రైలులో భద్రతెంత?
‘రైలులో ప్రయాణించండి.. గమ్యస్థానాలకు సురక్షితంగా చేరండి’ అని రైల్వే అధికారులు చెప్పే మాటలపై ప్రజల్లో నమ్మకం సడలుతోంది.
వరుస సంఘటనలతో ప్రయాణికుల్లో ఆందోళన
భద్రత పెంచాలని కోరుతున్న ప్రజలు
‘రైలులో ప్రయాణించండి.. గమ్యస్థానాలకు సురక్షితంగా చేరండి’ అని రైల్వే అధికారులు చెప్పే మాటలపై ప్రజల్లో నమ్మకం సడలుతోంది. వరుస సంఘటనల నేపథ్యంలో ప్రయాణికుల్లో అభద్రతా భావం పెరుగుతోంది. రైలులో భద్రత కల్పించాల్సిన శాఖల్లో సిబ్బంది కొరత వేధిస్తుండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. వందలాది మంది ప్రయాణించే రైలులో కనీస భద్రత కల్పించకపోవడమే దొంగలకు కలిసి వచ్చిందనే విమర్శలు వస్తున్నాయి. ముందస్తు ప్రణాళిక ప్రకారమే ఉలవపాడు, తెట్టు మధ్య రైలులో దోపిడీ జరిగిందనే మాట వినిపిస్తుండగా- దీన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న రైల్వే పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.
నెల్లూరు(నేర విభాగం), కావలి, బిట్రగుంట, న్యూస్టుడే
నెల్లూరు జిల్లా పరిధిలో జరిగిన రెండు వేర్వేరు సంఘటనలు రైల్వే సిబ్బంది పనితీరుపై విమర్శలకు దారి తీస్తున్నాయి. గత నెల 30న ముసునూరు సమీపంలో రైల్వే ట్రాక్పై ఇనుప ముక్క అడ్డుగా ఉంచి సంఘటన మరువక ముందే.. ఆదివారం అర్ధరాత్రి ఓ రైలులో దోపిడీకి పాల్పడటం.. మరో రైలులో దోపిడీకి యత్నించడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రైలులో సొమ్ములు పోగొట్టుకున్న ప్రయాణికులు కావలిలో ఫిర్యాదు చేసేందుకు యత్నించినా.. అక్కడి సిబ్బంది పట్టించుకోకపోవడం.. మీరు ఎక్కడ దిగుతారో.. అక్కడే కేసు పెట్టాలనీ సూచించడమూ బాధితులను ఆవేదనకు గురి చేసింది. సూళ్లూరుపేటలో ఓ మహిళ మొదట ఫిర్యాదు ఇవ్వగా.. నరేంద్రరెడ్డి అనే ప్రయాణికుడు తన భార్యకు చెందిన వంద గ్రాముల బంగారం పోయిందని ఫిర్యాదు చేశారు. మిగిలిన వారు చెన్నైలో ఫిర్యాదు చేయాల్సి వచ్చింది.
వేధిస్తున్న సిబ్బంది కొరత
విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో నిత్యం 120 రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. గత పదేళ్లలో రైళ్లు, ప్రయాణికుల సంఖ్యకు తగ్గట్టు భద్రతా సిబ్బందిని పెంచకపోగా- ఉద్యోగ విరమణ చేసిన వారి స్థానాలనూ సక్రమంగా భర్తీ చేయలేదు. ఇదే నేరగాళ్లకు కలిసి వస్తోంది. రైల్వే ఆస్తుల పరిరక్షణకు ఆర్పీఎఫ్, ప్రయాణికుల భద్రతకు జీఆర్పీ పోలీసుశాఖలు ఉన్నా.. ఆ రెండింటిలోనూ దాదాపు 35 శాతం సిబ్బంది కొరత ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. నెల్లూరు స్టేషన్ పరిధిలో 30 మంది ఉండాల్సి ఉండగా- 18 మంది మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. జీఆర్పీ పోలీసులకు రైలు నుంచి పడిన కేసులు, ఆత్మహత్య చేసుకున్న వారి మృతదేహాలు పోస్టుమార్టం చేయించడం.. వాటి దర్యాప్తుతోనే సరిపోతోంది. ఆ క్రమంలో ప్రయాణికుల భద్రతపై దృష్టి పెట్టలేకపోతున్నారనే అభిప్రాయాలు ఉన్నాయి.
చిక్కా గ్యాంగ్ పనేనా.!
రైలును ప్రణాళిక ప్రకారం నిలిపి.. ప్రయాణికుల దగ్గరున్న సొమ్ములు కాజేయడంలో హరియాణకు చెందిన చిక్కా గ్యాంగ్ ఆరితేరింది. ఆ క్రమంలో ఇక్కడా చిక్కా గ్యాంగ్ పనే అయి ఉంటుందని రైల్వే పోలీసులు అనుమానిస్తున్నారు. ఎస్కార్ట్ లేని రైలు.. రోడ్డు దగ్గర ఉన్న ప్రాంతం.. నిదానంగా వెళ్లే ప్రదేశాలను ముందుగానే గుర్తించి దోపిడీకి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. కొందరు రైలులోనే ఉండగా.. మరికొందరు క్షేత్రస్థాయిలో సహకరించారా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ముందుగా రెక్కీ చేసి ఉలవపాడు-తెట్టు మధ్యలోని మలుపు దగ్గర అన్ని రైళ్లు కాస్త నిదానంగా వెళతాయని తెలుసుకున్నారా? అనే అంశంపైనా ఆరా తీస్తున్నారు. 2014లో ఇదే ప్రాంతంలో దొంగతనం జరగ్గా.. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే జరిగిందంటున్న పోలీసులు, అధికారులు.. రైలు, రోడ్డు మార్గాలను క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు.
దొంగలను త్వరితంగా పట్టుకుంటాం
రైలులో చైన్ లాగి దొంగతనాలు చేయడంలో చిక్కా గ్యాంగ్ ఆరితేరింది. ఇది కూడా వారి పనేనని భావిస్తున్నాం. ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నాం. చార్మినార్ రైలులోనూ దొంగతనం చేసేందుకు యత్నించారు. ఆ క్రమంలో రైలు నిలపాలని చూడగా మా సిబ్బంది అడ్డుకున్నారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటాం. వీలైనంత త్వరగా దొంగలను పట్టుకుంటాం.
మల్లికార్జునరావు, డీఎస్పీ, జీఆర్పీ, నెల్లూరు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల అందజేత
[ 19-05-2024]
పట్టణంలోని రవి నర్సింగ్ హోంలో అధ్యక్షుడు తోట వెంకటేశ్వర్లు అధ్యక్షతన ప్రతిభా పురస్కారాల కార్యక్రమం జరిగింది. -
జిల్లా వ్యాప్తంగా కార్డన్ సెర్చ్
[ 19-05-2024]
నెల్లూరు ఎస్పీ ఆరీఫ్ హఫీస్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ఠాణాల పరిధిలో పోలీసులు కార్డన్ సెర్చ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. -
పేకమేడలా.. జగనన్న ఇళ్లు.. చేతితో లాగితే ఊడుతున్న శ్లాబ్!
[ 19-05-2024]
వెంకటాచలం మండలం కంటేపల్లికి చెందిన అద్దూరు కామాక్షికి ప్రభుత్వం జగనన్న కాలనీలో ఇంటి స్థలంతో పాటు పక్కా ఇళ్లు మంజూరు చేసింది. -
రోడ్లు అధ్వానం.. పట్టించుకోని ప్రభుత్వం
[ 19-05-2024]
కందుకూరు నియోజకవర్గంలో రహదారులు అధ్వానంగా మారాయి. ఏళ్ల తరబడి ప్రభుత్వం పట్టించుకున్న పాపానపోలేదు. -
బోర్లు.. బాగు చేస్తే దాహం తీరు
[ 19-05-2024]
ఎండలు ముదిరాయి. రక్షిత పథకాలు పనిచేయడం లేదు. తాగునీటికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఈసమయంలో ఉపయోగపడే చేతి పంపులు అలంకారప్రాయంగా మారాయి -
అతి తక్కువ వడ్డీకే రిటెయిల్ రుణాలు
[ 19-05-2024]
తక్కువ వడ్డీకే రిటెయిల్ రుణాలు ఇవ్వనున్నట్లు యూనియన్ బ్యాంక్ రీజనల్ హెడ్ రాజశేఖర్ పేర్కొన్నారు. -
తాళం వేసిన ఇళ్లే లక్ష్యం.. రాత్రులు దొంగతనం
[ 19-05-2024]
రాత్రుల్లో తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్న దొంగను పోలీసులు అరెస్టు చేశారు. -
జాతీయ రహదారిపై ప్రమాదం
[ 19-05-2024]
జాతీయ రహదారిపై వెళుతూ ఆగిన లారీని కారు ఢీకొనడంతో నలుగురికి తీవ్ర గాయాలైన ఘటన నార్తురాజుపాళెం సమీపంలో జాతీయ రహదారిపై జరిగింది. -
హతవిధీ..పట్టించుకునేవారేరీ!
[ 19-05-2024]
నెల్లూరు నగరంలోని ప్రసిద్ధ బారా షహీద్ దర్గా పాలకులు, అధికారుల నిర్లక్ష్యానికి గురవుతోంది. -
22న జిల్లాకు గవర్నర్ రాక
[ 19-05-2024]
రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఈ నెల 22వ తేదీ నెల్లూరుకు రానున్నట్లు కలెక్టర్ హరినారాయణన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. -
మెట్ట రైలుపై చిన్న చూపు
[ 19-05-2024]
మెట్ట ప్రాంత వాసుల దశాబ్దాల కల.. నడికుడి- శ్రీకాళహస్తి రైల్వే లైన్.. అయిదేళ్ల వైకాపా పాలనలో ఈ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేయడంతో.. పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారాయి -
స్ట్రాంగ్ రూమ్కు పోస్టల్ బ్యాలెట్లు
[ 19-05-2024]
నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి పోస్టులో వచ్చిన పోస్టల్ బ్యాలెట్లను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములో ఉంచి సీల్ వేశారు. -
నేటి నుంచి పెంచలకోన బ్రహ్మోత్సవాలు
[ 19-05-2024]
బ్రహ్మోత్సవాలకు పెంచలకోన క్షేత్రం ముస్తాబైంది. నేటి నుంచి ప్రారంభమయ్యే ఉత్సవాలు 25వ తేదీ వరకు జరగనుండగా- ఆదివారం స్వామి అత్తారిల్లుగా చెప్పుకొనే గోనుపల్లి ఆలయం నుంచి ఉత్సవ మూర్తులను పెంచలకోన క్షేత్రానికి చేర్చనున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణ కేబినెట్ భేటి.. షరతులతో కూడిన అనుమతిచ్చిన ఈసీ
-
అందుకే భారత్తో వాణిజ్య బంధం తెగిపోయింది: పాక్
-
పట్టభద్రులారా ఆలోచించి ఓటు వేయండి: కేటీఆర్
-
ఎంపీగా గెలిస్తే.. బాలీవుడ్ను వీడుతారా? కంగనా ఏం చెప్పారంటే..
-
పంచన్ లామా ఎక్కడ: చైనాను మరోసారి అడిగిన అమెరికా
-
తిరుపతి జిల్లాలో పలుచోట్ల ‘సిట్’ విచారణ.. పలు విషయాలపై ఆరా!