logo

పోలింగ్‌కు రెండు రోజుల ముందు నుంచి మద్యం విక్రయాలు బంద్

ప్రశాంత వాతావరణంలో, పారదర్శకమైన ఎన్నికల నిర్వహణలో భాగంగా ఈనెల 13వ తేదీన పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ జరగనుంది.

Published : 09 May 2024 17:45 IST

భువనగిరి: ప్రశాంత వాతావరణంలో, పారదర్శకమైన ఎన్నికల నిర్వహణలో భాగంగా ఈనెల 13వ తేదీన పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఈనెల 11న సాయంత్రం 5 గంటల నుంచి 13వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు, లేదా పోలింగ్ ప్రక్రియ పూర్తి అయ్యేంత వరకు, అలాగే జూన్ 4న కౌంటింగ్ పూర్తి అయ్యేంత వరకు జిల్లాలో అన్ని వైన్ షాపులు, బార్లు, కల్లు దుకాణాలు, కల్లు డిపోలు బంద్ చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు హనుమంతు కే.జెండగే తెలిపారు. దీనికి అనుగుణంగా ఎక్సైజ్ శాఖ అన్ని వైన్ షాపులు, బార్లు, కల్లు దుకాణాలు, కల్లు డిపోలను బంద్ చేసింది. ఈ నిబంధనను ఉల్లంఘించినట్లయితే 1951 ప్రజా ప్రాతినిథ్యం చట్టం 135 సీ సెక్షన్ ప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని