చిన్న ప్రాణి... తీస్తోంది ప్రాణం..
నిజమే పలుకులో రెండక్షరాలు. పరిమాణంలో సూక్ష్మం. కానీ దాని సూదుల్లాంటి కాట్లకు ఎవరైనా కుదేలవ్వాల్సిందే. ఆ ఏముందిలే! అని తేలిగ్గా తీసేసేవారు ఆ గాయాలు అనుభవించిన వారిని అడిగితే తెలుస్తుంది
నేడు ప్రపంచ దోమ నియంత్రణ దినం
న్యూస్టుడే, ఇందూరు ఫీచర్స్
25,000 కోట్లు...
2016లో ఒక అధ్యయన నివేదిక ప్రకారం భారత్లో దోమలు మోపుతున్న ఆర్థిక భారం..
గల్లీ చిన్నది... గరీబోళ్ల కథ పెద్దది... ఈ పాట గుర్తుంది కదా!
ఈ పాటను దోమ చిన్నది... అది చేసే నష్టం పెద్దది అని రాసుకుని పాడాల్సిందే.
నిజమే పలుకులో రెండక్షరాలు. పరిమాణంలో సూక్ష్మం. కానీ దాని సూదుల్లాంటి కాట్లకు ఎవరైనా కుదేలవ్వాల్సిందే. ఆ ఏముందిలే! అని తేలిగ్గా తీసేసేవారు ఆ గాయాలు అనుభవించిన వారిని అడిగితే తెలుస్తుంది వాటి తీవ్రత. చెంతనే ఉంటూ చేటు చేస్తున్న వాటిపై అవగాహన పెంచడానికి ప్రపంచ దోమ నియంత్రణ దినం ఏటా ఆగస్టు 20న నిర్వహిస్తున్నారు. ఆడ ఎనాఫిలిస్ దోమతో మలేరియా సోకుతుందని రొనాల్డ్ రోస్ కనుగొన్న సందర్భంగా దోమలపై అవగాహన పెంచడానికి ప్రత్యేక రోజు కేటాయించారు.
దోమ కుట్టినప్పుడు చేతిపై చిన్న దురద... మహా అయితే స్వల్ప వ్యవధిలో కనిపించే దద్దుర్లు మినహా మరేది గుర్తుండదు. కానీ ఆ కాటుతో ఏర్పడే ఆర్థిక భారం మాత్రం జీవితాంతం గుర్తుండిపోయేలా చేస్తుందనడంలో సందేహం లేదు.
నిల్వ నీటిలో ఆయిల్ బాల్స్ వేస్తున్న పుర పారిశుద్ధ్య సిబ్బంది
ఇలా చేస్తే...
వ్యాధులు ప్రబలడానికి కారణమయ్యే కీటకాలను నిలువరించడానికి ప్రభుత్వం చేపట్టిన మూడు కార్యక్రమాలు ఉపయుక్తంగా ఉన్నాయి.
ఆదివారం పది గంటలకు పది నిమిషాలు.... ఇది పురపాలక శాఖ నిర్ణయించిన కార్యక్రమం. పట్టణాలు, పల్లెలు తేడా లేకుండా ఇంటి పరిసరాలను శుభ్రం చేస్తే దోమల నిల్వకు, ఉత్పత్తికి ఆస్కారముండదు.
ఫ్రైడే డ్రైడే... ప్రతి శుక్రవారం ఇంట్లో నీటి నిల్వలన్నింటినీ ఖాళీ చేసి పాత్రలు, తొట్లను ఆరబెడితే దోమ లార్వా ఉంటే తొలగిపోతుంది. దోమల వృద్ధి నిలిచిపోతుంది.
పునరాలోచన దినం... ప్రతి నెల చివరి శనివారం పునరాలోచన దినం పాటించాలని పురపాలక శాఖ సూచించింది. ఆ రోజు ఒక్కసారి ఇంట్లో పాత వస్తువులు బయట పడేయడానికి పూనుకుంటే... చెత్త తొలగి దోమలు మరుగయ్యే చోటు ఖాళీ ఏర్పడుతుంది.
ఆర్థికంగా ఎలా భారం పడుతుందంటే...?
అన్ని రకాల దోమలు కుట్టినప్పుడు తొలుత వచ్చేది జ్వరం. దాని తీవ్రత ఆధారంగా వైద్యానికి వెళుతుంటాం. అప్పుడు జిల్లాలో ఖర్చులు ఇలా...
ఆస్పత్రికి వెళ్లడానికి ఖర్చు : రూ. 200 (ఆస్పత్రిలో చేరాల్సి వస్తే అదనం)
వైద్యుల ఫీజు : రూ. 300-400
రక్తపరీక్షలు : జ్వర లక్షణాలను బట్టి మలేరియాకు రూ. 150, ప్లేట్లెట్స్ రూ. 300, డెంగీ ర్యాపిడ్ టెస్ట్ రూ. 600, సీబీపీ రూ. 150
డెంగీలో ప్లేట్లెట్స్ నెల వరకు కనీసం నాలుగుసార్లు పరీక్ష చేయించాల్సి ఉంటుంది. ఇక డెంగీ నిర్ధారణకు శాస్త్రీయమైన ఎలీసా పరీక్ష ప్రభుత్వ డయాగ్నోస్టిక్ కేంద్రంలోనే ఉంది. ప్రైవేటులో ఒక పరీక్షకు రూ. 5000 అవుతుంది.
చికిత్స : మలేరియా సాధారణ స్థాయిలో అయితే రూ. 500-1000
డెంగీ : రూ. 5000-10,000. రక్త ఫలకలు అవసరమైతే ఒక్క యూనిట్కు రూ. 2500. ఆస్పత్రిలో చేరితే అది రూ. 2 లక్షలకు పైగానే
చికున్ గున్యా : రూ. 1000-10,000 కీటక జనిత వ్యాధులతో చికిత్సకు స్థాయిని బట్టి రూ.1000-10,000 వరకు సాధారణ వ్యయం అవుతుంది. అదే పరిస్థితి చేయిదాటితే మాత్రం రూ. లక్షల్లో ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెరపైకి ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల
[ 17-05-2024]
జిల్లాలో ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల ఏర్పాటు అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. గతంలో మూడు విధాల ప్రతిపాదనలు ఉన్నత స్థాయికి వెళ్లినా ఆచరణలో ముందడుగు పడని విషయం తెలిసిందే. -
కేంద్రాల్లోనే ధాన్యం బస్తాలు
[ 17-05-2024]
జిల్లాలో వరి కోతలు మొదలై నెలరోజులైనా కొనుగోళ్లు పూర్తికావడం లేదు. హమాలీలు, సంచుల కొరత లేనప్పటికీ లారీలు లేక రైతులు కల్లాల వద్దే పడిగాపులు కాస్తున్నారు. ఇప్పటికే ధాన్యం నిల్వలు పేరుకుపోవడంతో సేకరణకు రైసుమిల్లర్లు ససేమిరా అంటున్నారు. -
ఎత్తుకు పై ఎత్తులు
[ 17-05-2024]
ఎల్లారెడ్డి పురపాలక సంఘం రాజకీయాలు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. ఛైర్మన్ పదవిని దక్కించుకునేందుకు కాంగ్రెస్, భారాసకు చెందిన నాయకులు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. -
రైతులకు అన్యాయం చేస్తే ఊరుకోం
[ 17-05-2024]
అసెంబ్లీ ఎన్నికల సమయంలో ధాన్యానికి క్వింటాలుకు రూ.500 బోనస్గా చెల్లిస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక కేవలం సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని రైతులకు చేస్తున్న మోసాన్ని వదిలేది లేదని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ హెచ్చరించారు. -
పారిశ్రామిక శిక్షణ.. ఉపాధికి నిచ్చెన
[ 17-05-2024]
తక్కువ చదువుతో ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉన్న కోర్సులు ఐటీఐ. పారిశ్రామిక శిక్షణ పూర్తి చేసిన వారిలో 90 శాతం మంది ఉపాధి పొందుతున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. -
పెరిగిన వినియోగం.. తగ్గిన లబ్ధిదారులు
[ 17-05-2024]
రాష్ట్ర ప్రభుత్వం గృహజ్యోతి పథకం కింద తెల్ల రేషన్కార్డు కలిగిన లబ్ధిదారులకు నెలకు 200 యూనిట్ల విద్యుత్తు ఉచితంగా సరఫరా చేసి శూన్య బిల్లులు అందజేస్తోంది. ఫిబ్రవరిలో ఈ పథకం ప్రారంభమైంది. -
వేసవి శిక్షణ.. లక్ష్యసాధన
[ 17-05-2024]
వేసవి సెలవులను వృథా చేయకుండా ఈ చిన్నారులు తమలోని అంతర్గత ప్రతిభకు పదును పెడుతున్నారు. వేసవి శిక్షణ తరగతుల్లో పాల్గొంటూ.. తమకు ఇష్టమైన రంగంలో సృజనాత్మకతతో రాణిస్తున్నారు. -
విభిన్న కోర్సుల ప్రత్యేకం
[ 17-05-2024]
ఆరు దశాబ్దాలుగా కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీకళాశాల ప్రత్యేకత చాటుతోంది. ఇక్కడ చదివిన వారు ఉన్నత రంగాల్లో స్థిరపడ్డారు. 158 ఎకరాల విశాలమైన స్థలంలో కళాశాల ఏర్పాటైంది. -
మొబైల్ ‘దోస్త్’తో సులభం
[ 17-05-2024]
రాష్ట్రంలోని ఏ విశ్వవిద్యాలయంలోనైనా డిగ్రీలో ప్రవేశం పొందడానికి ఇదివరకే ఆన్లైన్ విధానం అందుబాటులో ఉంది. ఈ ఏడాది నుంచి కొత్తగా మొబైల్లో దోస్త్ ఆప్లికేషన్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొనే అవకాశాన్ని విద్యాశాఖ కల్పించింది. -
సెర్చ్ కమిటీ ఏర్పాటు
[ 17-05-2024]
రాష్ట్రంలోని 10 యూనివర్సిటీలకు నూతన ఉపకులపతి(వీసీ)ల నియామకానికి సెర్చ్(అన్వేషణ) కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇందులో ముగ్గురు సభ్యులుంటారు. -
అక్రమ రిజిస్ట్రేషన్లపై విజిలెన్స్
[ 17-05-2024]
అనుమతి లేని లేఅవుట్లకు నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్లు చేయటాన్ని కట్టడి చేయటంపై రిజిస్ట్రేషన్ల శాఖ దృష్టి సారించింది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వారీగా రూపొందిన దస్తావేజుల ఆధారంగా విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. -
చరవాణి కోసం.. రైలు నుంచి దూకి
[ 17-05-2024]
ప్రాణం కంటే చరవాణి విలువైనది అనుకున్నాడేమో ఆ యువకుడు రైలులో ప్రయాణిస్తుండగా ఫోన్ కిందపడిపోవడంతో ఒక్కసారిగా దూకి తీవ్రగాయాలపాలయ్యాడు.
తాజా వార్తలు (Latest News)
-
‘వన్ చిప్ ఛాలెంజ్’ వల్లే బాలుడి మృతి.. ఇంతకీ ఏంటీ సవాల్?
-
వరల్డ్ కప్ జట్టులో హార్దిక్.. విమర్శలపై క్లారిటీ ఇచ్చిన జై షా
-
అటల్ సేతుపై రష్మిక వీడియో.. స్పందించిన మోదీ
-
అతడు నన్ను కాలితో తన్నాడు.. కడుపుపై కొట్టాడు: దాడి ఘటనపై స్వాతి మాలీవాల్
-
ఆ రూమర్స్కు చెక్ పెట్టిన నిర్మాణ సంస్థ.. ‘SSMB29’పై క్లారిటీ
-
నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,365