logo

మద్యం డంపుల సూత్రధారి కాకాణే : సోమిరెడ్డి

సర్వేపల్లి నియోజకవర్గంలో లభ్యమవుతున్న మద్యం డంపుల్లో పాత్రదారులు వైకాపా నాయకులైతే.. సూత్రధారి మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డేనని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆరోపించారు.

Published : 26 Apr 2024 05:07 IST

ఈనాడు, నెల్లూరు: సర్వేపల్లి నియోజకవర్గంలో లభ్యమవుతున్న మద్యం డంపుల్లో పాత్రదారులు వైకాపా నాయకులైతే.. సూత్రధారి మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డేనని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆరోపించారు. నెల్లూరులోని తెదేపా కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘ఇప్పటికే సర్వేపల్లి నియోజకవర్గంలో రెండు డంప్‌లు దొరికాయి. పంటపాళెంలో మద్యంతో చిక్కిన మారు సుధాకర్‌రెడ్డి.. కాకాణి గోవర్ధన్‌రెడ్డికి వ్యాపారంలో భాగస్వామి. ఆయన దగ్గర 4,232 మద్యం సీసాలు దొరికాయి. పొదలకూరు మండలం విరువూరులో చిర్ల రాజగోపాల్‌రెడ్డి రైసుమిల్లులో 2069 సీసాలు చిక్కాయి. సర్వేపల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉన్న కాకాణి గోవర్ధన్‌రెడ్డికి ప్రయోజనం కలిగించేందుకే భారీఎత్తున మద్యం డంప్‌ చేశారు. అధికారులు ఎందుకు విచారణ చేయడం లేదు. జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్‌ ఇప్పుడైనా స్పందించాల’ని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని