మరో ఇద్దరు
కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితా శుక్రవారం వెల్లడైంది. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి డాక్టర్ భూపతిరెడ్డి, ఎల్లారెడ్డిలో మదన్మోహన్రావు బరిలో దిగనున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు అయిదు స్థానాల్లో అభ్యర్థులు తేలగా..నిజామాబాద్ అర్బన్, కామారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాలను మరోసారి వాయిదా వేశారు.
ఈనాడు, నిజామాబాద్: కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితా శుక్రవారం వెల్లడైంది. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి డాక్టర్ భూపతిరెడ్డి, ఎల్లారెడ్డిలో మదన్మోహన్రావు బరిలో దిగనున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు అయిదు స్థానాల్లో అభ్యర్థులు తేలగా..నిజామాబాద్ అర్బన్, కామారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాలను మరోసారి వాయిదా వేశారు. కాగా నిజామాబాద్ ఎంపీగా రెండుసార్లు గెలిచిన మధుయాష్కి గౌడ్ హైదరాబాద్ ఎల్బీనగర్ , పోలీస్ కమిషనర్గా పనిచేసి మార్చిలో పదవీ విరమణ చేసిన కేఆర్ నాగరాజు వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గాల టికెట్లు దక్కించుకున్నారు.
- అయిదు ఓసీలకేే.. ఇప్పటి వరకు ప్రకటించిన అయిదు స్థానాల్లో ఓసీలకే అవకాశం దక్కింది. వీరిలో నలుగురు రెడ్లు, ఒకరు వెలమ సామాజికవర్గానికి చెందిన వారు ఉన్నారు. అర్బన్ నుంచి మైనార్టీ అభ్యర్థిని బరిలోకి దించే ఆలోచనతో ఉన్నట్లు రెండురోజులుగా ప్రచారం జరుగుతోంది. కాగా బీసీ సామాజికవర్గానికి ఏదో ఒకచోట సీటు కేటాయించి తీరాలనే డిమాండ్ పార్టీ నాయకుల నుంచి వినవస్తోంది. ఈ తరుణంలో అభ్యర్థుల ఎంపిక పూర్తవ్వని స్థానాల విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానం ఆలోచన ఏ విధంగా ఉండబోతుందనేది మూడో జాబితా వచ్చాకే తేలనుంది. మరోపక్క ఇటీవల భారాసను వీడిన మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత తాజాగా సొంతగూటికి చేరారు. ఆమె అర్బన్ టికెట్ ఆశిస్తున్నారు. బాన్సువాడ టికెట్ ఆశిస్తున్న ఏనుగు రవీందర్రెడ్డి కూడా కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు. మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావుతో సంప్రదింపులు జరిపినప్పటికీ.. ఆయన చేరిక, పోటీ చేసే విషయంలో ఇప్పటి వరకు స్పష్టత రాలేదు.
- అనేక మలుపులు.. కామారెడ్డిలో రేవంత్రెడ్డి, నిజామాబాద్ అర్బన్లో షబ్బీర్ అలీ బరిలోకి దిగే అవకాశం ఉందని ప్రచారం జరిగినప్పటికీ.. రెండో జాబితాలో స్పష్టత రాలేదు. నిజామాబాద్ రూరల్ టికెట్ ఆశించి..కొంతకాలం ప్రచారం చేసిన నగేష్రెడ్డికి నిరాశే ఎదురైంది. ఆశావహుల నడమ గట్టి పోటీ కొనసాగిన ఎల్లారెడ్డి స్థానాన్ని మదన్మోహన్రావుకు కేటాయించారు. సుభాష్రెడ్డి అసంతృప్తికి లోనయ్యారు. తన ఆలోచనలో మార్పు లేదని..పోటీలో ఉంటానని ఆయన చెబుతున్నారు.
అభ్యర్థుల బయోడేటా
- నియోజకవర్గం: నిజామాబాద్ రూరల్
- అభ్యర్థి: డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి
ఎముకల చికిత్స వైద్యుడిగా ఉంటూ తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. తెరాస వ్యవస్థాపక సభ్యుడిగా, ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా తొలినాళ్లలో పనిచేశారు. 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరి..టికెట్ ఆశించినప్పటికీ రాలేదు. కొంతకాలానికే తిరిగి తెరాసలోకి వచ్చేశారు. 2009-2014 వరకు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం తెరాస ఇన్ఛార్జిగా కొనసాగారు. 2016లో స్థానిక సంస్థల శాసనమండలి స్థానానికి తెరాస తరఫున బరిలోకి దిగి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గత ఎన్నికల సందర్భంలో తెరాసను వీడి, కాంగ్రెస్లో చేరారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి 60 వేల ఓట్లు సాధించి రెండోస్థానంలో నిలిచారు. ప్రస్తుతం కాంగ్రెస్ నియోజకవర్గం ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు.
- నియోజకవర్గం: ఎల్లారెడ్డి
- అభ్యర్థి: మదన్ మోహన్ రావు
ఎమ్మెస్సీ అగ్రికల్చర్ చదివి, సాఫ్ట్వేర్ కంపెనీలు నిర్వహిస్తున్నారు. 2014 లోక్సభ ఎన్నికల్లో తెదేపా తరఫున జహీరాబాద్ పార్లమెంటు స్థానానికి పోటీ చేసి మూడో స్థానంలో నిలిచారు. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుని 2019 ఎన్నికల్లో తిరిగి పోటీ చేయగా భారాస ఎంపీ బీబీ పాటిల్ చేతిలో ఆరువేల పై చిలుకు ఓట్ల తేడాతో ఓటమి చెందారు. నాటి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి కార్యదళంలో ముఖ్యుడిగా పనిచేశారు. ప్రస్తుతం పీసీసీ ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. మదన్ మోహన్ ఛారిటబుల్ ట్రస్టు ద్వారా కామారెడ్డి, ఎల్లారెడ్డిలోని నిరుద్యోగ యువతకు జాబ్మేళా, ప్రజలకు ఉచిత అంబులెన్స్ సౌకర్యం కల్పిస్తున్నారు. పట్టణ కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తాలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిత్యం ఉచిత భోజనం, కొవిడ్ సమయంలోనూ ప్రజలకు సేవలందించారు.
న్యూస్టుడే, ఎల్లారెడ్డి పట్టణం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దేశాభివృద్ధి చెందాలంటే భాజపాకి పట్టం కట్టాలి
[ 02-05-2024]
మండలంలోని రాఘవపల్లి గ్రామంలో మండల పార్టీ అధ్యక్షుడు సత్య బోయిన శ్రీకాంత్ ఆధ్వర్యంలో గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
మిగిలింది పది రోజులే..
[ 02-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రచార పర్వానికి ఇంకా పది రోజులే గడువుంది. ఈ నెల 13న పోలింగ్ జరగాల్సి ఉండగా.. రెండు రోజుల ముందుగా 11వ తేదీ సాయంత్రానికే ప్రచారానికి తెరపడనుంది. మూడు ప్రధాన పార్టీలు బహిరంగ సభలు, రోడ్ షోలతో హోరెత్తిస్తున్నాయి. -
కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్
[ 02-05-2024]
నిత్యం ప్రజల్లో ఉండే జీవన్రెడ్డిని ఎంపీగా గెలిపించాలని.. ఈ ప్రాంత అభివృద్ధికి అవసరమైన నిధులు వస్తాయని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. బుధవారం జగిత్యాల జిల్లా కోరుట్ల సమీపంలో నిర్వహించిన జనజాతర సభలో సీఎం ప్రసంగించారు. -
ఐదేళ్లలో పెరిగిన ఓటర్లు 2,19,784 మంది
[ 02-05-2024]
గడిచిన ఐదేళ్ల కాలంలో జిల్లా వ్యాప్తంగా ఓటర్లు పెరిగారు. ఓటు నమోదుకు అధికారులు చేస్తున్న ప్రచారానికి స్పందన కనిపిస్తోంది. ఆరు నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఏటా రెండు సార్లు ఓటు నమోదుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పిస్తోంది. -
మెజార్టీ పోటీ
[ 02-05-2024]
లోక్సభ నియోజకవర్గం పరిధి ఎక్కువగా ఉన్నందున ఇంటింటి ప్రచారం సాధ్యంకాని పరిస్థితి. దీంతో కాంగ్రెస్, భారాస, భాజపాలు అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జులపైనే తమ పార్టీ అభ్యర్థులకు మెజార్టీ తెచ్చే బాధ్యతను మోపాయి. -
మతం పేరుతో భావోద్వేగాలు రెచ్చగొడుతున్నారు: ఆచార్య కోదండరాం
[ 02-05-2024]
స్వలాభం కోసం కొందరు మతం పేరిట ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొడుతున్నారని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ఆచార్య కోదండరాం పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన ‘ప్రమాదంలో ప్రజాస్వామ్యం- బహిరంగ చర్చ’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. -
‘కాంగ్రెస్ వాగ్దానాలతో మోసపోయిన అన్నివర్గాలు’
[ 02-05-2024]
మోసపూరిత కాంగ్రెస్, భాజపాలను పార్లమెంటు ఎన్నికల్లో పాతర పెట్టాలని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. -
రక్తం కొరత.. రోగులకు వెత
[ 02-05-2024]
‘జిల్లాకేంద్రానికి చెందిన గర్భిణి భవానికి అత్యవసరంగా బి పాజిటివ్ రక్తం అవసరం కాగా.. ప్రభుత్వ ఆసుపత్రిలోని రక్తనిధి కేంద్రాన్ని సంప్రదించింది. అందులో ఆ రక్త విభాగానికి సంబంధించి ఒకే యూనిట్ నిల్వ ఉంది. -
తీరుతున్న వన్యప్రాణుల దాహార్తి
[ 02-05-2024]
కామారెడ్డి జిల్లాలో అటవీ శాఖ చేపట్టన అభివృద్ధి పనులు వన్యప్రాణుల దాహార్తి తీరుస్తున్నాయి. గతంలో వేసవి వచ్చిందంటే నీళ్ల కోసం జనంలోకి వచ్చే అటవీ జంతువులు.. ప్రస్తుతం అటవీ అధికారులు చేపట్టిన శాశ్వత తాగునీటి పథకాలతో వనంలోనే దాహం తీర్చుకుంటున్నాయి. -
సాహస దీపిక
[ 02-05-2024]
విద్యార్థులు కేవలం తరగతి గదికే పరిమితం కాకూడదని.. సాహస క్రీడల్లో పాల్గొంటే జాతీయస్థాయిలో సత్తాచాటవచ్చని నిరూపించారు గిరిరాజ్ కళాశాలకు చెందిన దీపిక. -
అవగాహనతోనే ప్రమాదాల నివారణ
[ 02-05-2024]
విద్యుత్తు ప్రమాదాల వల్ల ఏటా ఆస్తి, ప్రాణ నష్టాలు సంభవిస్తుంటాయి. అప్రమత్తతతోనే ఆపదలను నివారించవచ్చు అంటున్నారు అధికారులు. మే 1 నుంచి 7వ తేదీ వరకు విద్యుత్తు శాఖ ఆధ్వర్యంలో భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. -
జిజ్ఞాస ప్రాజెక్టులో ప్రతిభ
[ 02-05-2024]
హైదరాబాద్లో రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన ‘జిజ్ఞాస- స్టూడెంట్ స్టడీ ప్రాజెక్టు’లు అనే అంశంలో నగరంలోని గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల సిబ్బందితో పాటు విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చి రెండు, మూడు స్థానాలు కైవసం చేసుకున్నారని ప్రిన్సిపల్ రామ్మోహన్రెడ్డి తెలిపారు. -
ఎవరికి ఓటేశామో తెలుసుకోవచ్చు
[ 02-05-2024]
లోక్సభ ఎన్నికలు మే 13న జరగనున్నాయి. ఈవీఎంలో ఓటు వేసిన తర్వాత అభ్యర్థికి పడిందో లేదో వీవీప్యాట్ యంత్రంలో ఓటర్లు పరిశీలించవచ్చు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్(ఈవీఎం)లోని ఒక భాగమే ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్(వీవీప్యాట్). -
73 ఏళ్లుగా పోలింగ్ కేంద్రం
[ 02-05-2024]
అహింస, సత్యాగ్రహం ఆయుధంగా ఆంగ్లేయులను పారదోలిన మహాత్మా గాంధీ పేరుతో జిల్లా కేంద్రంలో వెలసిన బాపూజీ వచనాలయం పాఠకులకు విజ్ఞాన నేస్తంగా నిలుస్తోంది. ఈ పఠనాలయాన్ని 1951లో ఏర్పాటు చేశారు. -
అభ్యర్థుల తరఫున అన్నీ తామై..
[ 02-05-2024]
లోక్సభ ఎన్నికలకు గడువు సమీపిస్తోంది. ఇప్పటి వరకు ప్రధాన పార్టీల అభ్యర్థులు నియోజకవర్గ, మండల, జిల్లాస్థాయిలో కార్యకర్తల సమావేశాలు నిర్వహించారు. -
లోక్సభ బరిలో నాడు 186.. నేడు 29 మంది
[ 02-05-2024]
నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి 2019లో జరిగిన ఎన్నికల్లో ఏకంగా 186 మంది పోటీ చేయడంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రధాన పార్టీలు భాజపా, భారాస, కాంగ్రెస్, ఇతర గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు బరిలో నిలిచారు.
తాజా వార్తలు (Latest News)
-
లైంగిక దౌర్జన్యం కేసు.. ప్రజ్వల్ రేవణ్ణపై లుక్అవుట్ నోటీసు
-
హైదరాబాద్.. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తారా? 300 కొట్టేస్తారా?
-
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇకపై ఈవెంట్ ప్లాన్ చేయొచ్చు!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
నంబర్ 6 ర్యాంకర్కు నో ప్లేస్.. ఆ బాధను తట్టుకోవడం కష్టమే: ఇర్ఫాన్ పఠాన్
-
దిల్లీ ఎల్జీ కీలక నిర్ణయం.. మహిళా కమిషన్లో 223 మంది తొలగింపు