ఫిర్యాదు వచ్చిందా.. చిటికెలో పరిష్కారం
జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలను విజయవంతం చేయడంలో కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్లు కీలకంగా పనిచేశాయి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించినందుకు రాష్ట్ర స్థాయిలో అవార్డు సైతం అందుకున్నారు.
సూర్యాపేట కలెక్టరేట్, న్యూస్టుడే
చివ్వెంల మండలంలోని ఓ గ్రామంలో ఓ పార్టీ నాయకుడి ఇంటికి బ్యానర్లు, పోస్టర్లు ఏర్పాటు చేసుకోగా దీనిపై మరో పార్టీ నాయకులు వారం క్రితం కంట్రోల్ రూమ్కు ఫిర్యాదు చేశారు. సిబ్బంది వెంటనే నోడల్ అధికారికి ఈ విషయం తెలియజేయగా ఆయన ఆ గ్రామ పంచాయతీ కార్యదర్శికి, పోలీస్ సిబ్బందిని అప్రమత్తం చేశారు. వారు అక్కడికి వెళ్లి బ్యానర్లు, పోస్టర్లు తొలగింపజేశారు.
సూర్యాపేటలో మూడు రోజుల క్రితం ఓ పార్టీకి చెందిన వారు రాత్రి పది గంటల తరువాత కూడా వాహనం ద్వారా మైకులతో పాటల ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ విషయమై స్థానికులు కంట్రోల్ రూమ్కు ఫిర్యాదు చేయగా అక్కడికి చేరుకున్న ఫ్లయింగ్ స్వ్కాడ్ బృందం ప్రచారం వాహనాన్ని నిలిపివేసి అక్కడి నుంచి పంపించింది.
జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలను విజయవంతం చేయడంలో కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్లు కీలకంగా పనిచేశాయి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించినందుకు రాష్ట్ర స్థాయిలో అవార్డు సైతం అందుకున్నారు. ఇదే స్ఫూర్తితో లోక్సభ ఎన్నికలనూ జరిపేందుకు అధికారులు ప్రణాళిక ప్రకారం ముందుకు సాగుతున్నారు. ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్లో ఏర్పాటు చేసిన 1950 కాల్సెంటర్, సీ విజిల్ యాప్ కేంద్రంలో వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నారు. కంట్రోల్ రూంకు వచ్చిన ప్రతి ఫిర్యాదును సిబ్బంది వెంటనే నమోదు చేసుకుని సంబంధిత అధికారులకు తెలియజేస్తున్నారు. 24 గంటల్లో పరిష్కరించేలా చొరవ తీసుకుంటున్నారు. పరిష్కరించకుంటే ఎందుకు చేయలేకపోయారో రోజూ నివేదికలో పొందుపరుస్తున్నారు.
1950 కాల్సెంటర్లో విధులు..
ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన కంట్రోల్ రూముల్లో సిబ్బంది మూడు విభాగాల్లో నిత్యం అందుబాటులో ఉంటున్నారు. ఓటు ఎక్కడుందో తెలుసుకోవడం, ఓటరు జాబితాలో తమ పేరు లేకపోయినా, ఒకే ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులవి వేర్వేరు ప్రాంతాల్లో ఓటు ఉన్నా వాటిని మార్పించేందుకు 1950 కాల్ సెంటర్ ఉపయోగపడుతుంది. ఈ నెంబర్ను సమాచారం అందించినట్లయితే సంబంధిత బీఎల్వోలకు సమాచారం చేరవేసి పరిష్కరించే విధంగా చొరవ తీసుకుంటున్నారు.
సీ విజిల్ యాప్..: అనుమతులు లేకుండా స్పీకర్ల వినియోగం, ఇళ్ల ఎదుట బ్యానర్లు, పోస్టర్లు ఏర్పాటు చేసినట్లయితే సీ విజిల్ యాప్లో ఫిర్యాదు చేయాలి. వాటిని సదరు సిబ్బంది ఫ్లయింగ్ స్క్వాడ్ బృందానికి చేరవేస్తారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే డబ్బు, మద్యం పంపిణీ, ఓటర్లను బెదిరించడం వంటివి చేస్తే ఫొటోలు, రికార్డులు, ఇతర ఆధారాలతో సీ విజిల్ యాప్లో నమోదు చేయాలి. వెంటనే ఫ్లయింగ్ స్వ్కాడ్లు అక్కడికి చేరుకుని విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటున్నారు.
సువిధ యాప్..: ప్రచారాల్లో భాగంగా సమావేశాలు, సభల అనుమతుల కోసం సువిధ యాప్ ద్వారా అనుమతులు ఇస్తున్నారు. దరఖాస్తుల్లో సరైన కారణాలు చూపకపోవడంతో ఈ ఎన్నికల్లో 291 ఫిర్యాదుల్లో 87 తిరస్కరించగా, 20 రద్దు కాగా, నాలుగు పరిశీలనలో ఉన్నాయి. 180 దరఖాస్తులను పరిష్కరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పట్టభద్రులారా ఆలోచించి ఓటు వేయండి: కేటీఆర్
[ 19-05-2024]
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో పార్టీ అభ్యర్థి రాకేశ్రెడ్డి విజయం కోసం కృషి చేయాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కోరారు. -
పెట్రోల్ బంక్లో లారీలో మంటలు
[ 19-05-2024]
భువనగిరిలోని ఓ పెట్రోల్ బంక్లో లారీలో మంటలు చెలరేగాయి. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం.. -
యాదాద్రి క్షేత్రానికి పోటెత్తిన భక్తులు.. ఉచిత దర్శనానికి 3 గంటల సమయం
[ 19-05-2024]
ఆదివారం సెలవు రోజు కావడంతో యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. -
ప్రాదేశిక సమరంపై స్పష్టత కరవు
[ 19-05-2024]
జిల్లా, మండల పరిషత్తుల ప్రాదేశిక నియోజకవర్గాల ఎన్నికలు గడువులోపు అయ్యే అవకాశం కనిపించడం లేదు. ఫలితంగా గ్రామ పంచాయతీలకు నియమించిన మాదిరిగానే జిల్లా, మండల పరిషత్తులకు ప్రత్యేకపాలన అధికారులను నియమించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. -
పీడీఎస్ బియ్యం వ్యవహారంలో తొమ్మిది మందిపై కేసు నమోదు
[ 19-05-2024]
పెద్దవూర సమీపంలో పీడీఎస్ బియ్యం దందా వ్యవహారంలో తొమ్మిది మందిపై కేసు నమోదు చేసినట్లు పెద్దవూర ఎస్ఐ వీరబాబు తెలిపారు. వీరిలో నలుగురిని అరెస్టు చేసినట్లు, మిగతా వారు పరారీలో ఉన్నారని శనివారం రాత్రి పత్రికా ప్రకటనలో పోలీసులు వెల్లడించారు. -
ఆరు నెలల్లో సూపర్స్పెషాలిటీ వైద్యసేవలు
[ 19-05-2024]
జిల్లా కేంద్రంలోని జనరల్ ఆసుపత్రి స్థాయి మరింత పెరగనుంది. ఎస్సెల్బీసీ ప్రాంతంలో రూ.120 కోట్లతో 37 ఎకరాల్లో నిర్మిస్తున్న వైద్యకళాశాల పనులు సెప్టెంబరు లోపు పూర్తవుతాయని టీఎస్ఎంఐడీసీ అధికారులు చెబుతున్నారు. -
బడి.. పూర్వపు ఒరవడి!
[ 19-05-2024]
సీఎం ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లాలోని పలు గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలు తిరిగి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 203 చోట్ల పాఠశాలలు ప్రారంభించాలని నిర్ణయించగా.. అత్యధికంగా నల్గొండ జిల్లాలో 24, భువనగిరి, సూర్యాపేట జిల్లాలో పలు గ్రామాల్లో పాఠశాలలు ప్రారంభించనున్నారు. -
వనమాల.. బ్యాడ్మింటన్లో భళా!
