logo

ప్రసన్న.. ఎన్ని పార్టీలు మారావో గుర్తుచేసుకో

రాజకీయంగా జన్మనిచ్చి మంత్రిని చేసి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా చేసిన పార్టీకి వెన్నుపోటు పొడిచింది, గెలిచిన తొమ్మిది రోజులకే కాంగ్రెస్‌లో చేరి ఎవరు అమ్ముడుపోయారని ప్రసన్న గుర్తుచేసుకోవాలని తెదేపా అభ్యర్థి ప్రశాంతిరెడ్డి అన్నారు.

Published : 05 May 2024 03:40 IST

మాట్లాడుతున్న వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి

ఇందుకూరుపేట, విడవలూరు, న్యూస్‌టుడే: రాజకీయంగా జన్మనిచ్చి మంత్రిని చేసి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా చేసిన పార్టీకి వెన్నుపోటు పొడిచింది, గెలిచిన తొమ్మిది రోజులకే కాంగ్రెస్‌లో చేరి ఎవరు అమ్ముడుపోయారని ప్రసన్న గుర్తుచేసుకోవాలని తెదేపా అభ్యర్థి ప్రశాంతిరెడ్డి అన్నారు. ఇందుకూరుపేట మండలం నిడిముసలి, ముదివర్తిపాలెం గ్రామాల్లో శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ఇంకోసారి ఇలా మాట్లాడితే తగిన మూల్యం చెల్లంచుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. పోలంరెడ్డి దినేశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సీవీ శేషారెడ్డి, నాయకులు కల్యాణ్‌రెడ్డి, వీరేంద్రనాయుడు పాల్గొన్నారు. విడవలూరు మండలంలోని ఊటుకూరులో వేమిరెడ్డి దంపతులు ప్రచారం చేశారు. .నాయకులు వంశీకృష్ణారెడ్డి, రామిరెడ్డి విజయభానురెడ్డి, భాజపా నాయకులు కనపర్తి నాగేంద్ర, చెముకుల కృష్ణచైతన్య, జనసేన నాయకులు భారీగా పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని