ఊరూరా గొలుసు.. చిదిమేస్తోంది బతుకు!
ఎన్నికల ముందు ప్రతిపక్ష నేతగా పాదయాత్ర పేరుతో ఊరూరా తిరుగుతూ బెల్ట్షాపులపై లెక్కలేనన్ని మాటలు చెప్పిన జగన్... అధికారంలోకి రాగానే వాటన్నింటినీ మూసివేయిస్తానని ప్రగల్భాలు పలికారు.
అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లోనే నిర్వహణ
సరకు తరలించి.. మధ్యాహ్నానికే దుకాణాల మూత
ఇళ్లు.. ఒళ్లు గుల్లవుతున్నా నిద్రనటిస్తున్న యంత్రాంగం
ఈనాడు, నెల్లూరు
‘ఏదైనా గ్రామంలో మినరల్ వాటర్ ప్లాంటు ఉందో లేదో తెలియదు గానీ.. మందుషాపు లేని గ్రామం ఉందా అని అడుగుతున్నా. ప్రతి వీధి చివరలో, ప్రతి ఇంటి ముందు షాపు పెట్టి పిల్లలను చెడగొడుతున్నారు. ఫోన్ కొడితే మినరల్ వాటర్ ఇంటికి తీసుకొస్తారో లేదో తెలియదు గానీ.. మందు సీసా నేరుగా ఇంటికి తీసుకొచ్చే పరిస్థితి ఉంది’
- ఇదీ గత ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నేతగా జగన్మోహన్రెడ్డి అన్న మాటలు.
‘జిల్లాలోని ప్రతి ఊరిలో తక్కువలో తక్కువ రెండు, మూడు బెల్ట్షాపులు ఉన్నాయి. కందుకూరు నుంచి సైదాపురం వరకు ఎక్కడ చూసినా గొలుసు దుకాణాలే కనిపిస్తున్నాయి. చిల్లర దుకాణాలు, ఫాస్ట్ఫుడ్ కేంద్రాలు, బడ్డీకొట్లు, శీతల పానీయాల దుకాణాలు, కిరాణా కొట్ల మాటున విచ్చలవిడిగా అమ్మకాలు జరుగుతున్నాయి. ప్రతి ఊరిలో వీటి నిర్వహణలో వైకాపా నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులదే ప్రధాన పాత్ర కావడంతో అటువైపు చూసేవారే కరవయ్యారు.
- ఇదీ ప్రస్తుతం జిల్లాలో పరిస్థితి
ఎన్నికల ముందు ప్రతిపక్ష నేతగా పాదయాత్ర పేరుతో ఊరూరా తిరుగుతూ బెల్ట్షాపులపై లెక్కలేనన్ని మాటలు చెప్పిన జగన్... అధికారంలోకి రాగానే వాటన్నింటినీ మూసివేయిస్తానని ప్రగల్భాలు పలికారు. మహాత్మాగాంధీ స్ఫూర్తితో.. ఆయన పుట్టిన రోజు నాడే.. ‘బెల్ట్ దుకాణాలు’ రద్దు అంటూ పచ్చి అబద్ధం చెప్పారు. ఇప్పటికే 99.5 శాతం హామీలు నెరవేర్చామని ఊహల్లో ఉన్న ముఖ్యమంత్రి.. బెల్ట్ షాపులనూ అదే కోవలో వేసుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఫలితంగా ప్రతి ఊరిలో మూడు సీసాలు, ఆరు బీర్లుగా మద్యం ఏరులై పారుతున్నా.. మన దగ్గర కాదులే అన్నట్లు అధికారులు వ్యవహరిస్తుండగా- మద్యం అక్రమ రవాణా నియంత్రణకే ఏర్పాటు చేసిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో నాలుగేళ్లుగా ఉందా? లేదా? అన్నట్లు ఉండటమే దీనికి నిదర్శనం.
ఫోన్ చేస్తే.. ఇంటికే..
ప్రస్తుతం ట్రెండ్ మారింది. మద్యం ఒక చోట డంప్ చేసుకుని.. అక్కడి నుంచి ఒక్కో సీసా తెచ్చి జనాలకు విక్రయిస్తున్నారు. కందుకూరు రూరల్, ఆత్మకూరు, కావలి, నెల్లూరు రూరల్, వెంకటాచలం పరిధిలో ఫోన్ చేస్తే చాలు.. ఎక్కడికైనా మందు సీసాలు తెచ్చి ఇస్తారు. కందుకూరు రూరల్ పరిధిలో ఆరువేల మంది జనాభా ఉన్న మాచవరంలో 4 బెల్ట్షాపులు నిర్వహిస్తున్నారు. అధికార పార్టీ నాయకులు ప్రభుత్వ దుకాణాల్లో తమ అనుచరులను అక్కడ సిబ్బందిగా నియమించుకుని పెత్తనం చేస్తున్నారు. ప్రీమియం బ్రాండ్లను బ్లాక్ మార్కెట్కు తరలించి విక్రయిస్తున్నారు. గత ఏడాది వరికుంటపాడు మండలం విరువూరులో నాలుగు గొలుసు దుకాణాలు నిర్వహిస్తున్నారని ఫిర్యాదు చేసినా.. అధికారులు పట్టించుకోలేదు. చివరకు గ్రామస్థులు గ్రామ సచివాలయం ఎదుట ఆందోళన చేయాల్సి వచ్చింది.
ఉదయం అరువు.. సాయంత్రం వసూలు
ఉదయాన్నే పనులకు వెళ్లే కూలీలకు అరువుపై మద్యం ఇచ్చి.. సాయంత్రం వారి వద్ద డబ్బు వసూలు చేసుకుంటున్నారు. మందుబాబులకు కావాల్సిన ఆహారం, గ్లాసులు వంటివి సరఫరా చేస్తూ అదనంగా సంపాదిస్తున్నారు. జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న దాబాల్లోనూ యథేచ్ఛగా విక్రయాలు జరుగుతున్నాయి. మనుబోలు మండలం కొమ్మలపూడిలో మూడు గొలుసు దుకాణాలు ఉండగా- రెండు చోట్ల ఇళ్లలో, ఒకచోట చికెన్ దుకాణంలో విక్రయిస్తున్నారు. వెంకటాచలం మండలం ఇడిమేపల్లి పంచాయతీ పలుకూరువారిపాళెం, జంగాలపల్లి గ్రామాల్లో 8 బెల్ట్ దుకాణాలు ఉండగా- మూడు చోట్ల శీతల పానీయాల మాటున, మిగిలిన ప్రాంతాల్లో గడ్డివాముల్లో నిల్వ ఉంచి అమ్ముతున్నారు. కోవూరు నడిబొడ్డున ఓ చిల్లర దుకాణంలో అధికార పార్టీ అండదండలతో నడుస్తుండగా- కందుకూరు రూరల్ పరిధిలోని పలుకూరులో రెండు శీతల పానీయాల దుకాణాల్లో, మరో రెండు నివాసాల్లో.. మొత్తం నాలుగు నడుపుతున్నారు. గుడ్లూరు మండలం చేవూరు, రాపూరు, పాజర్ల, మోచర్ల, నాయుడుపాలెం, పూరేటిపల్లి, కొత్తపేట, కర్లపాలెం, రాజుపాలెంలో రెండేసి బెల్ట్షాపులు ఉన్నాయి. పరిస్థితి ఇంతలా ఉన్నా.. అక్రమ రవాణా, విక్రయాలను అరికట్టాల్సిన సెబ్ సిబ్బంది అటువైపు కన్నెత్తి చూడటం లేదు.
ప్రభుత్వ మద్యం దుకాణాల నుంచే...
బెల్ట్ షాపులకు ప్రభుత్వ మద్యం దుకాణాల నుంచే మందు సరఫరా అవుతోంది. ఇక్కడ పనిచేసే కొందరు సిబ్బంది గొలుసు దుకాణాల నిర్వాహకులతో చేతులు కలిపి వారికి సహకరిస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో మధ్యాహ్నానికే సరకు లేదంటూ తలుపులు వేసుకుని వెళ్లిపోతున్నా.. చాలా చోట్ల ఒక్కో క్వార్టర్ సీసాపై అదనంగా రూ. 10నుంచి రూ.15 తీసుకుని దొడ్డిదారిలో కావాల్సినన్ని అందిస్తున్నారు. గొలుసు దుకాణదారులు వాటిని గ్రామాలకు తీసుకువెళ్లి.. ఆ ధరపై మరో 30-40వేసి, మందుబాబులకు అమ్ముతున్నారు. ప్రభుత్వ దుకాణాల్లో రూ.130 ఉండే క్వార్టర్ సీసా.. ఇక్కడ రూ. 180కి విక్రయిస్తున్నారు. కొన్నిచోట్ల అవతలివారి అవసరాన్ని బట్టి.. ఈ ధర ఇంకా పెరుగుతుంది కూడా. కొన్నిచోట్ల ప్రభుత్వ మద్యం దుకాణాల్లో పనిచేసే సిబ్బందే నేరుగా బెల్ట్షాపులకు సరఫరా చేస్తున్నారు. దీనికి నిదర్శనం.. ఇటీవల విరువూరులో దొరికిన మద్యం డంప్ సూరాయపాళెం, తాటిపర్తి ప్రభుత్వ మద్యం దుకాణాల నుంచి పంపింది కావడమే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల అందజేత
[ 19-05-2024]
పట్టణంలోని రవి నర్సింగ్ హోంలో అధ్యక్షుడు తోట వెంకటేశ్వర్లు అధ్యక్షతన ప్రతిభా పురస్కారాల కార్యక్రమం జరిగింది. -
జిల్లా వ్యాప్తంగా కార్డన్ సెర్చ్
[ 19-05-2024]
నెల్లూరు ఎస్పీ ఆరీఫ్ హఫీస్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ఠాణాల పరిధిలో పోలీసులు కార్డన్ సెర్చ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. -
పేకమేడలా.. జగనన్న ఇళ్లు.. చేతితో లాగితే ఊడుతున్న శ్లాబ్!
[ 19-05-2024]
వెంకటాచలం మండలం కంటేపల్లికి చెందిన అద్దూరు కామాక్షికి ప్రభుత్వం జగనన్న కాలనీలో ఇంటి స్థలంతో పాటు పక్కా ఇళ్లు మంజూరు చేసింది. -
రోడ్లు అధ్వానం.. పట్టించుకోని ప్రభుత్వం
[ 19-05-2024]
కందుకూరు నియోజకవర్గంలో రహదారులు అధ్వానంగా మారాయి. ఏళ్ల తరబడి ప్రభుత్వం పట్టించుకున్న పాపానపోలేదు. -
బోర్లు.. బాగు చేస్తే దాహం తీరు
[ 19-05-2024]
ఎండలు ముదిరాయి. రక్షిత పథకాలు పనిచేయడం లేదు. తాగునీటికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఈసమయంలో ఉపయోగపడే చేతి పంపులు అలంకారప్రాయంగా మారాయి -
అతి తక్కువ వడ్డీకే రిటెయిల్ రుణాలు
[ 19-05-2024]
తక్కువ వడ్డీకే రిటెయిల్ రుణాలు ఇవ్వనున్నట్లు యూనియన్ బ్యాంక్ రీజనల్ హెడ్ రాజశేఖర్ పేర్కొన్నారు. -
తాళం వేసిన ఇళ్లే లక్ష్యం.. రాత్రులు దొంగతనం
[ 19-05-2024]
రాత్రుల్లో తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్న దొంగను పోలీసులు అరెస్టు చేశారు. -
జాతీయ రహదారిపై ప్రమాదం
[ 19-05-2024]
జాతీయ రహదారిపై వెళుతూ ఆగిన లారీని కారు ఢీకొనడంతో నలుగురికి తీవ్ర గాయాలైన ఘటన నార్తురాజుపాళెం సమీపంలో జాతీయ రహదారిపై జరిగింది. -
హతవిధీ..పట్టించుకునేవారేరీ!
[ 19-05-2024]
నెల్లూరు నగరంలోని ప్రసిద్ధ బారా షహీద్ దర్గా పాలకులు, అధికారుల నిర్లక్ష్యానికి గురవుతోంది. -
22న జిల్లాకు గవర్నర్ రాక
[ 19-05-2024]
రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఈ నెల 22వ తేదీ నెల్లూరుకు రానున్నట్లు కలెక్టర్ హరినారాయణన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. -
మెట్ట రైలుపై చిన్న చూపు
[ 19-05-2024]
మెట్ట ప్రాంత వాసుల దశాబ్దాల కల.. నడికుడి- శ్రీకాళహస్తి రైల్వే లైన్.. అయిదేళ్ల వైకాపా పాలనలో ఈ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేయడంతో.. పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారాయి -
స్ట్రాంగ్ రూమ్కు పోస్టల్ బ్యాలెట్లు
[ 19-05-2024]
నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి పోస్టులో వచ్చిన పోస్టల్ బ్యాలెట్లను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములో ఉంచి సీల్ వేశారు. -
నేటి నుంచి పెంచలకోన బ్రహ్మోత్సవాలు
[ 19-05-2024]
బ్రహ్మోత్సవాలకు పెంచలకోన క్షేత్రం ముస్తాబైంది. నేటి నుంచి ప్రారంభమయ్యే ఉత్సవాలు 25వ తేదీ వరకు జరగనుండగా- ఆదివారం స్వామి అత్తారిల్లుగా చెప్పుకొనే గోనుపల్లి ఆలయం నుంచి ఉత్సవ మూర్తులను పెంచలకోన క్షేత్రానికి చేర్చనున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
రిషి సునాక్ దంపతుల సంపద.. రాజు ఆస్తుల కంటే ఎక్కువ!
-
ధోనీపై కమల్ ప్రశంసలు.. క్రిస్గేల్తో రిషబ్ ఫొటో
-
ఎయిర్లైన్స్ లాభాల్లో బిగ్ జంప్.. ఉద్యోగులకు 8 నెలల జీతం బోనస్..
-
బలహీనపడిన ఆవర్తనం.. తెలంగాణలో మరో 3 రోజుల పాటు వర్షాలు
-
తెలంగాణ కేబినెట్ భేటీ.. షరతులతో కూడిన అనుమతిచ్చిన ఈసీ
-
అందుకే భారత్తో వాణిజ్య బంధం తెగిపోయింది: పాక్