[ 19-05-2024]
మిర్యాలగూడ పట్టణానికి చెందిన వనమాల శ్రీకాంత్- భవానీల కుమారుడు శశాంక్ చిన్నతనం నుంచి బ్యాడ్మింటన్లో అద్భుత ప్రతిభ కనబరచడంతో శిక్షకుడు మారబోయిన రామకృష్ణ సూచన మేరకు హైదరాబాద్లో ప్రతిష్ఠాత్మక గోపిచంద్ అకాడమీలో చేర్పించారు. -
‘అద్విత’ంగా ప్రతిభ చూపి..!
[ 19-05-2024]
మిర్యాలగూడ పట్టణానికి చెందిన బిక్కుమళ్ల అద్విత్ కృష్ణ ఈఏపీసెట్ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో 275 ర్యాంకు సాధించాడు. పట్టణంలోని కేఎల్ఎన్ జూనియర్ కళాశాల కరస్పాండెంట్ బిక్కుమళ్ల కిరణ్కుమార్, శైలజ దంపతుల కుమారుడు అద్విత్ కృష్ణ స్థానికంగా కళాశాలలో ఇంటర్ బైపీసీ 958 మార్కులతో పూర్తిచేశాడు. -
ఈతకు వెళ్లిన బాలుడి గల్లంతు
[ 19-05-2024]
నీటి ప్రమాదాలు జరిగినప్పుడు మరణించొద్దనే ఆలోచనతో తండ్రి తన పిల్లలకు మూడు రోజులుగా ఈత నేర్పిస్తున్నాడు. ఈత వచ్చిందనే సంతోషంలో తండ్రికి తెలియకుండా మళ్లీ బావిలోకి దూకిన బాలుడు గల్లంతైన ఘటన శనివారం సాయంత్రం తిరుమలగిరిలో జరిగింది. -
పంచనారసింహులకు భక్తుల మొక్కు పూజలు
[ 19-05-2024]
పంచనారసింహులు కొలువై ఉన్న యాదాద్రి పుణ్యక్షేత్రంలో శనివారం భక్త జనుల ఆరాధనలు శాస్త్రోక్తంగా కొనసాగాయి. సుప్రభాతం నిర్వహించిన పూజారులను బిందెతీర్థంతో చేపట్టిన కైంకర్యాలు ఆలయ విశిష్టతకు అనుగుణంగా కొనసాగాయి. -
కొత్తగా 24 ప్రాథమిక పాఠశాలలు
[ 19-05-2024]
ప్రభుత్వ పాఠశాలలు లేని గ్రామపంచాయతీల్లో నూతనంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం కార్యరూపం దాల్చనుంది. జిల్లా వ్యాప్తంగా 421 గ్రామపంచాయతీలు ఉండగా 24 గ్రామపంచాయతీల పరిధిలో ప్రభుత్వ పాఠశాలలు లేనట్లు అధికారులు ప్రభుత్వానికి నివేదించారు.
తాజా వార్తలు (Latest News)
-
రాజస్థాన్ను ముంచిన వరుణుడు.. హైదరాబాద్ను వరించిన అదృష్టం
-
భాజపాకు యూపీలో ఒక్క సీటు మాత్రమే.. రాహుల్ జోస్యం
-
‘బ్లూ ఆరిజిన్’ ప్రయోగం విజయవంతం.. అంతరిక్షయానం చేసిన తొలి తెలుగు వ్యక్తి
-
‘భారతీయుడు 2’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ లుక్తో అజిత్
-
పీర్జాదిగూడ మేయర్, కార్పొరేటర్ల కిడ్నాప్నకు కాంగ్రెస్ యత్నం: హరీశ్రావు
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!