పుస్తకాల నిలయం.. సమస్యల వలయం
జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఉదయం 5 గంటల్లోపు వస్తేనే ఆచూకీ విభాగంలో కుర్చీ దొరుకుతుంది. ఆలస్యంగా వస్తే వెనుదిరగాల్సిందే. సొంత పుస్తకాలు వెంట తెెచ్చుకున్న వారు గ్రంథాలయంలోని అన్ని గదులు, విభాగాల్లో కిక్కిరిసిపోతున్నారు.
జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఉద్యోగార్థుల ఇబ్బందులు
పాత డీఈవో కార్యాలయంలోనూ ఇదే పరిస్థితి
న్యూస్టుడే, నిజామాబాద్ సాంస్కృతికం
పఠనంలో నిమగ్నమైన అభ్యర్థులు
జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఉదయం 5 గంటల్లోపు వస్తేనే ఆచూకీ విభాగంలో కుర్చీ దొరుకుతుంది. ఆలస్యంగా వస్తే వెనుదిరగాల్సిందే. సొంత పుస్తకాలు వెంట తెెచ్చుకున్న వారు గ్రంథాలయంలోని అన్ని గదులు, విభాగాల్లో కిక్కిరిసిపోతున్నారు. ఏ మూలన చూసినా సందడిగా ఉంటోంది. నిత్యం వందల సంఖ్యలో తరలివస్తున్న అభ్యర్థుల సమస్యలపై గతంలో ‘ఈనాడు’లో రాసిన కథనాలకు స్పందించిన పాలనాధికారి సమీపంలో ఖాళీగా ఉంటున్న పాత డీఈవో కార్యాలయాన్ని కేటాయించారు. అయితే ఇందులో ఒక గదిని మాత్రమే చదువుకునేందుకు అనుకూలంగా మార్చారు. అధిక సంఖ్యలో అభ్యర్థులు వస్తుండటంతో ఇక్కడా స్థలం సరిపోక తిప్పలు పడుతున్నారు. కనీసం మరో రెండు గదులు అందుబాటులోకి తేవాలని కోరుతున్నారు.
మూత్రశాలల నిర్వహణ అధ్వానం..
గ్రూప్- 1, 2, 3తో పాటు డీఎస్సీకి సిద్ధమవుతున్న అభ్యర్థులు అద్దె గదుల్లో ఉంటూ గ్రంథాలయానికి వస్తున్నారు. నిత్యం 600 మందికి పైగా సందర్శిస్తున్నారు. ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు గ్రంథాలయం రద్దీగా ఉంటోంది. వీరి కోసం కేటాయించిన పాత డీఈవో కార్యాలయంలో 5 గదులు ఖాళీగా ఉన్నాయి. కానీ, ఒకే గదిని చదువుకునేందుకు అనుకూలంగా మార్చారు. ఇందులో టేబుళ్లు, కుర్చీలు, అట్టలు సరిపోవడం లేదంటున్నారు. కుర్చీల కోసం కొట్లాటలు తప్పడం లేదు. మూత్రశాలలు నిర్వహణ అధ్వానంగా ఉంది. వేసవిలో కూలర్లును ఏర్పాటు చేయకపోవడంతో ఉక్కపోతతో చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నామని వాపోతున్నారు. మహిళల కోసం ప్రత్యేక గది లేదు. విద్యుత్తు అంతరాయం ఏర్పడితే ఇక అంతే. జనరేటర్ సౌకర్యం కల్పించలేదు. రక్షణ కోసం సీసీ కెమెరాలు బిగించాలి. ప్రాంగణంలో ప్రైవేటు వాహనాలు పార్కింగ్ చేయకుండా చూడాలి.
వసతులు కల్పించాలి
సామ్రాట్, ఉద్యోగార్థి, వేెల్పూర్
నేను రెండేళ్ల నుంచి ఇక్కడికి వస్తున్నా. గ్రూప్స్-1 కోసం సిద్ధమవుతున్నా. జిల్లా కేంద్ర గ్రంథాలయంలో స్థలం లేకపోవడంతో పాత డీఈవో కార్యాలయానికి సూర్యోదయానికి ముందే వెళ్తున్నాం. లేదంటే కుర్చీలు దొరకవు. మిగతా గదులను సైతం అందుబాటులోకి తెచ్చి టేబుళ్లు, కుర్చీలు, అట్టలు సమకూర్చాలి. ఆచూకీ విభాగం ఇక్కడా ఏర్పాటు చేయాలి. పోటీ పరీక్షల మ్యాగజైన్లను ఉంచాలి. ప్రత్యేకంగా సిబ్బందిని నియమించాలి.
గతంలోనే ప్రతిపాదనలు
బుగ్గారెడ్డి, గ్రంథాలయ సంస్థ కార్యదర్శి
జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని విస్తరించేందుకు, కొత్త భవన నిర్మాణం కోసం గతంలోనే ప్రతిపాదనలు రూపొందించాం. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నాం. వారి వినతి మేరకు జిల్లా పాలనాధికారి పాత డీఈవో కార్యాలయ స్థలాన్ని గ్రంథాలయానికి కేటాయించారు. అక్కడా అవసరమైన వసతులు కల్పించాం. పెరుగుతున్న ఉద్యోగార్థుల కోసం మిగతా గదులను సైతం అందుబాటులోకి తెస్తాం.
అందుబాటులో ఉన్నవి
ఆచూకీ విభాగం 14,150 పుస్తకాలు
అరువిచ్చే విభాగం 62,540 పుస్తకాలు
అరువిచ్చే విభాగంలో సభ్యత్వాలు 80154
రోజువారి పాఠకులు 600 మందికి పైగానే..
మ్యాగజైన్లు, పుస్తకాలు 13,125
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాన్నకు వందనం
[ 16-06-2024]
: నాన్న.. త్యాగాలకు నిలువెత్తు రూపం. కష్టాల కడలిలో ఒడ్డుకు చేర్చే నావికుడు. భవితకు మార్గం చూపే మార్గదర్శకుడు. -
గిరిజన జీవితాలే.. నా పుస్తకాలు
[ 16-06-2024]
గిరిజన జీవితాలను, విభిన్న మనస్తత్వాలను సుఖదుఃఖాలను లోతుగా పరిశీలించారు. తను చూసిన బతుకునీ, తన వాళ్ల వెతల్నీ, కథల్నీ కవిత్వంలో చెప్పాలనుకున్నాడు. -
అటవీ అధికారులకు రక్షణ కల్పించాలి
[ 16-06-2024]
అడవుల సంరక్షణ, భూములు అన్యాక్రాంతం కాకుండా విధులు నిర్వహిస్తున్న తమకు ప్రభుత్వం రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఫారెస్టు రేంజ్ అధికారుల సంఘం(బాసర సర్కిల్) ఉపాధ్యక్షుడు రవిమోహన్ భట్, జూనియర్ అటవీ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు సుధాకర్ పేర్కొన్నారు. -
విక్రయించిన ప్రతి బస్తాకూ లెక్క
[ 16-06-2024]
విత్తనాలు, ఎరువుల విక్రయాల్లో నిబంధనలు పాటించాలని, విక్రయించిన ప్రతి బస్తాకు లెక్కలుండాలని అదనపు కలెక్టర్ కిరణ్ ఆదేశించారు. -
ఎమ్మెల్యే సార్లూ.. మీరంతా కదలండీ
[ 16-06-2024]
జిల్లాలో ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు డిమాండ్ ఏళ్లుగా ఉంది. ఎన్నికల సందర్భాల్లో అన్ని పార్టీలు హామీలిస్తున్నాయి. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం
[ 16-06-2024]
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందిన సంఘటన మండల పరిధిలోని బేగంపూర్ చౌరస్తా వద్ద 161వ జాతీయ రహదారిపై శనివారం చోటు చేసుకుంది. -
ఇస్కాన్ కేంద్రానికి ప్రచార వాహనం అందజేత
[ 16-06-2024]
ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు చేపడుతున్న ఇస్కాన్ కంఠేశ్వర్ కేంద్రానికి మహేశ్వరి సేవా సమాజ్ సభ్యులు శనివారం ఉచితంగా ధర్మ ప్రచార వాహనం అందించారు. -
రైతులు ఓటీఎస్ను సద్వినియోగం చేసుకోవాలి
[ 16-06-2024]
సహకార బ్యాంకులో దీర్ఘకాలిక రుణాలు తీసుకున్న రైతులు ఓటీఎస్(వన్ టైం సెటిల్మెంట్)ను సద్వినియోగం చేసుకోవాలని ఉమ్మడి జిల్లాల సహకార బ్యాంకు మేనేజర్ సూర్య ప్రకాష్ పేర్కొన్నారు. -
అప్పు తీసుకొని.. అంతమొందించాడు
[ 16-06-2024]
ఇటీవల హత్యకు గురైన ఉప్పరి సాయవ్వ (70) హత్యకేసును పోలీసులు ఛేదించారు. ఈ మేరకు శనివారం బాన్సువాడ సీఐ మున్నూరు కృష్ణ పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు అన్ని విధాలా అండగా ఉంటా: నారా లోకేశ్
-
రామోజీరావు జీవితం నుంచి చాలా నేర్చుకోవాలి: ఎం. నాగేశ్వరరావు
-
క్రమశిక్షణ చర్యల్లో భాగంగా గిల్ను వెనక్కి పంపారా..? బ్యాటింగ్ కోచ్ ఏమన్నారంటే..
-
ఏపీలో దేవదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ రాజీనామా
-
తిరుమలలో భక్తుల రద్దీ.. దర్శనానికి 36 గంటలు
-
ఫాదర్స్ డే.. స్పెషల్ ఫొటోలు పంచుకున్న చిరంజీవి, అల్లు అర్జున్