logo

వ్యక్తి దారుణ హత్య

మండలంలోని ఆంగోతుతండాలో ఓ వ్యక్తి గురువారం తెల్లవారుజామున దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన ఆంగోతు జగ్రు(50) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు

Published : 10 May 2024 07:03 IST

ఆంగోతు జగ్రు
కొండమల్లేపల్లి, న్యూస్‌టుడే: మండలంలోని ఆంగోతుతండాలో ఓ వ్యక్తి గురువారం తెల్లవారుజామున దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన ఆంగోతు జగ్రు(50) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. బుధవారం మండలంలోని కొలుముంతలపహడ్‌ గ్రామంలో అతని బంధువుల ఇంట్లో జరిగిన శుభకార్యానికి భార్య, పిల్లలతో కలిసి వెళ్లాడు. భార్యను అక్కడే ఉంచి తన కుమార్తెతో కలిసి తండాకు వచ్చాడు. కూతురు ఇంట్లో.. అతను ఆరుబయట నిద్రించాడు. తెల్లవారుజామున అలజడి రావడంతో కూతురు బయటికి వచ్చి చూడగా జగ్రు తల ఛిద్రమై విగత జీవిగా పడి ఉన్నాడు. సీఐ ధనుంజయ, ఎస్సై రాంమూర్తి ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. మృతునికి భార్య నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడున్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. తండాలో ఎలాంటి ఉద్రీక్తత చోటు చేసుకోకుండా సీఐ ధనుంజయ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని