛేదించడం పోలీసులకు సవాలుగా మారుతుంది. దీంతో కేసులు తేలేది లేదు.. చోరీకి గురైన సొమ్ము తిరిగి వచ్చేది లేదని ప్రయాణికులు వాపోతున్నారు. సీసీ కెమెరాల నిర్వహణ మాది కాదంటే మాది కాదని.. ఆర్టీసీ, పోలీస్ శాఖలు తప్పించకుంటుండడంతో దొంగలకు పని సులభంగా మారుతోంది. మిర్యాలగూడ బస్టాండ్లో దుకాణదారులు చందాలు వేసుకుని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినా నిర్వహించే నాథుడు లేక మూలన పడ్డాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని బస్టాండ్లలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
బస్టాండ్లలో జరిగిన దొంగతనాలు మచ్చుకు కొన్ని..
- నల్గొండ బస్టాండ్లో గడచిన 20 రోజుల్లో 15 సెల్ ఫోన్లు చోరీకి గురయ్యాయి.
- గతేడాది నవంబరులో నార్కట్పల్లి నుంచి నల్గొండ వస్తున్న బస్సులో ఓ మహిళ బ్యాగులోని 8 తులాలకు పైగా బంగారు ఆభరణాలను మహిళా దొంగలు అపహరించారు.
- గతేడాది మిర్యాలగూడ ఆర్టీసీ బస్టాండ్లో వరుసగా ఐదు ద్విచక్ర వాహనాలు చోరీకి గురయ్యాయి.
- మూడేళ్ల క్రితం మిర్యాలగూడ ఆర్టీసీ బస్టాండ్లో నిలిపి ఉంచిన అద్దె బస్సుల్లో డీజిల్ చోరీకి గురైంది.
ప్రతిపాదనలు పంపిస్తాం
బొల్లెద్దు పాల్, ఆర్టీసీ డిపో మేనేజర్, మిర్యాలగూడ
బస్టాండ్లో గతంలో దాతల సహకారంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిర్వహణను పోలీస్ శాఖకు అప్పగించాం. ప్రస్తుతం సీసీ కెమెరాలు మరమ్మతులకు గురయ్యాయి. సంస్థ నుంచి నిధులు రాలేదు. త్వరలోనే సీసీ కెమెరాల ఏర్పాటుకై స్థానిక ఎమ్మెల్యేతో పాటు సంస్థ ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపిస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కార్పొరేట్ వాకిటకు..సర్కారు సౌరభం
[ 18-05-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రభుత్వం కార్పొరేట్ విద్యకు సహకారం అందిస్తోంది. -
పరిశ్రమలు 900.. అధికారులు ఐదుగురు
[ 18-05-2024]
రసాయన, ఇతర పరిశ్రమల నుంచి వచ్చే ప్రమాదకర వ్యర్థాలను జాగ్రత్తగా నిర్వీర్యం చేయాలి. ఎక్కడ పడితే అక్కడ పారబోస్తే భూగర్భ జలాలు కలుషితం కావడంతో పాటు ప్రజలు వ్యాధుల బారిన పడే ప్రమాదం పొంచి ఉంది. -
ప్రముఖుల పల్లెల్లో..ప్రజాస్వామ్యం మురిసె
[ 18-05-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్లో ప్రముఖుల పల్లెల్లో ఓటు చైతన్యం వెల్లివిరిసింది. ఈ గ్రామాలకు చెందిన నేతలు ఎంపీలుగా, ఎమ్మెల్సీలుగా, ఎమ్మెల్యేలుగా సేవలు అందించడంతో పాటు ఇతర ముఖ్యులు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేవిధంగా పల్లెవాసులు వారిని ప్రోత్సహించారు. -
చలో.. నెల్లిబండ గట్టు జాతర
[ 18-05-2024]
వందల ఏళ్ల చరిత్ర.. రెండేళ్లకోసారి జాతర.. వేలాది మంది భక్తుల రాక.. ఉమ్మడి జిల్లాలో దురాజ్పల్లి పెద్దగట్టు తర్వాతి స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకున్న చిన్నగట్టు జాతరకు నెల్లిబండ ముస్తాబైంది. -
పట్టభద్రులకు పోల్ చిట్టీలు
[ 18-05-2024]
వరంగల్- ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు అధికారులు సన్నద్ధమయ్యారు. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో ప్రధాన పార్టీల తరఫున బరిలో ఉన్న అభ్యర్థులు ప్రచారంలో నిమగ్నమయ్యారు. -
పెరిగిన పోలింగ్.. ఎవరికి లాభించేనో?
[ 18-05-2024]
లోక్సభ ఎన్నికల క్రతువు ఇటీవలే ముగిసింది. అందరి దృష్టి భువనగిరి లోక్సభ పైనే ఉంది. ఇక్కడ గతంలో కంటే పోలింగ్ శాతం పెరగడంతో ఇది ఎవరికి లాభిస్తుందనే విషయమై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. -
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు.. అందనున్న ప్రత్యేక సేవలు
[ 18-05-2024]
సాధారణ సేవలకు మాత్రమే పరిమితమైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పల్లెదవాఖానాల్లో అదనంగా ఏడు రకాల వైద్య సేవలను గ్రామీణ ప్రాంతాల వాసులకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. -
అమ్మ అంత్యక్రియలకు అడ్డంకిగా ఆస్తి
[ 18-05-2024]
అమ్మ అంత్యక్రియలకు ఆస్తి పంపకం అడ్డంకిగా మారిన ఉదంతమిది. కన్నతల్లి అంత్యక్రియలు తమ బాధ్యత అనే విషయాన్ని మరిచి ఆ కుటుంబ సభ్యులు రెండు రోజులుగా ఆస్తి పంపకం విషయమై గ్రామపెద్దలతో ఎడతెగని చర్చలు జరిపారు -
ఆ చేపల పులుసు..మనసులు గెలుచు
[ 18-05-2024]
-
ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యం: బూర
[ 18-05-2024]
పార్లమెంట్ ఎన్నికల స్ఫూర్తితో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలు పనిచేయాలని భాజపా ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్, జిల్లా అధ్యక్షుడు పాశం భాస్కర్ కోరారు -
కలవరపెడుతున్న క్షయ
[ 18-05-2024]
క్షయ వ్యాధి కలవరపెడుతోంది. జిల్లాలో ప్రతి సంవత్సరం వ్యాధి బారినపడేవారు సంఖ్య పెరుగుతోంది. -
ఈసారైనా సీసీ లైనింగ్కు గ్రీన్సిగ్నల్ వచ్చేనా..?
[ 18-05-2024]
నల్గొండ జిల్లాలో 2.20 లక్షల ఎకరాలకు సాగు నీరందించే ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు(ఏఎంఆర్పీ) ప్రధాన కాల్వకు సిమెంటు కాంక్రీటు(సీసీ) లైనింగ్ చేసే పనులకు ఈ సారైనా ప్రభుత్వం పచ్చజెండా ఊపుతుందా..
తాజా వార్తలు (Latest News)
-
కనిపించని పోలింగ్ దస్త్రాలు?
-
ఎన్నికల పారితోషికం.. ఎందుకింత వ్యత్యాసం
-
పాపాలను పాతరేస్తారా.. తోడేళ్లకు తోడవుతారా?
-
కోనసీమలో అభ్యర్థుల ఆధిక్యంపై ఆసక్తి.. ఐపీఎల్ను తలపిస్తున్న బెట్టింగ్లు
-
పెళ్లి వస్త్రాల కోసం హైదరాబాద్ వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదం .. ఐదుగురి మృతి
-
ఆస్తి కోసం తల్లి, ఇద్దరు కుమార్తెల హత్య