నివాసంలోనే నిరవధిక దీక్ష
నియోజకవర్గంలో రైతుల భూ సమస్యలను పరిష్కరించడంతో పాటు అక్రమాలకు పాల్పడిన వారిపై కలెక్టర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ భాజపా నేత కాటిపల్లి వెంకటరమణారెడ్డి బుధవారం రెండో రోజు ఆమరణ నిరాహార దీక్ష కొనసాగించారు.
మద్దతు తెలిపిన పలువురు నాయకులు
న్యూస్టుడే, కామారెడ్డి పట్టణం
వెంకటరమణారెడ్డి దీక్షకు సంఘీభావం తెలుపుతున్న మాజీ ఎంపీ వివేక్, మాజీ ఎమ్మెల్యే రవీందర్రెడ్డి
నియోజకవర్గంలో రైతుల భూ సమస్యలను పరిష్కరించడంతో పాటు అక్రమాలకు పాల్పడిన వారిపై కలెక్టర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ భాజపా నేత కాటిపల్లి వెంకటరమణారెడ్డి బుధవారం రెండో రోజు ఆమరణ నిరాహార దీక్ష కొనసాగించారు. రామారెడ్డి ఠాణా నుంచి కామారెడ్డిలోని ఆయన నివాసానికి చేర్చగా అక్కడే దీక్షకు పూనుకున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఆయా పక్షాల ప్రతినిధులు, రైతులు సంఘీభావం తెలిపారు. మాజీ ఎంపీ వివేక్, మాజీ ఎమ్మెల్యే రవీందర్రెడ్డి వచ్చి మద్దతు ప్రకటించారు.
విలువైన భూములు కాజేస్తున్నారు : మాజీ ఎంపీ వివేక్
రాష్ట్రంలో కోట్లాది రూపాయల విలువైన భూములను కల్వకుంట్ల కుటుంబం కాజేస్తోంది. రైతుల భూములను నిషేధిత జాబితాలో చేర్చి రెవెన్యూ దందాకు తెరలేపారు. 30 నుంచి 50శాతం కమీషన్లు తీసుకుని సీఎం కేసీఆర్ కుటుంబీకులు భూ సమస్యలను పరిష్కరిస్తున్నారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ పథకాల్లో ప్రస్తుతం కమీషన్ వచ్చే పరిస్థితి లేకపోవడంతో ధరణి పోర్టల్లో చిక్కులు సృష్టించి సొమ్ము చేసుకుంటున్నారు. ధరణి ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తంగా చేపట్టేందుకు సిద్ధమవుతాం.
నేడు ఈటల రాజేందర్ రాక
దీక్షకు సంఘీభావం ప్రకటించడానికి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ జిల్లాకేంద్రానికి గురువారం ఉదయం 9 గంటలకు రానున్నారు. రమణారెడ్డి ఇంటి వద్దకు వెళ్లి ఆయణ్ను పరామర్శించనున్నారు.
‘కలెక్టర్ స్పందించాలి’
కామారెడ్డి పట్టణం: రైతుల కోసం ఆమరణ దీక్షకు దిగిన వెంకటరమణారెడ్డి ఆరోగ్యం క్షీణిస్తోందని భాజపా జిల్లా అధ్యక్షురాలు అరుణతార పేర్కొన్నారు. కలెక్టర్ స్పందించి ధరణి సమస్యల పరిష్కారానికి స్పష్టమైన హామీ ఇవ్వాలన్నారు. దీక్షా శిబిరం వద్ద బుధవారం రాత్రి నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. న్యాయబద్ధంగా చేస్తున్న పోరాటానికి వివిధ వర్గాలు, రైతులు బాసటగా నిలవడం అభినందనీయమన్నారు. ఆయన ఆరోగ్యంపై కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి తేలు శ్రీను, జిల్లా ఉపాధ్యక్షుడు ఆకుల భరత్, నగర అధ్యక్షుడు విపుల్జైన్ తదితరులున్నారు.
వైద్యుల పర్యవేక్షణ
ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్న వైద్యులు
వెంకటరమణారెడ్డి నీరు, ఆహారం తీసుకోకుండా దీక్ష కొనసాగిస్తున్నారు. వైద్యులు గంటగంటకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. మధుమేహం, రక్తపోటు స్థాయిలో హెచ్చుతగ్గులు నెలకొంటున్నాయని వైద్యులు వెల్లడించారు. రైతుల కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధమని రమణారెడ్డి స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్
[ 27-04-2024]
మెదక్ జిల్లా పెద్దశంకరంపేటలో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పార్టీ శ్రేణుల్లో జోష్ నింపారు. నారాయణఖేడ్ నియోజకవర్గ అభివృద్ధికి భరోసా కల్పించారు. -
పల్లె పిలుస్తోంది.. పదండి..
[ 27-04-2024]
పిల్లలూ.. మీరు పట్టణాల్లో ఉంటున్నా.. మీ మూలాలు పల్లెలకు చెంది ఉంటాయి. అక్కడి ప్రత్యేకతలేంటో మీకు తెలుసా మరీ.. పట్టణాలకు చెందిన వారే కాదు.. -
పార్లమెంట్ నియోజకవర్గ ఓటర్లు 17,04,867 మంది
[ 27-04-2024]
నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ ఓటర్ల తుది జాబితాను అధికారులు శుక్రవారం విడుదల చేశారు. -
బాజిరెడ్డికి 1.. అర్వింద్కు 2.. జీవన్రెడ్డికి 3...
[ 27-04-2024]
నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో త్రిముఖ పోరు నెలకొంది. భాజపా, కాంగ్రెస్, భారాస అభ్యర్థులు నామినేషన్ ప్రక్రియ ప్రారంభానికి ముందు నుంచే ప్రచారం ముమ్మరం చేశారు. -
మద్యం మత్తు.. ప్రాణాలు తీస్తోంది
[ 27-04-2024]
గతేడాది అక్టోబరు 28న ధర్మారం(బీ)లో పెట్రోల్ బంక్ వద్ద డిచ్పల్లి వైపు వస్తున్న నిజామాబాద్కు చెందిన యువతీ యువకులను కారు ఢీ కొంది. -
పది మంది నామినేషన్ల తిరస్కరణ
[ 27-04-2024]
నిజామాబాద్ లోక్సభ స్థానానికి దాఖలైన నామినేషన్లను కలెక్టరేట్లో శుక్రవారం సాధారణ ఎన్నికల పరిశీలకురాలు ఎలిస్వజ్ సమక్షంలో పరిశీలించారు. -
సార్వత్రిక పరీక్షలు.. అయినవాళ్లకే విధులు
[ 27-04-2024]
ఓపెన్ స్కూల్ సొసైటీకి సంబంధించిన పది, ఇంటర్ పరీక్షలు గురువారం ప్రారôభమయ్యాయి. ఏటా వేసవిలో నిర్వహించే ఈ పరీక్షలకు ఇన్విజిలేటర్ల నియామకంలో పైరవీలకే పెద్దపీట వేస్తున్నట్లు ఉపాధ్యాయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. -
చేరికలపై హస్తం పార్టీ దృష్టి
[ 27-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక లోకసభ స్థానాల్లో విజయం సాధించేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక కసరత్తు చేస్తోంది. -
జిల్లాలో పెరిగిన ఓటర్లు
[ 27-04-2024]
జిల్లా ఓటర్ల సంఖ్య పెరిగింది. జహీరాబాద్ లోక్సభ పరిధిలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాల్లో మొత్తంగా 4,127 మంది ఓటర్లు పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. -
అనారోగ్యాన్ని జయించి... ఇంటర్లో ప్రతిభ చూపి
[ 27-04-2024]
అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురికి రెండేళ్ల కిందట వరుసగా రెండు శస్త్రచికిత్సలు చేసినా ఫలితాన్ని ఇవ్వకపోవడంతో ఆ కుటుంబం తల్లిడిల్లిపోయింది. -
ఎండలతో ఆలస్యంగా సమావేశాలు
[ 27-04-2024]
ప్రస్తుతం బయటకు వెళ్లాలంటే ఎండ తక్కువ ఉన్నప్పుడే చూసుకుని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. -
ఎన్నికల క్షేత్రంలో మాజీ పాలనాధికారులు
[ 27-04-2024]
నిజామాబాద్ జిల్లా కలెక్టర్లుగా ఇది వరకు పనిచేసి పదవీ విరమణ పొందిన అధికారులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. -
2 నదులు 2 లోక్సభ నియోజకవర్గాలు
[ 27-04-2024]
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రధాన నదులు రెండు. అవి గోదావరి, మంజీర. అలాగే ఉమ్మడి జిల్లా రెండు లోక్సభ నియోజకవర్గాల పరిధిలో విస్తరించి ఉంది. -
గీత దాటితే.. జైలుకే
[ 27-04-2024]
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నియమావళిని ఎన్నికల సంఘం కఠినంగా అమలు చేయనుంది. -
అతివేగంతోనే ప్రమాదం
[ 27-04-2024]
కమ్మర్పల్లి నుంచి బడాపహాడ్కు గురువారం రాత్రి సుమారు 36 మంది భక్తులతో వెళ్తున్న డీసీఎం వాహనం బోల్తాపడి ఇద్దరు మృతిచెందగా.. పలువురు గాయపడిన సంగతి తెలిసిందే. -
భర్త గొంతు నులిమి చంపిన భార్య
[ 27-04-2024]
కుమార్తెను మానసికంగా వేధిస్తున్న భర్తను భార్య గొంతు నులిమి చంపిన ఘటన కులాస్పూర్లో గురువారం రాత్రి చోటుచేసుకుంది.