వ్యర్థాలకు నిప్పు.. భూసారానికి ముప్పు
యాసంగి సీజన్ పూర్తి అయిన నేపథ్యంలో రైతులు తమ పొలాలను యంత్రాలతో కోసిన తరువాత మిగిలిన వరికొయ్యలను తగులబెడుతున్న తీరుతో.. ఓ వైపు భూమిలోని పోషకాలు కరిగిపోవటంతో పాటు.. మరోవైపు వాతావరణంలో కాలుష్యానికి కారణమై తీవ్ర శ్వాసకోశ సమస్యలు వచ్చే ప్రమాదం నెలకొంది.
ఐలాపురం వద్ద వరికొయ్యలు కాల్చటంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగిన ప్రాంతం
మిర్యాలగూడ, న్యూస్టుడే: యాసంగి సీజన్ పూర్తి అయిన నేపథ్యంలో రైతులు తమ పొలాలను యంత్రాలతో కోసిన తరువాత మిగిలిన వరికొయ్యలను తగులబెడుతున్న తీరుతో.. ఓ వైపు భూమిలోని పోషకాలు కరిగిపోవటంతో పాటు.. మరోవైపు వాతావరణంలో కాలుష్యానికి కారణమై తీవ్ర శ్వాసకోశ సమస్యలు వచ్చే ప్రమాదం నెలకొంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతులు యాసంగి కోతలు పూర్తి కావటంతో తమ పొలాల్లో వరి కొయ్యలకు నిప్పు పెడుతున్నారు. దీని కారణంగా భూమిలో ఆర్గానిక్ కార్బన్ మంటల్లో కరిగిపోయి వాతావరణంలో ఇంకిపోతుంది. దీంతో భూమిలో కర్బనశాతం పూర్తిగా తగ్గిపోయి తిరిగి పంటలు పండేందుకు అవసరమైన సారం లేకపోవటంతో రైతులకు దిగుబడి రాక తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. మంటల కారణంగా వ్యాపించే పొగతో కార్బన్డయాక్సైడ్ వెలువడి వాతావరణంలో కలిసిపోతుండగా.. ఈ గాలి పీల్చిన వారు దిల్లీ తరహా శ్వాసకోశ సమస్యలతో ఇబ్బందులు పడే దుస్థితి నెలకొంది. జిల్లాలోని సాగర్ ఆయకట్టులో పలుచోట్ల రైతులు వరికొయ్యలకు నిప్పుపెడుతున్నారు. వానాకాలం సీజన్లో వర్షాలు కురిసిన వెంటనే ట్రాక్టర్లతో భూమిని దున్నించుకోవచ్చనే ఉద్దేశంతో రైతులు ఈ తరహా పనులు చేస్తున్నారు. మూడు రోజుల క్రితం మిర్యాలగూడ మండలం ఐలాపురం సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు వరికొయ్యలకు నిప్పు పెడితే పక్కనే ఉన్న పిచ్చి మొక్కలు అంటుకుని రైల్వేట్రాక్ వరకు వ్యాపించి గుంటూరు-సికింద్రాబాద్ మార్గంలో రైళ్ల రాకపోకలకు కొంత సేపు అంతరాయం ఏర్పడింది. దీనిపై ఆర్డీవో, డీఎస్పీ మిర్యాలగూడలో అత్యవసరంగా సమావేశం ఏర్పాటు చేసి రైతులు కొయ్యలు కాల్చవద్దంటూ ఆదేశాలు జారీచేశారు.
పంట కొయ్యలు కాల్చొద్దు
పోరెడ్డి నాగమణి, ఏడీఏ, మిర్యాలగూడ
రైతులు వరి పొలం కోసిన తరువాత మిగిలి ఉన్న కొయ్యలను కాల్చకుండా ఉంచాలి. వీటిని వర్షాలు కురిసిన తరువాత దున్నితే పొలానికి అవసరమైన సారం పెరిగే అవకాశం ఉంది. దీనిపై కింది స్థాయిలో వ్యవసాయ సిబ్బందితో రైతులకు అవగాహన కల్పించి గ్రామాల్లో డప్పు చాటింపులు చేయించేలా ఏర్పాటు చేస్తున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కార్పొరేట్ వాకిటకు..సర్కారు సౌరభం
[ 18-05-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ప్రతిభ చూపిన విద్యార్థులకు ప్రభుత్వం కార్పొరేట్ విద్యకు సహకారం అందిస్తోంది. -
పరిశ్రమలు 900.. అధికారులు ఐదుగురు
[ 18-05-2024]
రసాయన, ఇతర పరిశ్రమల నుంచి వచ్చే ప్రమాదకర వ్యర్థాలను జాగ్రత్తగా నిర్వీర్యం చేయాలి. ఎక్కడ పడితే అక్కడ పారబోస్తే భూగర్భ జలాలు కలుషితం కావడంతో పాటు ప్రజలు వ్యాధుల బారిన పడే ప్రమాదం పొంచి ఉంది. -
ప్రముఖుల పల్లెల్లో..ప్రజాస్వామ్యం మురిసె
[ 18-05-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్లో ప్రముఖుల పల్లెల్లో ఓటు చైతన్యం వెల్లివిరిసింది. ఈ గ్రామాలకు చెందిన నేతలు ఎంపీలుగా, ఎమ్మెల్సీలుగా, ఎమ్మెల్యేలుగా సేవలు అందించడంతో పాటు ఇతర ముఖ్యులు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందేవిధంగా పల్లెవాసులు వారిని ప్రోత్సహించారు. -
చలో.. నెల్లిబండ గట్టు జాతర
[ 18-05-2024]
వందల ఏళ్ల చరిత్ర.. రెండేళ్లకోసారి జాతర.. వేలాది మంది భక్తుల రాక.. ఉమ్మడి జిల్లాలో దురాజ్పల్లి పెద్దగట్టు తర్వాతి స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకున్న చిన్నగట్టు జాతరకు నెల్లిబండ ముస్తాబైంది. -
పట్టభద్రులకు పోల్ చిట్టీలు
[ 18-05-2024]
వరంగల్- ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నిక నిర్వహణకు అధికారులు సన్నద్ధమయ్యారు. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో ప్రధాన పార్టీల తరఫున బరిలో ఉన్న అభ్యర్థులు ప్రచారంలో నిమగ్నమయ్యారు. -
పెరిగిన పోలింగ్.. ఎవరికి లాభించేనో?
[ 18-05-2024]
లోక్సభ ఎన్నికల క్రతువు ఇటీవలే ముగిసింది. అందరి దృష్టి భువనగిరి లోక్సభ పైనే ఉంది. ఇక్కడ గతంలో కంటే పోలింగ్ శాతం పెరగడంతో ఇది ఎవరికి లాభిస్తుందనే విషయమై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. -
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు.. అందనున్న ప్రత్యేక సేవలు
[ 18-05-2024]
సాధారణ సేవలకు మాత్రమే పరిమితమైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పల్లెదవాఖానాల్లో అదనంగా ఏడు రకాల వైద్య సేవలను గ్రామీణ ప్రాంతాల వాసులకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. -
అమ్మ అంత్యక్రియలకు అడ్డంకిగా ఆస్తి
[ 18-05-2024]
అమ్మ అంత్యక్రియలకు ఆస్తి పంపకం అడ్డంకిగా మారిన ఉదంతమిది. కన్నతల్లి అంత్యక్రియలు తమ బాధ్యత అనే విషయాన్ని మరిచి ఆ కుటుంబ సభ్యులు రెండు రోజులుగా ఆస్తి పంపకం విషయమై గ్రామపెద్దలతో ఎడతెగని చర్చలు జరిపారు -
ఆ చేపల పులుసు..మనసులు గెలుచు
[ 18-05-2024]
-
ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యం: బూర
[ 18-05-2024]
పార్లమెంట్ ఎన్నికల స్ఫూర్తితో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలు పనిచేయాలని భాజపా ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్, జిల్లా అధ్యక్షుడు పాశం భాస్కర్ కోరారు -
కలవరపెడుతున్న క్షయ
[ 18-05-2024]
క్షయ వ్యాధి కలవరపెడుతోంది. జిల్లాలో ప్రతి సంవత్సరం వ్యాధి బారినపడేవారు సంఖ్య పెరుగుతోంది. -
ఈసారైనా సీసీ లైనింగ్కు గ్రీన్సిగ్నల్ వచ్చేనా..?
[ 18-05-2024]
నల్గొండ జిల్లాలో 2.20 లక్షల ఎకరాలకు సాగు నీరందించే ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు(ఏఎంఆర్పీ) ప్రధాన కాల్వకు సిమెంటు కాంక్రీటు(సీసీ) లైనింగ్ చేసే పనులకు ఈ సారైనా ప్రభుత్వం పచ్చజెండా ఊపుతుందా..
తాజా వార్తలు (Latest News)
-
కనిపించని పోలింగ్ దస్త్రాలు?
-
ఎన్నికల పారితోషికం.. ఎందుకింత వ్యత్యాసం
-
పాపాలను పాతరేస్తారా.. తోడేళ్లకు తోడవుతారా?
-
కోనసీమలో అభ్యర్థుల ఆధిక్యంపై ఆసక్తి.. ఐపీఎల్ను తలపిస్తున్న బెట్టింగ్లు
-
పెళ్లి వస్త్రాల కోసం హైదరాబాద్ వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదం .. ఐదుగురి మృతి
-
ఆస్తి కోసం తల్లి, ఇద్దరు కుమార్తెల హత్య