ఒక్కరితో బోధనెలా మామయ్యా!
కోవూరు మండలం మోడేగుంటలోని ప్రాథమిక పాఠశాలలో 18 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇక్కడ ఒకే ఉపాధ్యాయుడు పనిచేస్తున్నారు.
విద్యకు భరోసా ఇవ్వని ప్రభుత్వం
జిల్లాలో 924 ఏకోపాధ్యాయ పాఠశాలలు
- కోవూరు మండలం మోడేగుంటలోని ప్రాథమిక పాఠశాలలో 18 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇక్కడ ఒకే ఉపాధ్యాయుడు పనిచేస్తున్నారు.
- జమ్మిపాళెంలోని ఎస్సీ కాలనీలోని ప్రాథమిక పాఠశాలలో 21 మందిచదువుతున్నారు. ఇక్కడా ఒక్క ఉపాధ్యాయుడే ఉన్నారు.
న్యూస్టుడే, నెల్లూరు(విద్య)
సంస్కరణల్లో భాగంగా ఏకోపాధ్యాయ పాఠశాలలంటూ చిన్నారుల జీవితాలతో వైకాపా ప్రభుత్వం చెలగాటం ఆడుతోంది. ప్రాథమిక పాఠశాలలకు ఒక ఉపాధ్యాయుడు చాలనే సీఎం జగన్ ధోరణి విద్యా వ్యవస్థను తుంగలో తొక్కేలా ఉందంటూ విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నూతన విద్యా విధానం అమలు నేపథ్యంలో జీవో 117 తెచ్చి పాఠశాలలను విలీనం చేయడంతో స్థానికంగా ప్రాథమిక విద్య అందని ద్రాక్షగా మారిందంటున్నారు. ముఖ్యంగా ఏకోపాధ్యాయ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందదనే భావన వ్యక్తమవుతోంది. ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు అవసరమని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. వీటిని వైకాపా ప్రభుత్వం పట్టించుకోకుండా ప్రాథమిక స్థాయిలో పాఠశాలకు ఒకే ఒక్క ఉపాధ్యాయుడిని నియమించి చేతులు దులుపుకొంటోంది. ఆయా పాఠశాలల్లో తరగతులు ఎన్ని ఉన్నా.. ఒకరే అన్నీ తానై బోధన చేయాల్సి వస్తోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్ని సబ్జెక్టులు బోధిస్తూ అలసి పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఏకోపాధ్యాయ బడిలో ఏదైనా అత్యవసరమై సెలవు పెట్టాల్సి వస్తే సమీప పాఠశాలల నుంచి మరో మాస్టారుని పంపాల్సి వస్తోంది. ఖాళీ పోస్టులు భర్తీ కాక ఎక్కడికక్కడ ఉపాధ్యాయుల కొరత ఏర్పడింది.
కుంటుపడుతున్న బోధన
విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చామని ప్రభుత్వం చెబుతున్నా...క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. ప్రాథమిక పాఠశాలల్లో సరిపడా ఉపాధ్యాయులు లేక బోధన కుంటుపడుతోంది. చాలా బడుల్లో ఒక్కరే ఉన్నారు. ఈ ఒక్కరికీ బోధనేతర పనులతోనే సరిపోతోంది. ఇది విద్యార్థుల చదువులపై ప్రభావం చూపుతోంది. జిల్లాలో 924 ప్రాథమిక పాఠశాలల్లో ఒక్కరు చొప్పున ఉపాధ్యాయులున్నారు. సింగిల్ టీచర్స్ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు అత్యవసరంగా సెలవు పెట్టాలంటే కష్టతరం అవుతోందని ఉపాధ్యాయులు ఆవేదన చెందారు. ఏకోపాధ్యాయ పాఠశాలల్లో సెలవు పెడుతున్న ఉపాధ్యాయుల స్థానంలో బోధనకు క్లస్టర్ రీసోర్స్ మానిటరింగ్ టీచర్స్ (సీఆర్ఎంటీ), పలువురు ఉపాధ్యాయులను డిప్యుటేషన్పై నియమిస్తున్నారు.
ఉపాధ్యాయులపై ఒత్తిడి
ఉన్న ఒక్క ఉపాధ్యాయుడిపై ఒత్తిడి ఎక్కువవుతోంది. పలురకాల యూప్ల్లోకి సమాచారం అప్లోడ్ చేయాలి. ఒకవేళ నాడు- నేడు కార్యక్రమంలో పనులు చేస్తుంటే వాటిని పర్యవేక్షించాలి. ఉదయాన్నే మరుగుదొడ్లను ఫొటో తీసి యాప్లో అప్లోడ్ చేయాలి. విద్యార్థుల హాజరు వివరాలు ఉదయం పది గంటల్లోపు ఇవ్వకపోతే ఆ ప్రభావం మధ్యాహ్న భోజన పథకంపై పడుతోంది. నాడు- నేడుకు ఎంపికైతే పనుల వివరాలను అప్లోడ్ చేయాలి. సచివాలయ సిబ్బంది పర్యవేక్షించి సీఆర్యాప్లో వివరాలు నమోదు చేస్తున్నారు.ఈ యాప్ సాంకేతిక సమస్యతో ఉపాధ్యాయులకు అదనపు భారం అవుతోంది. రాష్ట్రస్థాయి యాప్లకు తోడు జిల్లాస్థాయిలో మరికొన్ని యాప్ల్లో వివరాలు అప్లోడ్ చేయాలి.
పాఠశాలల్లో పిల్లల్ని చేర్చడం లేదు
రమేష్, బీటీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
జిల్లాలో ఏకోపాధ్యాయ పాఠశాలలు ఎక్కువగా ఉన్నాయి. దీనివల్ల బోధన కుంటు పడుతోంది. ఈ పాఠశాలల్లో విద్యార్థులను చేర్చేందుకు తల్లిదండ్రులు వెనుకంజ వేస్తున్నారు. ఉపాధ్యాయులకు బోధనేతర పనులు ఎక్కువగా ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలి: కావ్య క్రిష్ణారెడ్డి
[ 18-05-2024]
వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని ఎన్డీఏ కూటమి కావలి అసెంబ్లీ అభ్యర్థి కావ్య క్రిష్ణారెడ్డి అన్నారు. -
కాపుల అభ్యున్నతికి కృషి చేస్తా
[ 18-05-2024]
సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి కావలి అసెంబ్లీ అభ్యర్థి కావ్యకృష్ణారెడ్డి భారీ మెజారిటీ సాధించడం ఖాయమని కాపు నేతలు తెలిపారు. -
లారీని ఢీకొన్న కారు.. ఏడుగురికి తీవ్ర గాయాలు
[ 18-05-2024]
ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టిన ఘటనలో డ్రైవర్తోపాటు ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. -
సంగం చుట్టూ.. సవాళ్లెన్నో!
[ 18-05-2024]
సంగం బ్యారేజీ ప్రారంభించాం.. ఇక తమకేమీ సంబంధం లేదన్నట్లు ప్రభుత్వం వ్యవహరిస్తుండటంతో అయిదు లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీటి సరఫరా సమస్యాత్మకంగా మారింది. -
దారులిలా.. సాగేదెలా?
[ 18-05-2024]
గ్రామీణ రహదారుల అభివృద్ధిని పాలకులు విస్మరించారు. అవి అధ్వాన స్థితికి చేరినా.. అభివృద్ధి మాట దేవుడెరుగు? కనీస మరమ్మతులనూ పట్టించుకోలేదు. -
కత్తి దూసిన ఉన్మాదం
[ 18-05-2024]
తనతో పెళ్లికి నిరాకరించారని కక్ష పెంచుకున్న ఓ యువకుడు.. యువతితో పాటు ఆమె తల్లిపై విచక్షణా రహితంగా కత్తితో దాడి చేశాడు. ఈ ఉన్మాద సంఘటన వింజమూరులోని పాతూరులో శుక్రవారం చోటు చేసుకుంది. నిందితుడు బాధితులకు సమీప బంధువు కావడం గమనార్హం. -
ఓట్ల లెక్కింపునకు సన్నద్ధం కావాలి
[ 18-05-2024]
ఓట్ల లెక్కింపునకు సన్నద్ధం కావాలని కలెక్టర్ ఎం.హరినారాయణన్ రిటర్నింగ్ అధికారులకు సూచించారు. శుక్రవారం రిటర్నింగ్, నోడల్ అధికారులతో వెబెక్స్ సమావేశాన్ని నిర్వహించారు. -
వేసవి శిబిరాలు.. సృజనకు సోపానాలు
[ 18-05-2024]
చిరిగిన చొక్కా అయినా తొడుక్కో .. కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో అన్న.. కందుకూరి వీరేశలింగం సూక్తి పుస్తకాల ప్రాముఖ్యాన్ని తెలియజేస్తోంది. -
డీకే మహిళా కళాశాలలో వినూత్న విద్యాబోధన
[ 18-05-2024]
డిగ్రీ, పీజీ కోర్సులతోపాటు ఆనర్స్ డిగ్రీ కోర్సుల్లో విద్యాబోధన అందిస్తున్న నెల్లూరు నగరంలోని దొడ్ల కౌశల్యమ్మ ప్రభుత్వ మహిళా కళాశాలలో త్వరలో స్టూడియో ద్వారా విద్యాబోధన జరగనుంది. -
కొండెక్కిన చికెన్ ధర
[ 18-05-2024]
కూరగాయలు, నిత్యావసరాల ధరలు అందనంతదూరంలో ఉండగా.. కోళ్లు, గుడ్ల ధరలు కొండెక్కాయి. జిల్లాలో నెల వ్యవధిలో కోళ్ల ధరలు రూ.100-120.. గుడ్ల ధర డజను రూ.20 పెరిగింది. -
గుర్తు తెలియని వ్యక్తి మృతి
[ 18-05-2024]
మన్నేటికోట అడ్డరోడ్డు వద్ద జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు.
తాజా వార్తలు (Latest News)
-
భారత బలగాలకు ద్రోహం చేసిన చరిత్ర కాంగ్రెస్ది: ప్రధాని మోదీ
-
మీ కార్యాలయానికే వస్తాం.. ధైర్యముంటే అరెస్టు చేసుకోండి: కేజ్రీవాల్ సవాల్
-
కాకతీయ వర్సిటీ వీసీ రమేశ్పై విజిలెన్స్ విచారణకు ఆదేశం
-
ఎన్నికల తనిఖీల్లో.. రూ.8,889 కోట్ల సొత్తు స్వాధీనం: ఈసీ
-
పెట్స్పై ప్రేమ.. సమంత ఇలా.. జాన్వీ కపూర్ అలా!
-
దీదీతో పొత్తుపై హైకమాండ్ నిర్ణయం తీసుకోవాలి.. అధీర్ కాదు: ఖర్గే