భవనాలు సరే.. బిల్లులేవి ఏలికా?
వైకాపా పాలకులు గొప్పగా ప్రచారం చేసుకునే గ్రామ సచివాలయ భవనాల పరిస్థితి ఒక అడుగు ముందుకు.. రెండు అడుగులు వెనక్కు అన్నట్లు ఉంది. ప్రతి గ్రామానికి శాశ్వత సచివాలయ భవనం ఏర్పాటు చేసే బాధ్యత మాది అని చెప్పిన ముఖ్యమంత్రి..
ఇదీ జిల్లాలో సచివాలయాల పరిస్థితి
న్యూస్టుడే, నెల్లూరు(జడ్పీ)
పార్లపల్లెలో గోడలకే పరిమితమైన సచివాలయ భవనం
వైకాపా పాలకులు గొప్పగా ప్రచారం చేసుకునే గ్రామ సచివాలయ భవనాల పరిస్థితి ఒక అడుగు ముందుకు.. రెండు అడుగులు వెనక్కు అన్నట్లు ఉంది. ప్రతి గ్రామానికి శాశ్వత సచివాలయ భవనం ఏర్పాటు చేసే బాధ్యత మాది అని చెప్పిన ముఖ్యమంత్రి.. ఆయన పాలన పూర్తి కావస్తున్నా నేటికీ భవనాలు పూర్తి చేయించ లేని పరిస్థితి. జిల్లా పరిషత్ పరిధిలో 46 మండలాల్లో సచివాలయ భవనాల నిర్మాణాలు పూర్తి కావడం లేదు. పనులకు పాత బిల్లులు రాకపోవడంతో కొత్త పనుల ప్రారంభానికి గుత్తేదారులు ముందుకు రావడం లేదు.
సచివాలయ వ్యవస్థను బలోపేతం చేశామని రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేసుకుంది. వ్యవస్థకు సంబంధించిన భవన నిర్మాణాలను లక్ష్యం లోపు పూర్తి చేయలేని పరిస్థితి క్షేత్రస్థాయిలో నెలకొంది. రెండేళ్లుగా భవన నిర్మాణ విషయంలో నిర్లక్ష్యం నెలకొంది. రాష్ట్రస్థాయి అధికారులు జిల్లా స్థాయిలో పలుసార్లు సమీక్షలు నిర్వహిస్తున్నా.. భవన నిర్మాణం విషయంలో తీరు మారడం లేదు. బిల్లులు సకాలంలో ఇవ్వకపోవడంతో పాటు పలు సమస్యలు సవాల్గా నిలుస్తున్నాయి.
గడువులు పెంచుతూ..
సచివాలయ భవన నిర్మాణాల విషయంలో ఇప్పటికీ గడువులు మారుస్తున్నారు. ముందుగా పనులు రెండో విడత పేరుతో జడ్పీ సభ్యులకు అధికారులు ఇచ్చిన మాట ప్రకారం జనవరి 31 నుంచి మళ్లీ కొత్త లక్ష్యం విధించారు. వీటి ప్రకారం 154 భవనాలు పూర్తి చేయడానికి రెండోవిడత పేరుతో మొదలు పెడతామని చెప్పారు. జడ్పీలో జరిగిన స్థాయి సంఘాల సమావేశంలో తిరిగి జడ్పీ ఇచ్చిన నివేదిక ప్రకారం... 154 భవనాలు మార్చి 31 తరువాత మొదలు పెడతామని తేదీలు మార్చేశారు. అవి కూడా ఎప్పటికి పూర్తి చేస్తారో నివేదిక పూర్వకంగా ప్రకటించలేదు. ఇందుకు కారణం అధికారులు ప్రోత్సహిస్తున్న గుత్తేదారులు ముందుకు రావడం లేదని తెలుస్తోంది. ఇతర పనులకు సంబంధించిన పాత బిల్లులు రాకపోవడంతో కొత్త పనులు మొదలు పెట్టటానికి ముందుకు రావడం లేదు. దీంతో అధికారులు ఇరకాటంలో పడుతున్నారు. ఇప్పటికే దాదాపు 40 శాతం భవనాల పనులు వేగం కాని పరిస్థితి ఉంది.
మాట మార్చిన అధికారులు
జిల్లా విభజనకు ముందు 659 సచివాలయ భవనాలు మంజూరు అయ్యాయి. ఇందుకు రూ.250.76 కోట్లు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. పనులు జిల్లా పంచాయతీ రాజ్శాఖ ఆధ్వర్యంలో మొదలయ్యాయి. కరోనా వెంటాడడం, కూలీలు చిక్కకపోవడం, బిల్లులు వేగంగా రాకపోవడం వంటి సమస్యలు ఎదురయ్యాయి. సచివాలయ వ్యవస్థ ప్రారంభించి వచ్చే అక్టోబరు నాటికి నాలుగో సంవత్సరం. ఇప్పటికీ కొత్త భవనాలు లేక అద్దె వాటిల్లో, ప్రభుత్వ పాఠశాలల్లో పంచాయతీ భవనాల్లో కార్యాలయాలు ఏర్పాటు చేశారు.
మంజూరైన మొత్తం భవనాలు : 659
పూర్తయినవి: 342
వివిధ దశల్లో ఉన్నవి: 163
కొత్తగా ఎంచుకున్న లక్ష్యం: 154
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలి: కావ్య క్రిష్ణారెడ్డి
[ 18-05-2024]
వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని ఎన్డీఏ కూటమి కావలి అసెంబ్లీ అభ్యర్థి కావ్య క్రిష్ణారెడ్డి అన్నారు. -
కాపుల అభ్యున్నతికి కృషి చేస్తా
[ 18-05-2024]
సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి కావలి అసెంబ్లీ అభ్యర్థి కావ్యకృష్ణారెడ్డి భారీ మెజారిటీ సాధించడం ఖాయమని కాపు నేతలు తెలిపారు. -
లారీని ఢీకొన్న కారు.. ఏడుగురికి తీవ్ర గాయాలు
[ 18-05-2024]
ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టిన ఘటనలో డ్రైవర్తోపాటు ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. -
సంగం చుట్టూ.. సవాళ్లెన్నో!
[ 18-05-2024]
సంగం బ్యారేజీ ప్రారంభించాం.. ఇక తమకేమీ సంబంధం లేదన్నట్లు ప్రభుత్వం వ్యవహరిస్తుండటంతో అయిదు లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీటి సరఫరా సమస్యాత్మకంగా మారింది. -
దారులిలా.. సాగేదెలా?
[ 18-05-2024]
గ్రామీణ రహదారుల అభివృద్ధిని పాలకులు విస్మరించారు. అవి అధ్వాన స్థితికి చేరినా.. అభివృద్ధి మాట దేవుడెరుగు? కనీస మరమ్మతులనూ పట్టించుకోలేదు. -
కత్తి దూసిన ఉన్మాదం
[ 18-05-2024]
తనతో పెళ్లికి నిరాకరించారని కక్ష పెంచుకున్న ఓ యువకుడు.. యువతితో పాటు ఆమె తల్లిపై విచక్షణా రహితంగా కత్తితో దాడి చేశాడు. ఈ ఉన్మాద సంఘటన వింజమూరులోని పాతూరులో శుక్రవారం చోటు చేసుకుంది. నిందితుడు బాధితులకు సమీప బంధువు కావడం గమనార్హం. -
ఓట్ల లెక్కింపునకు సన్నద్ధం కావాలి
[ 18-05-2024]
ఓట్ల లెక్కింపునకు సన్నద్ధం కావాలని కలెక్టర్ ఎం.హరినారాయణన్ రిటర్నింగ్ అధికారులకు సూచించారు. శుక్రవారం రిటర్నింగ్, నోడల్ అధికారులతో వెబెక్స్ సమావేశాన్ని నిర్వహించారు. -
వేసవి శిబిరాలు.. సృజనకు సోపానాలు
[ 18-05-2024]
చిరిగిన చొక్కా అయినా తొడుక్కో .. కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో అన్న.. కందుకూరి వీరేశలింగం సూక్తి పుస్తకాల ప్రాముఖ్యాన్ని తెలియజేస్తోంది. -
డీకే మహిళా కళాశాలలో వినూత్న విద్యాబోధన
[ 18-05-2024]
డిగ్రీ, పీజీ కోర్సులతోపాటు ఆనర్స్ డిగ్రీ కోర్సుల్లో విద్యాబోధన అందిస్తున్న నెల్లూరు నగరంలోని దొడ్ల కౌశల్యమ్మ ప్రభుత్వ మహిళా కళాశాలలో త్వరలో స్టూడియో ద్వారా విద్యాబోధన జరగనుంది. -
కొండెక్కిన చికెన్ ధర
[ 18-05-2024]
కూరగాయలు, నిత్యావసరాల ధరలు అందనంతదూరంలో ఉండగా.. కోళ్లు, గుడ్ల ధరలు కొండెక్కాయి. జిల్లాలో నెల వ్యవధిలో కోళ్ల ధరలు రూ.100-120.. గుడ్ల ధర డజను రూ.20 పెరిగింది. -
గుర్తు తెలియని వ్యక్తి మృతి
[ 18-05-2024]
మన్నేటికోట అడ్డరోడ్డు వద్ద జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు.
తాజా వార్తలు (Latest News)
-
ఆరు నెలల్లో పీవోకే విలీనం ఖాయం..: సీఎం యోగి
-
‘మీ రాష్ట్రాల సంగతి చూసుకోండి’: ఆ సీఎంలకు నవీన్ పట్నాయక్ కౌంటర్
-
అఫ్గాన్లో వరదల బీభత్సం.. 68 మంది మృతి..!
-
‘50-60 ఏళ్ల క్రితం నేను ఇల్లు వదిలి వెళ్లినప్పుడు.. ఇలా అనుకోలేదు’: మోదీ కీలక వ్యాఖ్యలు
-
ఆ విషయంలో నేను ఫెయిల్ అయ్యానేమో: సుధీర్ బాబు
-
పల్నాడులో హింసాత్మక ఘటనలపై భారీగా కేసులు నమోదు