logo

తెదేలో చేరికలు

కావలి రూరల్ మండలం కొత్తపల్లి వైకాపా సర్పంచ్ చిమ్మిలి శ్రీహరి నాయుడు, ఆయన తండ్రి సీనియర్ వైకాపా నాయకుడు చిమ్మిలి అంకబాబు బుధవారం తెదేపాలో చేరారు.

Updated : 08 May 2024 17:06 IST

కావలి: కావలి రూరల్ మండలం కొత్తపల్లి వైకాపా సర్పంచ్ చిమ్మిలి శ్రీహరి నాయుడు, ఆయన తండ్రి సీనియర్ వైకాపా నాయకుడు చిమ్మిలి అంకబాబు బుధవారం తెదేపాలో చేరారు. కావలి తెదేపా కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి కావలి అసెంబ్లీ అభ్యర్థి కావ్య క్రిష్ణారెడ్డి వారికి కండువా కప్పి  పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైకాపా పాలనలో అభివృద్ధి లేదని విమర్శించారు. కావ్య క్రిష్ణారెడ్డి పై నమ్మకంతో ఆయన చేస్తున్న కార్యక్రమాలు చూసి తెదేపాలో చేరామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని