మాటలే.. పనుల్లేవ్!
పట్టణంలో ప్రధానమైన ట్రంకురోడ్డు అభివృద్ధి చేస్తామని సీఎం జగన్, ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి పలుమార్లు హామీలు ఇచ్చారు.
అమలుకాని సీఎం, ఎమ్మెల్యే హామీ
అభివృద్ధికి నోచుకోని ట్రంకురోడ్డు
పట్టణంలో ప్రధానమైన ట్రంకురోడ్డు అభివృద్ధి చేస్తామని సీఎం జగన్, ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి పలుమార్లు హామీలు ఇచ్చారు. విస్తరణ పనులు నిలిచిపోయి ఏడాది దాటుతోంది.
న్యూస్టుడే, కావలి
పట్టణంలో నుంచి వెళ్లే ట్రంకురోడ్డుకు ఇరువైపులా జనావాసాలు పెరిగాయి. ఆరుకిలోమీటర్ల వరకు ఉన్న మార్గంలో నిత్యం ట్రాఫిక్ ఇక్కట్లు నెలకొంటున్నాయి. ఈనేపథ్యంలో దీన్ని విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు రూ.56 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఇరువైపులా ఉన్న విద్యుత్తు లైన్లు మార్చాలి. దీనికి డిస్కంకు ధరావత్తు చెల్లించాల్సి ఉంది. పురపాలక సంఘం చెల్లిస్తుందని భావించారు. అంత మొత్తం చెల్లించేందుకు నిధుల వెసులుబాటు లేదని పురపాలక సంఘం చేతులెత్తేసింది. దీంతో గత ఏడాది మే 12న కావలికి సీఎం వచ్చిన సమయంలో ట్రంకురోడ్డు పనులకు మరో రూ.15 కోట్లు అదనంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. ఆ నిధుల విడుదల లేదు సరి కదా, ముందుగా జరుగుతున్న పనులకు ప్రభుత్వ విధానంతో అడ్డంకులు ఏర్పడ్డాయి.
59 జీవోతో ఇక్కట్లు
రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది విడుదల చేసిన జీవో 59 ప్రకారం ఆర్థిక కేటాయింపులకనుగుణంగా ఇంజినీరింగ్ విభాగాలు పనులను చేయాలి. కేటాయింపులకు మించి చేస్తే ఈఈలు బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈమెలికతో ఈఈ వెనుకడుగు వేశారు. మూడేళ్ల క్రితం ప్రారంభించగా నత్తనడకన సాగుతున్నాయి. ఇప్పటివరకు ముసునూరు ప్రాంతంలో కాలువల నిర్మించారు.
ఎమ్మెల్యే తొలి కోరిక
సీఎం జగన్ పదవీ బాధ్యతలు సీˆ్వకరించాక ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి అడిగిన తొలి కోరిక ఇదే. దీన్ని పూర్తి చేస్తానని ప్రతి సభలోనూ గొప్పగా చెప్పారు. అయిదేళ్లయినా అయిదుశాతం కూడా కనిపించకపోవడం విశేషం. ఆయన ఇంటి ముందు దెబ్బతిన్నా చేయించలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
200 మంది పేదలకు అన్నదానం
[ 02-05-2024]
కావలి పట్టణం కచ్చేరి మిట్ట నివాసులు కీర్తిశేషులు శ్రీనివాస వరప్రసాద రావు మూడవ వర్ధంతి సందర్భంగా వారి సతీమణి సుజాత అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. -
బోగోలు మండలంలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం
[ 02-05-2024]
బోగోలు మండలంలో కావలి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి పొదలకూరు కళ్యాణ్ ఎన్నికల ప్రచారం చేశారు. -
తెదేపాలో చేరిన రిటైర్డ్ ఫిజికల్ డైరెక్టర్
[ 02-05-2024]
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తెదేపాలో చేరికల పర్వం కొనసాగుతూనే ఉంది. -
తెదేపాలో చేరిన పలువురు వైకాపా నేతలు
[ 02-05-2024]
దగదర్తి మండలం కౌరుగుంట పంచాయతీ సున్నపుబట్టీ గ్రామంలోని ఎస్టీ కాలనీకి చెందిన పలువురు వైకాపా నాయకులు మాజీ ఇరిగేషన్ బోర్డు డైరెక్టర్ మాలేపాటి రవీంద్ర నాయుడు సమక్షంలో తెదేపాలో చేరారు. -
తెదేపా ప్రభంజనం ఖాయం
[ 02-05-2024]
‘నెల్లూరు జిల్లాలో తెదేపా ప్రభంజనం ఖాయం. ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డితో పాటు.. నెల్లూరు నగర, గ్రామీణ ఎమ్మెల్యేలుగా నారాయణ, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిలను గెలిపించండి. -
జగనన్న ఇళ్లు.. అక్రమాల వాకిళ్లు!
[ 02-05-2024]
ఒక్క అవకాశమివ్వండి.. మీ సొంతింటి కల నెరవేరుస్తాం.. అని ఎన్నికల ముందు హామీలు గుప్పించిన జగన్మోహన్రెడ్డి.. అధికారంలోకి వచ్చాక ఆ మాటే మరిచారు. -
బ్యాంకు ఖాతాలకు జమకాని నగదు
[ 02-05-2024]
పింఛన్ల పంపిణీలో వైకాపా ప్రభుత్వం పండుటాకులతో రాజకీయ ఆట ఆడుకుంటూ వృద్ధులు, దివ్యాంగులను అష్టకష్టాలు పెడుతోంది. -
రెండో విడత ఈవీఎంల ర్యాండమైజేషన్
[ 02-05-2024]
సాధారణ ఎన్నికల ప్రక్రియలో భాగంగా రెండో విడత ఈవీఎంల ర్యాండమైజేషన్ను కేంద్ర ఎన్నికల పరిశీలకులు నితిన్ సింగ్ బదారియా పర్యవేక్షణలో కలెక్టర్ ఎం.హరినారాయణన్ నిర్వహించారు. -
ఇవేనా ఊళ్లు.. లబ్ధిదారులకు కన్నీళ్లు
[ 02-05-2024]
నవరత్నాలలో భాగంగా పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తామని వైకాపా గత ఎన్నికల ముందు ఆర్భాటంగా ప్రచారం చేసింది. -
వారాంతపు సెలవులకు జగన్ టోపి
[ 02-05-2024]
శాంతి భద్రతలు బాగుండాలన్నా.. వివాదాలు లేకుండా ప్రశాంతంగా ఉండాలన్నా.. సమాజం సుఖసంతోషాలతో ఉండాలన్నా పోలీసులతోనే సాధ్యం. -
అధికార పార్టీ.. ప్రలోభాల ఎర!
[ 02-05-2024]
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల తేదీ దగ్గరపడేకొద్దీ అధికార పార్టీ.. ప్రలోభాల పర్వాన్ని ముమ్మరం చేసింది. ఎలాగైనా ఓటర్లను తమవైపు తిప్పుకోవాలనే లక్ష్యంతో అడ్డదారులు తొక్కేందుకు సిద్ధమవుతోంది. -
తాగునీటికి కటకట
[ 02-05-2024]
సిద్ధార్థనగర్ ఆనుకుని పట్టణం నుంచి మురుగు ప్రవహిస్తోంది. అక్కడి బోరు నీరు రంగు మారి వినియోగానికి పనికి రావటంలేదు. -
స్వచ్ఛత మాయం.. రోగాలు ఖాయం
[ 02-05-2024]
ఇంటింటికీ చెత్త సేకరిస్తాం.. పట్టణాన్ని చెత్త రహితంగా చేస్తాం.. ఇదీ పురపాలకు నినాదం.. కానీ ఆచరణలో పాటించడం లేదు.వీధుల్లో చెత్త శుభ్రం చేయడం లేదు.
తాజా వార్తలు (Latest News)
-
బ్యాంకు ఖాతాల్లో పింఛన్ జమకాని వారికి.. మే 4న ఇస్తాం: శశి భూషణ్
-
97.76% రూ.2వేల నోట్లు వెనక్కి: ఆర్బీఐ
-
అభిమాని బర్త్డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!
-
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా