అందని డ్రోన్లకు అన్నదాతల ఎదురుచూపు
నూతన సాంకేతికతతో సాగు, రసాయనిక మందుల పిచికారితో.. పెట్టుబడుల ఖర్చు తగ్గడంతోపాటు వ్యవసాయ లాభసాటి కాగలదని రాష్ట్ర ప్రభుత్వ పాలకులు చెప్పారు.
ఉలవపాడు, వలేటివారిపాలెం, లింగసముద్రం, న్యూస్టుడే: నూతన సాంకేతికతతో సాగు, రసాయనిక మందుల పిచికారితో.. పెట్టుబడుల ఖర్చు తగ్గడంతోపాటు వ్యవసాయ లాభసాటి కాగలదని రాష్ట్ర ప్రభుత్వ పాలకులు చెప్పారు. మందుల పిచికారికి డ్రోన్ ఉపయోగించడంతో మందుల పరిమాణంతోపాటు ఖర్చులు తగ్గుతాయని వ్యవసాయాధికారులు రైతులకు నామమాత్రంగా అవగహన కార్యక్రమాలను నిర్వహించారు. మండలం నుంచి డ్రోన్ నిర్వహణ శిక్షణ కార్యక్రమానికి ఒక రైతును ఎంపిక చేశారు. కానీ, ఇంతవరకు శిక్షణ ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో నిర్వహించిన వికసిత్ భారత్ కార్యక్రమంలో డ్రోన్ ద్వారా పిచికారిపై డెమోలు 15 సచివాలయాల పరిధిలో అవగాహన కల్పించారు. డ్రోన్ విలువ అధికంగా ఉండటంతో రైతులు తీసుకోవడానికి ఎవ్వరూ ముందుకు రాలేదని వ్యవసాయాధికారులు చెబుతున్నారు.
శిక్షణకే పరిమితం
ఉలవపాడు డ్రోన్ పిచికారిపై ప్రభుత్వం శిక్షణలకే పరిమితమైంది. మండలానికి ఒకరిని ఎంపికచేసి.. పది రోజులపాటు శిక్షణ ఇచ్చారు. కానీ, అక్కడి నుంచి అడుగు ముందుకు పడలేదు. గ్రామాల్లో అక్కడక్కడా డెమో కూడా చేసి చూపించారు. అక్కడ నుంచి ప్రభుత్వపరంగా అడుగు ముందుకు పడకపోవడంతో అక్కడితో నిలిచిపోయింది. మండలానికి ఒక గ్రూపును ఏర్పాటు చేసి వారికి డ్రోన్ పిచికారిపై అవగాహన కల్పించే ప్రయత్నం చేయాల్సింది. కానీ, ప్రభుత్వపరంగా డ్రోన్ ఏర్పాటుకు కృషి జరగలేదు.
అర్హులే లేరట,,
లింగసముద్రం మండలంలో డ్రోన్లను ఆపరేటింగ్ చేసేందుకు అర్హత కలిగిన విద్యావంతులు లేరనే ఉద్దేశంతో పథకాన్ని అమలు చేయలేదు. పెంట్రాల, తిమ్మారెడ్డిపాలెంలో ఇద్దరిని ఎంపిక చేసినప్పటికీ వారికి సరిపడా పొలం లేక తొలగించినట్లు తెలిసింది. దీంతో మండలంలో డ్రోన్లను ఉపయోగించని పరిస్థితి.
రాయితీ శాతాన్ని పెంచాలి
నవులూరి సుబ్బానాయుడు, రైతు, పోకూరు
వలేటివారిపాలెం మండలంలో విస్తారంగా మినుము, శనగ పంటలను సాగు చేస్తుంటారు. ఈ పంటలకు నాలుగు నుంచి ఆరుసార్లు మందులు పిచికారి చేయాల్సి వస్తోంది. కూలీల డిమాండ్ వల్ల ట్రాక్టరు సాయంతో ప్రస్తుతం మందులను పంటలపై పిచికారి చేస్తున్నాం. ప్రస్తుతం డ్రోన్ల ధరలు అధికంగా ఉండటంతో రైతులు కొనలేని పరిస్థితి. ప్రభుత్వం రాయితీ శాతాన్ని పెంచి రైతులకు అందించాలి. వాటిని వినియోగించే పరిజ్ఞానం నిరక్షరాస్యులైన రైతులకు లేకపోవడం, అధికారులు అవగాహన కల్పించడంలో నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ లక్ష్యం గాడి తప్పింది.
కలగా మిగిలింది
కె.ప్రసాద్, గుడ్లూరు
వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు ఆసరాగా ఉండటానికి డ్రోన్లను వినియోగిస్తామంటూ ప్రకటనలిచ్చారు. కానీ, వాటిని మాత్రం ప్రవేశపెట్టలేదు. కొన్నిచోట్ల ఒకసారి ఎగరేసి రైతులకు ఆశచూపారు. మేము ఆరు ఎకరాల్లో కూరగాయలు, పత్తి సాగు చేస్తున్నాం. రసాయన మందులు పిచికారి చేయడానికి ఎక్కువ ఖర్చు అవుతోంది. రైతులకు ప్రోత్సాహం కింద డ్రోన్లు ఇవ్వకపోవడం దారుణం.
ఏ పరికరాలు అందలేదు..
ఎం.మాల్యాద్రి, పెదలాటరపి
గత తెదేపా ప్రభుత్వంలో సూక్ష్మ సేద్య పరికరాలు డ్రిప్, స్ప్రింక్లర్లు రైతులకు ఇచ్చారు. వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని అటకెక్కించారు. రాయితీ మీద రైతులకు వ్యవసాయ డ్రోన్లు అందలేదు. శిక్షణ కార్యక్రమాలు లేవు. రైతులకు సూచనలిచ్చేందుకు గతంలో ప్రత్యేక కార్యక్రమం ఉండేది. ఇప్పుడు అటువంటివి లేకపోవడం బాధాకరం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కృష్ణారెడ్డే కావలికి కాబోయే ఎమ్మెల్యే: మాలేపాటి
[ 19-05-2024]
కావలి నియోజకవర్గ కేంద్రంలో కమ్మ సేవా సంఘం ఆధ్వర్యంలో కూటమి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డికి సన్మానం కార్యక్రమం నిర్వహించారు. -
విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల అందజేత
[ 19-05-2024]
పట్టణంలోని రవి నర్సింగ్ హోంలో అధ్యక్షుడు తోట వెంకటేశ్వర్లు అధ్యక్షతన ప్రతిభా పురస్కారాల కార్యక్రమం జరిగింది. -
జిల్లా వ్యాప్తంగా కార్డన్ సెర్చ్
[ 19-05-2024]
నెల్లూరు ఎస్పీ ఆరీఫ్ హఫీస్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ఠాణాల పరిధిలో పోలీసులు కార్డన్ సెర్చ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. -
పేకమేడలా.. జగనన్న ఇళ్లు.. చేతితో లాగితే ఊడుతున్న శ్లాబ్!
[ 19-05-2024]
వెంకటాచలం మండలం కంటేపల్లికి చెందిన అద్దూరు కామాక్షికి ప్రభుత్వం జగనన్న కాలనీలో ఇంటి స్థలంతో పాటు పక్కా ఇళ్లు మంజూరు చేసింది. -
రోడ్లు అధ్వానం.. పట్టించుకోని ప్రభుత్వం
[ 19-05-2024]
కందుకూరు నియోజకవర్గంలో రహదారులు అధ్వానంగా మారాయి. ఏళ్ల తరబడి ప్రభుత్వం పట్టించుకున్న పాపానపోలేదు. -
బోర్లు.. బాగు చేస్తే దాహం తీరు
[ 19-05-2024]
ఎండలు ముదిరాయి. రక్షిత పథకాలు పనిచేయడం లేదు. తాగునీటికి ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. ఈసమయంలో ఉపయోగపడే చేతి పంపులు అలంకారప్రాయంగా మారాయి -
అతి తక్కువ వడ్డీకే రిటెయిల్ రుణాలు
[ 19-05-2024]
తక్కువ వడ్డీకే రిటెయిల్ రుణాలు ఇవ్వనున్నట్లు యూనియన్ బ్యాంక్ రీజనల్ హెడ్ రాజశేఖర్ పేర్కొన్నారు. -
తాళం వేసిన ఇళ్లే లక్ష్యం.. రాత్రులు దొంగతనం
[ 19-05-2024]
రాత్రుల్లో తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్న దొంగను పోలీసులు అరెస్టు చేశారు. -
జాతీయ రహదారిపై ప్రమాదం
[ 19-05-2024]
జాతీయ రహదారిపై వెళుతూ ఆగిన లారీని కారు ఢీకొనడంతో నలుగురికి తీవ్ర గాయాలైన ఘటన నార్తురాజుపాళెం సమీపంలో జాతీయ రహదారిపై జరిగింది. -
హతవిధీ..పట్టించుకునేవారేరీ!
[ 19-05-2024]
నెల్లూరు నగరంలోని ప్రసిద్ధ బారా షహీద్ దర్గా పాలకులు, అధికారుల నిర్లక్ష్యానికి గురవుతోంది. -
22న జిల్లాకు గవర్నర్ రాక
[ 19-05-2024]
రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఈ నెల 22వ తేదీ నెల్లూరుకు రానున్నట్లు కలెక్టర్ హరినారాయణన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. -
మెట్ట రైలుపై చిన్న చూపు
[ 19-05-2024]
మెట్ట ప్రాంత వాసుల దశాబ్దాల కల.. నడికుడి- శ్రీకాళహస్తి రైల్వే లైన్.. అయిదేళ్ల వైకాపా పాలనలో ఈ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేయడంతో.. పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారాయి -
స్ట్రాంగ్ రూమ్కు పోస్టల్ బ్యాలెట్లు
[ 19-05-2024]
నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి పోస్టులో వచ్చిన పోస్టల్ బ్యాలెట్లను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములో ఉంచి సీల్ వేశారు. -
నేటి నుంచి పెంచలకోన బ్రహ్మోత్సవాలు
[ 19-05-2024]
బ్రహ్మోత్సవాలకు పెంచలకోన క్షేత్రం ముస్తాబైంది. నేటి నుంచి ప్రారంభమయ్యే ఉత్సవాలు 25వ తేదీ వరకు జరగనుండగా- ఆదివారం స్వామి అత్తారిల్లుగా చెప్పుకొనే గోనుపల్లి ఆలయం నుంచి ఉత్సవ మూర్తులను పెంచలకోన క్షేత్రానికి చేర్చనున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘భారతీయుడు 2’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ లుక్తో అజిత్
-
పీర్జాదిగూడ మేయర్, కార్పొరేటర్ల కిడ్నాప్నకు కాంగ్రెస్ యత్నం: హరీశ్రావు
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
బహిరంగ సభ మధ్యలోనే వెనుదిరిగిన రాహుల్.. కారణమిదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
నిలిచిపోయిన కాగజ్నగర్, నవజీవన్ ఎక్స్ప్రెస్ రైళ్లు .. ప్రయాణికుల ఆందోళన