కల్తీ చేస్తూ.. విక్రయిస్తూ..
మద్యం మత్తు మనుషులకు వివిధ రకాలుగా చేటు చేస్తుంది. అదే కల్తీ మద్యం తాగితే పరిస్థితి ఆరోగ్యంపై అధిక ప్రభావం చూపుతుంది. మద్యం ప్రియులు తాగుతున్నప్పుడు తాము తీసుకునేది అసలైనదా.. కాదా.. అని ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మద్యం దుకాణాదారుల దందా
న్యూస్టుడే, నిజామాబాద్ నేర విభాగం
మద్యం సీసాల్లో నీరు కలిపిన నిందితుడిని పట్టుకున్న ఎక్సైజ్ అధికారులు
- నగరంలోని పరమేశ్వరీ వైన్సులో కల్తీ మద్యం అమ్ముతున్నారనే సమాచారంతో ఈనెల 9న ఆబ్కారీ, టాస్క్ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు. వైన్సు నిర్వాహకులు ఎక్కువ ధర ఉన్న మద్యం సీసాల్లో నీళ్లు కలిపి కలుపుతున్నట్లు గుర్తించారు. దుకాణం యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. అక్కడ దొరికిన మద్యాన్ని ల్యాబ్కు పంపించడంతో విషయం బయటకు వచ్చింది. దుకాణం యాజమాన్యంపై కేసు నమోదు చేశారు.
- ఖానాపూర్ శివారులోని ఓ మద్యం దుకాణంలో ఒకరు బీరు సీసా కొనుక్కున్నాడు. సీల్ ఉన్న సీసాను పరిశీలిస్తే అందులో చెత్త కనిపించింది. ఇలాంటి బీర్లు అమ్మి వినియోగదారుల ప్రాణాలతో చెలగాటమాడొద్దంటూ సదరు వ్యక్తి సామాజిక మాధ్యమంలో పెట్టిన వీడియో వైరల్ అయ్యింది.
మద్యం మత్తు మనుషులకు వివిధ రకాలుగా చేటు చేస్తుంది. అదే కల్తీ మద్యం తాగితే పరిస్థితి ఆరోగ్యంపై అధిక ప్రభావం చూపుతుంది. మద్యం ప్రియులు తాగుతున్నప్పుడు తాము తీసుకునేది అసలైనదా.. కాదా.. అని ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో మొత్తం 102 వైన్సు ఉన్నాయి. గతేడాది ఆగస్టులో లక్కీ డ్రా ద్వారా వీటిని వ్యాపారులు సొంతం చేసుకున్నారు. 2023 డిసెంబర్ నుంచి కొత్త యజమానులు వీటిని నిర్వహిస్తున్నారు. నిర్వాహకులు నిబంధనలకు లోబడి కల్తీ లేని మద్యం విక్రయించాలి. కానీ అలా జరగడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
లాభాల వేటలో పడి తప్పుదారి..
ఈ వ్యాపారంలోకి కొత్తగా వచ్చినవారిలో కొందరు లాభాలు దండుకోవాలని చూస్తుంటారు. తక్కువ సమయంలో ఎక్కువ ఆర్జించడానికి తప్పుదారిలో వెళ్తున్నారు. ఫలితంగా అధిక ధరకు విక్రయించే సీసాల్లో తక్కువ వెల ఉన్న మద్యం, నీళ్లు కలిపి విక్రయిస్తున్నారు. ఎక్సైజ్ శాఖ నిఘా పెంచితేనే వీరి చర్యలను అరికట్టవచ్చు.
అనుమానం వస్తే ఫిర్యాదు చేయాలి
మద్యం కొనుగోలు చేసేప్పుడు ఎలాంటి అనుమానాలు వచ్చిన ఎక్సైజ్ అధికారులకు సమాచారం అందించాలి. సమాచారం అందిన వెంటనే అధికారులు వచ్చి మద్యం నాణ్యతను పరిక్షిస్తారు తేడా అనిపిస్తే వెంటనే చర్యలు తీసుకుంటారు.
కఠిన చర్యలు తీసుకుంటాం
- మల్లారెడ్డి, ఎక్సైజ్ సూపరింటెండెంట్, నిజామాబాద్
మద్యం దుకాణాలు సజావుగా నిర్వహించడానికి కావాల్సిన సహకారాలు మా శాఖ నుంచి ఉంటాయి. వ్యాపారం ముసుగులో తప్పుదోవ పడితే ఉపేక్షించం. ప్రతి దుకాణంపై నిఘా ఉంటుంది. గత రికార్డులతో పోలిస్తే అమ్మకాలు ఎలా ఉన్నాయనేది ఆరా తీస్తాం. రాష్ట్ర టాస్క్ఫోర్స్ అధికారులు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఎక్కడ అనుమానం వచ్చినా దాడులు చేస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాన్నకు వందనం
[ 16-06-2024]
: నాన్న.. త్యాగాలకు నిలువెత్తు రూపం. కష్టాల కడలిలో ఒడ్డుకు చేర్చే నావికుడు. భవితకు మార్గం చూపే మార్గదర్శకుడు. -
గిరిజన జీవితాలే.. నా పుస్తకాలు
[ 16-06-2024]
గిరిజన జీవితాలను, విభిన్న మనస్తత్వాలను సుఖదుఃఖాలను లోతుగా పరిశీలించారు. తను చూసిన బతుకునీ, తన వాళ్ల వెతల్నీ, కథల్నీ కవిత్వంలో చెప్పాలనుకున్నాడు. -
అటవీ అధికారులకు రక్షణ కల్పించాలి
[ 16-06-2024]
అడవుల సంరక్షణ, భూములు అన్యాక్రాంతం కాకుండా విధులు నిర్వహిస్తున్న తమకు ప్రభుత్వం రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఫారెస్టు రేంజ్ అధికారుల సంఘం(బాసర సర్కిల్) ఉపాధ్యక్షుడు రవిమోహన్ భట్, జూనియర్ అటవీ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు సుధాకర్ పేర్కొన్నారు. -
విక్రయించిన ప్రతి బస్తాకూ లెక్క
[ 16-06-2024]
విత్తనాలు, ఎరువుల విక్రయాల్లో నిబంధనలు పాటించాలని, విక్రయించిన ప్రతి బస్తాకు లెక్కలుండాలని అదనపు కలెక్టర్ కిరణ్ ఆదేశించారు. -
ఎమ్మెల్యే సార్లూ.. మీరంతా కదలండీ
[ 16-06-2024]
జిల్లాలో ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు డిమాండ్ ఏళ్లుగా ఉంది. ఎన్నికల సందర్భాల్లో అన్ని పార్టీలు హామీలిస్తున్నాయి. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం
[ 16-06-2024]
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందిన సంఘటన మండల పరిధిలోని బేగంపూర్ చౌరస్తా వద్ద 161వ జాతీయ రహదారిపై శనివారం చోటు చేసుకుంది. -
ఇస్కాన్ కేంద్రానికి ప్రచార వాహనం అందజేత
[ 16-06-2024]
ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు చేపడుతున్న ఇస్కాన్ కంఠేశ్వర్ కేంద్రానికి మహేశ్వరి సేవా సమాజ్ సభ్యులు శనివారం ఉచితంగా ధర్మ ప్రచార వాహనం అందించారు. -
రైతులు ఓటీఎస్ను సద్వినియోగం చేసుకోవాలి
[ 16-06-2024]
సహకార బ్యాంకులో దీర్ఘకాలిక రుణాలు తీసుకున్న రైతులు ఓటీఎస్(వన్ టైం సెటిల్మెంట్)ను సద్వినియోగం చేసుకోవాలని ఉమ్మడి జిల్లాల సహకార బ్యాంకు మేనేజర్ సూర్య ప్రకాష్ పేర్కొన్నారు. -
అప్పు తీసుకొని.. అంతమొందించాడు
[ 16-06-2024]
ఇటీవల హత్యకు గురైన ఉప్పరి సాయవ్వ (70) హత్యకేసును పోలీసులు ఛేదించారు. ఈ మేరకు శనివారం బాన్సువాడ సీఐ మున్నూరు కృష్ణ పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ విషయంలో నన్నెవరూ అధిగమించలేరు: కుమార్తెపై రామ్ చరణ్ ప్రేమ
-
సీసీఎస్ ప్రక్షాళనకు చర్యలు.. 12 మంది ఇన్స్పెక్టర్లపై బదిలీ వేటు
-
జమ్మూకశ్మీర్లో వరుస ఉగ్రదాడులు.. అమిత్ షా ఉన్నతస్థాయి సమావేశం
-
ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి మరోసారి చేదు అనుభవం
-
దిల్లీ నీటి సంక్షోభం.. పైపులైన్లకు పోలీసు పహారా?
-
రైల్లో ప్రయాణించిన కేంద్ర మంత్రి..ఫొటోలు వైరల్