logo

విష గుళికలు మింగి..

జలదంకికి చెందిన మింగికళ్లోల వెంకయ్య (40) - వెంగమ్మ దంపతులు కూలీ పనుల కోసం కొన్నిరోజుల క్రితం కరీంనగర్‌ జిల్లా బంజరుపల్లికి వచ్చారు.

Published : 06 May 2024 05:45 IST

ధర్మారం :  జలదంకికి చెందిన మింగికళ్లోల వెంకయ్య (40) - వెంగమ్మ దంపతులు కూలీ పనుల కోసం కొన్నిరోజుల క్రితం కరీంనగర్‌ జిల్లా బంజరుపల్లికి వచ్చారు. శనివారం రాత్రి అతిగా మద్యం తాగిన వెంకయ్య.. మత్తులో గమనించకుండా విషగుళికలు మింగాడు. గమనించిన భార్య వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. ఈ మేరకు వెంగమ్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని