logo

కాంగ్రెస్‌లో చేరిన భారాస ఎంపీపీ

పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి సమచిత స్థానం కల్పిస్తామని ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి అన్నారు.

Updated : 09 May 2024 19:43 IST

కోదాడ: పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి సమచిత స్థానం కల్పిస్తామని ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని ఏకైక భారాస ఎంపీపీ, నడిగూడెం మండల ఎంపీపీ యాతాకుల జ్యోతికి పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించి ఆమె మాట్లాడారు. దీంతో నియోజకవర్గంలో భారాస తరపున గెలిచిన ఎంపీపీలందరూ కాంగ్రెస్‌లోకి చేరడం విశేషం. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి చింతకుంట లక్ష్మీనారాయణ, పుర ఛైర్‌పర్సన్ ప్రమీల, పట్టణ అధ్యక్షుడు రామారావు, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని