ప్చ్.. అవగాహన లేకనే
చదువులకు జిల్లా పెట్టింది పేరు. ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి ఇక్కడకు వచ్చి చదువుతుంటారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. జిల్లా నుంచి ఉన్నత చదువులకు విదేశాలకు వెళ్లే పేదల సంఖ్య తక్కువగా ఉంటోంది.
ఎనిమిది మందికే సాయం
నాలుగేళ్ల తర్వాత విదేశీ చదువులకు పథకం అమలు
న్యూస్టుడే, నెల్లూరు (సంక్షేమం)
మైపాడులో విదేశీ విద్యకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థి వివరాలను
తెలుసుకుంటున్న బీసీ సంక్షేమశాఖ అధికారి వెంకటయ్య (పాతచిత్రం)
చదువులకు జిల్లా పెట్టింది పేరు. ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుంచి ఇక్కడకు వచ్చి చదువుతుంటారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. జిల్లా నుంచి ఉన్నత చదువులకు విదేశాలకు వెళ్లే పేదల సంఖ్య తక్కువగా ఉంటోంది. గత ప్రభుత్వ హయాంలో ఏటా ప్రతిభావంతులకు అవకాశాలు లభించగా.. 2019 నుంచి ఆ పథకం పూర్తిస్థాయిలో ఆగిపోయింది. ఈనెల 3వ తేదీన ప్రభుత్వం జగనన్న విదేశీ విద్యా దీవెన పేరుతో పథకాన్ని ప్రారంభించింది. జిల్లాలో 8 మంది విద్యార్థులకు తొలి విడత నిధులను ఇటీవల మంజూరు చేసింది.
ఏడాదికి నాలుగు విడతల్లో నిధులు
విదేశీ విద్యా దీవెన కింద ఏడాదికి నాలుగు విడతల్లో నిధులు మంజూరు చేయనుంది. వివిధ దేశాల్లో 200 యూనివర్సిటీలను ఎంపిక చేసి వాటిలో ప్రవేశం పొందిన విద్యార్థులకు ఈ పథకం అమలు చేయనుంది. గుర్తించిన వంద విశ్వవిద్యాలయాల్లో స్థానం పొందిన విద్యార్థులకు గరిష్ఠంగా రూ.1.25 కోట్లు, వంద నుంచి 200 యూనివర్సిటీలకు ఎంపికైన విద్యార్థులకు రూ.కోటి వరకు లేదా మొత్తం ఫీజును చెల్లించనుంది. విమాన, వీసీ ఛార్జీలు కూడా భరించనుంది. ఒక్కో సెమిస్టర్ మార్కులు అప్లోడ్ చేసిన విద్యార్థులకు ఈ నిధులు మంజూరు చేయనుంది.
మొన్నటివరకు ఊసేలేదు..
2019కు ముందు ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం అంబేడ్కర్ ఓవర్సిస్ విద్యా నిధి పథకం కింద విదేశాల్లో చదివే అవకాశాన్ని కల్పించింది. మైనార్టీలకు ఓవర్సిస్ విద్యా పథకం కింద, బీసీలకు ఎన్టీఆర్ విదేశీ విద్య కింద విదేశాలకు వెళ్లి ఉన్నత చదువులు చదివేలా ప్రోత్సహించింది. సాంఘిక సంక్షేమశాఖలో 2013-14లో రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం ఎస్సీలకు ప్రవేశ పెట్టింది. తొలుత రూ.2 లక్షల లోపు సంవత్సర ఆదాయమున్న వారు దరఖాస్తు చేసేవారు. 2015-16లో దీన్ని రూ.6 లక్షలకు పెంచారు. ప్రస్తుతం రూ.8 లక్షల కుటుంబ సంవత్సర ఆదాయం నిర్ణయించారు. 2019కు ముందు అప్పట్లో ఏటా విద్యార్థులు విదేశాలకు వెళ్లేవారు.
ఉందో.. లేదో తెలియకనే..
2019కి ముందు వరకు అమల్లో ఉన్న విదేశీ విద్య పథకాలు నిలిపివేసి.. నాలుగేళ్ల తర్వాత ప్రభుత్వం జగనన్న విదేశీ విద్యాదీవెన పేరుతో తిరిగి ప్రారంభించింది. ఎక్కువ మందికి ఈ పథకం ఉందో, లేదో అవగాహన లేకపోవడంతో తక్కువ మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీలకు చెందిన దాదాపు 30 మందికి పైగా దరఖాస్తు చేయగా వీరిలో 8 మందిని ఎంపిక చేశారు. జ్ఞాన భూమి పోర్టల్లో అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసిన తర్వాత జిల్లా స్థాయిలో ఆయా సంక్షేమ అధికారులు పరిశీలించి ఆమోదిస్తారు. ఆ తర్వాత రాష్ట్రస్థాయిలో అధికారుల కమిటీ పరిశీలించి అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. జిల్లాలో ఎస్సీలో ఇద్దరు, బీసీలో ఒకరు, ఈబీసీల్లో ముగ్గురు, మైనార్టీల్లో ఇద్దరు చొప్పున విద్యార్థులను ఎంపిక చేసి నిధులు మంజూరు చేసింది. వీరు విదేశాల్లో ఎంఎస్, ఎంబీబీఎస్, బయో ఇంజినీరింగ్ వంటి కోర్సులు చదవనున్నారు.
దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి ఆమోదిస్తాం
ప్రతిభావంతులైన పేద విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్య చదివేందుకు ఈ పథకంతో అవకాశముంది. తగిన ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకుంటే క్షేత్రస్థాయిలో సమగ్ర పరిశీలన చేసి కలెక్టర్ ఆమోదంతో రాష్ట్రస్థాయికి పంపుతాం. వారు అన్ని రకాలుగా పరిశీలించి విదేశీ విద్యా దీవెన పథకానికి ఎంపిక చేస్తారు. ఏటా రెండు స్పెల్లో ఈ ఎంపిక ప్రక్రియ జరుగుతుంది.
- వెంకటయ్య, బీసీ సంక్షేమశాఖ అధికారి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొండయ్య.. లెక్కే వేరు
[ 26-04-2024]
ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసేవారిలో ఎక్కువ మంది రాజకీయ, ఆర్థిక, సామాజిక బలాలున్న వారే ఉంటున్నారు. కొందరు పార్టీల తరఫున ఇంకొందరు ప్రధాన పార్టీల అభ్యర్థులకు అనుకూలంగా వ్యవహరించటానికి స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేయటం సాధారణం. -
రేపు జిల్లాలో చంద్రబాబు పర్యటన
[ 26-04-2024]
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ నెల 27వ తేదీ జిల్లాలో పర్యటించనున్నారు. ఆ రోజు ఆత్మకూరు, బుచ్చిరెడ్డిపాళెంలలో నిర్వహించే ప్రజాగళం సభల్లో పాల్గొంటారు. -
యాడుంది శిక్షణ.. అయిదేళ్లూ వంచన
[ 26-04-2024]
అక్కాచెల్లెమ్మలను ఆర్థికంగా ప్రోత్సహించి, అన్ని విధాలా అండగా ఉంటానన్న సీఎం జగన్ మాటలు.. ప్రకటనలకే పరిమితమయ్యాయి. సంక్షేమ పథకాలు అటుంచి.. వారికి నైపుణ్య శిక్షణ ఇచ్చి.. నిలదొక్కుకునేలా చూడటంలో వైకాపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. -
సోమశిలలో అడుగంటిన జలం
[ 26-04-2024]
జిల్లా వరదాయిని సోమశిల జలాశయంలో నీటి నిల్వలు రోజు రోజుకూ అడుగంటుతున్నాయి. భవిష్యత్తు అవసరాలు దృష్టిలో పెట్టుకోకుండా అధికారులు తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు.. -
ముగిసిన నామినేషన్ల ఘట్టం
[ 26-04-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో ప్రధాన ఘట్టమైన నామినేషన్ల పర్వం గురువారంతో ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు 230 మంది 283 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. -
దోచుకున్నది.. వైకాపా ఘనులే!
[ 26-04-2024]
మొదట్లో గ్రావెల్, మట్టి కొల్లగొడుతూ విపక్ష నేతలపై నెట్టేందుకు యత్నించిన అధికార పార్టీ నాయకులు.. క్వార్ట్జ్ వ్యవహారంలోనూ అదే పద్ధతిని అవలంబించారు. తొలుత వాటాలు తేలక వారిలో వారే తిట్టుకున్న జిల్లా నాయకులు.. పార్టీ అధిష్ఠానం జోక్యంతో హద్దులు నిర్ణయించుకుని దోపిడీకి తెగబడ్డారు. -
లక్ష్యంపై గురి.. ర్యాంకుల సిరి
[ 26-04-2024]
కసితో చదివారు.. కుటుంబ నేపథ్యం ఏదైనా కలల సాధనకు తపించారు. లక్ష్యాన్ని సాధించి తల్లిదండ్రుల మోములో ఆనందం నింపారు. జాతీయ స్థాయిలో జేఈఈ మెయిన్స్ రెండో విడత ఫలితాలు గురువారం విడుదల చేశారు. -
చెన్నకేశవుడి వైభవం
[ 26-04-2024]
స్థానిక యర్రబల్లిపాలెం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాలలో ముఖ్యమైన రథోత్సవం గురువారం కనులపండువగా సాగింది.. -
వేణుగోపాలుడి రథోత్సవం
[ 26-04-2024]
శ్రీ వేణుగోపాలస్వామి దేవస్థానంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం స్వామివారికి రథోత్సవం జరిగింది. -
మద్యం డంపుల సూత్రధారి కాకాణే : సోమిరెడ్డి
[ 26-04-2024]
సర్వేపల్లి నియోజకవర్గంలో లభ్యమవుతున్న మద్యం డంపుల్లో పాత్రదారులు వైకాపా నాయకులైతే.. సూత్రధారి మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డేనని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఆరోపించారు. -
కోట్ల వ్యయం.. నిరుపయోగం
[ 26-04-2024]
ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వంలో అప్పటి ఆర్థికమంత్రి ఆనం రామనారాయణరెడ్డి వైద్య విద్యార్థుల విద్యాభ్యాసంలో భాగంగా గ్రామీణ ప్రాంతంలో శిక్షణ పొందేందుకు ఏర్పాటు చేసిన శిక్షణ కేంద్రం నిరుపయోగంగా మారింది. -
జగన్మాయ.. వైద్యం అందదయా!
[ 26-04-2024]
ఆసుపత్రులను అన్ని సౌకర్యాలతో తీర్చిదిద్ది పేదలకు మెరుగైన వైద్యం అందిస్తామన్న ముఖ్యమంత్రి జగన్ మాటలు ఆచరణలో కనిపించడం లేదు. అత్యవసర సమయాల్లో వైద్యానికి వెళితే చేయి చూసే నాథుడు ఉండడం లేదు. -
కనుల ముందుకు కలల లోకం
[ 26-04-2024]
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వేసవి సెలవులు రానే వచ్చాయి.. వస్తూ వస్తూ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్సిటీలో వినోదాల వేడుకలను తీసుకువచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం