పథకాలు నిర్వీర్యం అర్చకులపై దౌర్జన్యం
గత తెదేపా ప్రభుత్వ పాలనలో బ్రాహ్మణుల కోసం ప్రవేశపెట్టిన పథకాలను వైకాపా ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. అయిదేళ్లలో తమను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అర్చకులపై అధికార వైకాపా దౌర్జన్యాలు తప్ప..
అయిదేళ్లలో ప్రభుత్వం చేసిందేమి లేదంటున్న బ్రాహ్మణులు
న్యూస్టుడే, నెల్లూరు(కలెక్టరేట్)
గత తెదేపా ప్రభుత్వ పాలనలో బ్రాహ్మణుల కోసం ప్రవేశపెట్టిన పథకాలను వైకాపా ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. అయిదేళ్లలో తమను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అర్చకులపై అధికార వైకాపా దౌర్జన్యాలు తప్ప.. అభివృద్ధి లేదని విమర్శిస్తున్నారు. హిందూ దేవాలయాలపై దాడులు చేస్తే వైకాపా ప్రభుత్వం ప్రేక్షకపాత్ర వహించిందని ఆరోపిస్తున్నారు. తెదేపా ప్రభుత్వంలో పదో తరగతి చదివే బ్రాహ్మణ విద్యార్థులకు రూ.10 వేలు, ఇంటర్మీడియట్ విద్యార్థులకు రూ.20 వేలు ఇచ్చేవారు. వాటిని కూడా తీసేసింది. బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా వాహనాలకు ఇచ్చే రుణాలు ఆపేశారు. తెదేపా మేనిఫెస్టోలో బ్రాహ్మణుల సంక్షేమానికి పెద్దపీట వేయడం ఆనందంగా ఉందని చెబుతున్నారు.
కార్పొరేషన్ను పట్టించుకోలేదు
-పీవీ నరసింహారావుశర్మ, నెల్లూరు
వైకాపా ప్రభుత్వం బ్రాహ్మణ కార్పొరేషన్ను నిర్వీర్యం చేసింది. పథకాలను రద్దు చేసింది. బ్రాహ్మణ సమాజం ఆలోచించి తెదేపాకి ఓటు వేస్తాం. దేవాలయాలపై, అర్చకులపై దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షిస్తామని తెదేపా మ్యానిఫెస్టోలో చూపారు.
రథాలు తగలబెట్టారు
-గట్టుపల్లి రమేష్కుమార్, బ్రహ్మదేవం గ్రామం
వైకాపా ప్రభుత్వంలో రథాలను కూడా తగులబెట్టారు. జగన్ అధికారంలోకి రాగానే బ్రాహ్మణులను విస్మరించారు. తెదేపా మ్యానిఫెస్టో బాగుంది. హిందూ దేవాలయాలను కాపాడేందుకు హిందూ బోర్డును ఏర్పాటు చేస్తాననడం సంతోషంగా ఉంది.
వాహన రుణాలు ఆపేశారు
-ధనుంజయ, నెల్లూరు
చంద్రబాబునాయుడు 2014లో బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రతి ఇంటిలో వృద్ధులు ఎంతమంది ఉన్నా పింఛను ఇచ్చారు. దానిని 2019లో వైకాపా ప్రభుత్వం తీసేసి సాధారణ పింఛనులో కలిపేసింది. బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా వాహనాలకు ఇచ్చే రుణాలు ఆపేశారు.
రక్షణ కరవు
-ఆలూరు వెంకట విష్ణువర్ధన్రావు, ముత్తుకూరు
వైకాపా ప్రభుత్వంలో దేవాలయాలు, రథాలు తగులబెట్టినా పట్టించుకోలేదు. బ్రాహ్మణులను వైకాపా వారు వచ్చి కొట్టినా రాజీ చేసి పంపించారు. రక్షణ లేకుండా పోయింది.
కార్యాలయానికి తాళాలు
-ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్
చంద్రబాబునాయుడు బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. బ్రాహ్మణ విద్యార్థికి విదేశీ విద్య కోసం రూ.10 లక్షలు ఇచ్చారు. మోసపూరిత మాటలతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్రెడ్డి కార్పొరేషన్ కార్యాలయానికి తాళాలు వేసేశారు. బ్రాహ్మణుల సంక్షేమాన్ని చంద్రబాబు మ్యానిఫెస్టోలో పెట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల అందజేత
[ 19-05-2024]
పట్టణంలోని రవి నర్సింగ్ హోంలో అధ్యక్షుడు తోట వెంకటేశ్వర్లు అధ్యక్షతన ప్రతిభా పురస్కారాల కార్యక్రమం జరిగింది. -
జిల్లా వ్యాప్తంగా కార్డన్ సెర్చ్
[ 19-05-2024]
నెల్లూరు ఎస్పీ ఆరీఫ్ హఫీస్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ఠాణాల పరిధిలో పోలీసులు కార్డన్ సెర్చ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. -
పేకమేడలా.. జగనన్న ఇళ్లు.. చేతితో లాగితే ఊడుతున్న శ్లాబ్!
[ 19-05-2024]
వెంకటాచలం మండలం కంటేపల్లికి చెందిన అద్దూరు కామాక్షికి ప్రభుత్వం జగనన్న కాలనీలో ఇంటి స్థలంతో పాటు పక్కా ఇళ్లు మంజూరు చేసింది. -
రోడ్లు అధ్వానం.. పట్టించుకోని ప్రభుత్వం
[ 19-05-2024]
కందుకూరు నియోజకవర్గంలో రహదారులు అధ్వానంగా మారాయి. ఏళ్ల తరబడి ప్రభుత్వం పట్టించుకున్న పాపానపోలేదు. -
బోర్లు.. బాగు చేస్తే దాహం తీరు
[ 19-05-2024]
ఎండలు ముదిరాయి. రక్షిత పథకాలు పనిచేయడం లేదు. తాగునీటికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఈసమయంలో ఉపయోగపడే చేతి పంపులు అలంకారప్రాయంగా మారాయి -
అతి తక్కువ వడ్డీకే రిటెయిల్ రుణాలు
[ 19-05-2024]
తక్కువ వడ్డీకే రిటెయిల్ రుణాలు ఇవ్వనున్నట్లు యూనియన్ బ్యాంక్ రీజనల్ హెడ్ రాజశేఖర్ పేర్కొన్నారు. -
తాళం వేసిన ఇళ్లే లక్ష్యం.. రాత్రులు దొంగతనం
[ 19-05-2024]
రాత్రుల్లో తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్న దొంగను పోలీసులు అరెస్టు చేశారు. -
జాతీయ రహదారిపై ప్రమాదం
[ 19-05-2024]
జాతీయ రహదారిపై వెళుతూ ఆగిన లారీని కారు ఢీకొనడంతో నలుగురికి తీవ్ర గాయాలైన ఘటన నార్తురాజుపాళెం సమీపంలో జాతీయ రహదారిపై జరిగింది. -
హతవిధీ..పట్టించుకునేవారేరీ!
[ 19-05-2024]
నెల్లూరు నగరంలోని ప్రసిద్ధ బారా షహీద్ దర్గా పాలకులు, అధికారుల నిర్లక్ష్యానికి గురవుతోంది. -
22న జిల్లాకు గవర్నర్ రాక
[ 19-05-2024]
రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఈ నెల 22వ తేదీ నెల్లూరుకు రానున్నట్లు కలెక్టర్ హరినారాయణన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. -
మెట్ట రైలుపై చిన్న చూపు
[ 19-05-2024]
మెట్ట ప్రాంత వాసుల దశాబ్దాల కల.. నడికుడి- శ్రీకాళహస్తి రైల్వే లైన్.. అయిదేళ్ల వైకాపా పాలనలో ఈ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేయడంతో.. పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారాయి -
స్ట్రాంగ్ రూమ్కు పోస్టల్ బ్యాలెట్లు
[ 19-05-2024]
నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి పోస్టులో వచ్చిన పోస్టల్ బ్యాలెట్లను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములో ఉంచి సీల్ వేశారు. -
నేటి నుంచి పెంచలకోన బ్రహ్మోత్సవాలు
[ 19-05-2024]
బ్రహ్మోత్సవాలకు పెంచలకోన క్షేత్రం ముస్తాబైంది. నేటి నుంచి ప్రారంభమయ్యే ఉత్సవాలు 25వ తేదీ వరకు జరగనుండగా- ఆదివారం స్వామి అత్తారిల్లుగా చెప్పుకొనే గోనుపల్లి ఆలయం నుంచి ఉత్సవ మూర్తులను పెంచలకోన క్షేత్రానికి చేర్చనున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణ కేబినెట్ భేటి.. షరతులతో కూడిన అనుమతిచ్చిన ఈసీ
-
అందుకే భారత్తో వాణిజ్య బంధం తెగిపోయింది: పాక్
-
పట్టభద్రులారా ఆలోచించి ఓటు వేయండి: కేటీఆర్
-
ఎంపీగా గెలిస్తే.. బాలీవుడ్ను వీడుతారా? కంగనా ఏం చెప్పారంటే..
-
పంచన్ లామా ఎక్కడ: చైనాను మరోసారి అడిగిన అమెరికా
-
తిరుపతి జిల్లాలో పలుచోట్ల ‘సిట్’ విచారణ.. పలు విషయాలపై ఆరా!