అతివలకు ఈ-వాహనాలు
కామారెడ్డి జిల్లాలో ఐకేపీ, మెప్మా మహిళా సంఘాలు 21,958 ఉండగా 2,19,580 సభ్యులున్నారు. జిల్లాలో రాజంపేట నుంచి ఇప్పటి వరకు ఈ- ఆటో కోసం ఒక్క దరఖాస్తు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
స్త్రీనిధి ద్వారా రుణ సదుపాయం
బైకులు, ఆటోల కొనుగోలుకు చేయూత
న్యూస్టుడే, బీర్కూర్
కామారెడ్డిలో లబ్ధిదారుడికి ఆటో అందజేస్తున్న స్త్రీనిధి జోనల్ మేనేజర్ రవికుమార్, కంపెనీ ప్రతినిధులు
పస్తుతం పెరిగిన పెట్రోలు, డీజిలు ధరలతో పాటు వాతావారణ కాలుష్యం పెరగడంతో సామాన్యులు ఎలక్ట్రిక్ వాహనాలపై మొగ్గు చూపుతున్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు స్త్రీనిధి పథకం ద్వారా ఆటో, ద్విచక్ర వాహనాల కొనుగోలుకు రుణాలను అందిస్తోంది. క్షేత్ర స్థాయిలో ఐకేపీ, మెప్మా అధికారులు గ్రామాల్లో, పట్టణాల్లో పర్యటిస్తూ ఈ-వాహనాలపై అవగాహన కల్పిస్తున్నారు.
కామారెడ్డి జిల్లాలో ఐకేపీ, మెప్మా మహిళా సంఘాలు 21,958 ఉండగా 2,19,580 సభ్యులున్నారు. జిల్లాలో రాజంపేట నుంచి ఇప్పటి వరకు ఈ- ఆటో కోసం ఒక్క దరఖాస్తు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
పథకం విధి విధానాలు
* ఏ, బీ, సీ, డీ గ్రేడ్లోని గ్రామ/స్లమ్ సంఘాలకు అనుబంధంగా ఉండే సంఘాల్లోని సభ్యులు ఈ రుణం పొంద వచ్చు. ప్యాసింజర్, ట్రాలీ ఆటోలను ప్రజా రవాణా, సరకుల రవాణా కోసం వినియోగించుకోవచ్చు. గ్రామ సంఘంలో సభ్యురాలై ఉండాలి. గతంలో స్త్రీనిధి రుణం తీసుకొని ఉన్నప్పటికీ అప్పు ఉండకూడదు.
* గ్రామ సంఘం తీర్మాన పత్రాన్ని ఐకేపీ కార్యాలయంలో అందజేయాలి. స్త్రీనిధి వెబ్సైట్లో ఆన్లైన్లో వివరాలను సీసీలు నమోదు చేస్తారు. సభ్యురాలు తొలుత వ్యక్తిగత ఖాతాలో రూ.15 వేలు జమ చేసి ఉండాలి. ఆటో కొనుగోలుకు స్త్రీనిధి ద్వారా రూ.2.85 లక్షల రుణాన్ని గ్రామ సంఘం ఖాతాలో జమ చేస్తుంది. ప్రభుత్వం రూ.70 వేల రాయితీ కల్పిస్తుంది. మొత్తం రూ.3 లక్షల రుణం లభిస్తుంది. మహీంద్రా కంపెనీలో ఈ- వాహనాలను కొనుగోలు చేయాలి. తీసుకొన్న రుణాన్ని ప్రతి నెలా రూ.6,700 వాయిదాను ఐకేపీ కార్యాలయంలో చెల్లించాలి. 60 నెలల్లో రుణం చెల్లించాలి. మొత్తం రుణం చెల్లించే వరకు వాహనాన్ని ఎవరికి విక్రయించేందుకు వీలుండదు. మొత్తం రుణం చెల్లించాక ఎన్వోసీ పత్రాన్ని అందజేస్తారు. ఈ ఎలక్ట్రిక్ ఆటోలో నలుగురి నుంచి ఐదుగురు వరకు ప్రయాణించవచ్చు. 500 కిలోల వరకు సరకు రవాణా చేయవచ్చు.
ద్విచక్రవాహనం విధానాలు
సంఘంలో సభ్యురాలిగా ఉండాలి. గతంలో ఏ అప్పులు తీసుకున్నా కూడా ఈ- ద్విచక్ర వాహనం రుణ సదుపాయాన్ని కల్పిస్తారు. ద్విచక్ర వాహనం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం రూ.75 వేలు రుణం మంజూరు చేస్తుంది. రిజిస్ట్రేషన్ కాని ద్విచక్ర వాహనాలకు ఎలాంటి రాయితీ లేదు. రిజిస్ట్రేషన్ చేసుకొన్న వాహనాలకు రూ.22 వేలు రాయితీ అందిస్తుంది. ప్రతి నెలా రూ.1700 కిస్తు చెల్లించాలి. 48 నెలల్లో రుణాన్ని వాయిదాలలో చెల్లించాలి.
తీసుకొనేందుకు ముందుకు రావాలి
..రవికుమార్, స్త్రీనిధి జోనల్ మేనేజర్, కామారెడ్డి
పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు ఈ-వాహనాల కొనుగోలుకు స్త్రీనిధి ద్వారా రుణాలు మంజూరు చేస్తూ ప్రోత్సాహకం అందిస్తుంది. అర్హులైన ప్రతి ఒక్కరికి రుణం మంజూరు చేస్తాం. తీసుకొనేందుకు ముందుకు రావాలి. ఐకేపీ, మెప్మా అధికారులు క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్
[ 27-04-2024]
మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పార్టీ శ్రేణుల్లో జోష్ నింపారు. నారాయణఖేడ్ నియోజకవర్గ అభివృద్ధికి భరోసా కల్పించారు. -
పల్లె పిలుస్తోంది.. పదండి..
[ 27-04-2024]
పిల్లలూ.. మీరు పట్టణాల్లో ఉంటున్నా.. మీ మూలాలు పల్లెలకు చెంది ఉంటాయి. అక్కడి ప్రత్యేకతలేంటో మీకు తెలుసా మరీ.. పట్టణాలకు చెందిన వారే కాదు.. -
పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్లు 17,04,867 మంది
[ 27-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ ఓటర్ల తుది జాబితాను అధికారులు శుక్రవారం విడుదల చేశారు. -
బాజిరెడ్డికి 1.. అర్వింద్కు 2.. జీవన్రెడ్డికి 3...
[ 27-04-2024]
నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో త్రిముఖ పోరు నెలకొంది. భాజపా, కాంగ్రెస్, భారాస అభ్యర్థులు నామినేషన్ ప్రక్రియ ప్రారంభానికి ముందు నుంచే ప్రచారం ముమ్మరం చేశారు. -
మద్యం మత్తు.. ప్రాణాలు తీస్తోంది
[ 27-04-2024]
గతేడాది అక్టోబరు 28న ధర్మారం(బీ)లో పెట్రోల్ బంక్ వద్ద డిచ్పల్లి వైపు వస్తున్న నిజామాబాద్కు చెందిన యువతీ యువకులను కారు ఢీ కొంది. -
పది మంది నామినేషన్ల తిరస్కరణ
[ 27-04-2024]
నిజామాబాద్ లోక్సభ స్థానానికి దాఖలైన నామినేషన్లను కలెక్టరేట్లో శుక్రవారం సాధారణ ఎన్నికల పరిశీలకురాలు ఎలిస్వజ్ సమక్షంలో పరిశీలించారు. -
సార్వత్రిక పరీక్షలు.. అయినవాళ్లకే విధులు
[ 27-04-2024]
ఓపెన్ స్కూల్ సొసైటీకి సంబంధించిన పది, ఇంటర్ పరీక్షలు గురువారం ప్రారôభమయ్యాయి. ఏటా వేసవిలో నిర్వహించే ఈ పరీక్షలకు ఇన్విజిలేటర్ల నియామకంలో పైరవీలకే పెద్దపీట వేస్తున్నట్లు ఉపాధ్యాయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. -
చేరికలపై హస్తం పార్టీ దృష్టి
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక లోకసభ స్థానాల్లో విజయం సాధించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక కసరత్తు చేస్తోంది. -
జిల్లాలో పెరిగిన ఓటర్లు
[ 27-04-2024]
జిల్లా ఓటర్ల సంఖ్య పెరిగింది. జహీరాబాద్ లోక్సభ పరిధిలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాల్లో మొత్తంగా 4,127 మంది ఓటర్లు పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. -
అనారోగ్యాన్ని జయించి... ఇంటర్లో ప్రతిభ చూపి
[ 27-04-2024]
అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురికి రెండేళ్ల కిందట వరుసగా రెండు శస్త్రచికిత్సలు చేసినా ఫలితాన్ని ఇవ్వకపోవడంతో ఆ కుటుంబం తల్లిడిల్లిపోయింది. -
ఎండలతో ఆలస్యంగా సమావేశాలు
[ 27-04-2024]
ప్రస్తుతం బయటకు వెళ్లాలంటే ఎండ తక్కువ ఉన్నప్పుడే చూసుకుని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. -
ఎన్నికల క్షేత్రంలో మాజీ పాలనాధికారులు
[ 27-04-2024]
నిజామాబాద్ జిల్లా కలెక్టర్లుగా ఇది వరకు పనిచేసి పదవీ విరమణ పొందిన అధికారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. -
2 నదులు 2 లోక్సభ నియోజకవర్గాలు
[ 27-04-2024]
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రధాన నదులు రెండు. అవి గోదావరి, మంజీర. అలాగే ఉమ్మడి జిల్లా రెండు లోక్సభ నియోజకవర్గాల పరిధిలో విస్తరించి ఉంది. -
గీత దాటితే.. జైలుకే
[ 27-04-2024]
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నియమావళిని ఎన్నికల సంఘం కఠినంగా అమలు చేయనుంది. -
అతివేగంతోనే ప్రమాదం
[ 27-04-2024]
కమ్మర్పల్లి నుంచి బడాపహాడ్కు గురువారం రాత్రి సుమారు 36 మంది భక్తులతో వెళ్తున్న డీసీఎం వాహనం బోల్తాపడి ఇద్దరు మృతిచెందగా.. పలువురు గాయపడిన సంగతి తెలిసిందే. -
భర్త గొంతు నులిమి చంపిన భార్య
[ 27-04-2024]
కుమార్తెను మానసికంగా వేధిస్తున్న భర్తను భార్య గొంతు నులిమి చంపిన ఘటన కులాస్పూర్లో గురువారం రాత్రి చోటుచేసుకుంది.