ఈతకెళ్తున్నారా.. జర జాగ్రత్త
ఇలా వేసవి వచ్చిందంటే చాలు యువత, తల్లిదండ్రులు చిన్నారులను తీసుకొని చెరువులు, కాల్వల్లో స్నానాలకు వెళ్తుంటారు. సరదాగా వేసవి తాపం తీర్చుకోవడానికి వెళ్లి వారి కుటుంబాలకు తీరని శోకం మిగులుస్తున్నారు. ఇలా సరదా విషాదం నింపిన ఘటనలు అనేకం ఉన్నాయి.
న్యూస్టుడే, నిజామాబాద్ నేరవిభాగం
నాగారంలోని ఓ ప్రైవేటు ఈత కొలనులో ఓ బాలుడు ఈత కొట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తు మృతిచెందాడు.
గతేడాది మెండోర దగ్గర కాకతీయ కెనాల్కు సరదాగా గడుపుదామని ముగ్గురు స్నేహితులు ఈతకు వెళ్లారు. వారిలో జిల్లా కేంద్రం గాయత్రినగర్కు చెందిన ఇద్దరు కెనాల్లో దిగేందుకు ప్రయత్నించగా కాలుజారి పడి మృతిచెందారు.
వేసవి వచ్చిందంటే చాలు ఆరో ఠాణా పరిధిలోని బాబన్సాబ్ దగ్గర నిజాం సాగర్ డీ 54 కెనాల్లో స్నానానికి వెళ్తుంటారు. గతేడాది ఇక్కడ ఇద్దరు చనిపోయారు.
2022 మే 2న సోన్ పుష్కరఘాట్లో స్నానానికి వెళ్లి ఒకరినొకరు పట్టుకునే ప్రయత్నంలో ఐదుగురు మృతి చెందారు.
ఇలా వేసవి వచ్చిందంటే చాలు యువత, తల్లిదండ్రులు చిన్నారులను తీసుకొని చెరువులు, కాల్వల్లో స్నానాలకు వెళ్తుంటారు. సరదాగా వేసవి తాపం తీర్చుకోవడానికి వెళ్లి వారి కుటుంబాలకు తీరని శోకం మిగులుస్తున్నారు. ఇలా సరదా విషాదం నింపిన ఘటనలు అనేకం ఉన్నాయి. ఈ వేసవిలో అయినా కనీస జాగ్రత్తలు పాటించి సరదా సమయాన్ని విషాదం కాకుండా చూసుకోవాలని నిపుణులు పేర్కొంటున్నారు. కనీస సూచనలు పాటిస్తే నీటి గండం నుంచి బయటపడొచ్చు.
- 15 ఏళ్లలోపు పిల్లలు చెరువులు, కుంటలు, వాగుల వద్దకు వెళ్లకుండా తల్లిదండ్రులు చూసుకోవాలి.
- తల్లిదండ్రులు తీసుకెళ్తే మోకాలు, నడుము లోతు వరకే దిగేలా చూడాలి.
- శిక్షకుడి పర్యవేక్షణలో ఈత నేర్పించాలి.
- పూర్తిగా తర్ఫీదు పొందితేనే ఈత కొలనులో దిగేందుకు అనుమతించాలి.
- యువత మద్యం, మత్తు పదార్థాలు తీసుకొని నీటిలోకి దిగవద్దు.
- చెరువులు, కాల్వల్లో అధిక లోతులోకి వెళ్తూ సాహసాలు చేయకూడదు.
- చెరువుల్లోకి దిగేముందు ఇసుక తవ్వకాలు జరిపితే కందకాలు ఉంటాయి. వాటిని గమనించాలి. తవ్వకాలు జరిపే వైపు స్నానానికి వెళ్లకూడదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంఘాల లోకోస్ డాటా ఎంట్రీ త్వరితగతిన పూర్తి చేయాలి..
[ 18-05-2024]
నాగిరెడ్డిపేట్ మండల సమాఖ్య కార్యాలయంలో వీవోఏలకు సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. -
ఘనంగా వాసవి మాత జయంతి ఉత్సవాలు
[ 18-05-2024]
నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో వాసవి మాత జయంతి ఉత్సవాలను ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. -
ఇక స్థానిక సమరమే..
[ 18-05-2024]
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సర్పంచి ఎన్నికలపై దృష్టి సారించింది. -
నియంత్రికల ధ్వంసం.. రైతన్నలకు నష్టం
[ 18-05-2024]
నందిపేట్ మండలంలో వారం రోజుల వ్యవధిలోనే తల్వేద, సి.హెచ్.కొండూర్ ఎత్తిపోతల పథకాల పంపుహౌస్ల నుంచి దుండగులు నియంత్రికలను ఎత్తుకెళ్లారు. -
వివాదాల వైద్యశాఖ
[ 18-05-2024]
కామారెడ్డి జిల్లా వైద్యశాఖ ఆది నుంచి వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది. వివిధ విభాగాల్లో అవినీతి ఆరోపణలు దుమారం రేపాయి. -
ఆలయాల్లో సౌరవిద్యుత్తు
[ 18-05-2024]
ఇటీవల రామారెడ్డి కాళభైరవస్వామి ఆలయంలో వైశాఖ మాస పూజలు పెద్దఎత్తున ప్రారంభించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. -
తగ్గిన గృహజ్యోతి లబ్ధిదారులు
[ 18-05-2024]
గృహావసరాల విద్యుత్తుకు డిమాండ్ పెరగడంతో గృహజ్యోతి పథకం లబ్ధిదారుల సంఖ్యలో తగ్గుదల కనిపించింది. -
‘అమ్మ ఆదర్శ’ంగా నిలిచేలా..
[ 18-05-2024]
కామారెడ్డి జిల్లాకేంద్రం శివారులోని టేక్రియాల్ ప్రభుత్వ ఉన్నత బడిలో విద్యార్థుల సౌకర్యార్థం మంచి నీటి వసతి కల్పనకు యంత్రాంగం చర్యలు చేపట్టింది. -
కౌంటింగ్ కేంద్రాల్లో మూడంచెల భద్రత
[ 18-05-2024]
కౌంటింగ్ కేంద్రాల్లో మూడంచెల భద్రత ఏర్పాటు చేశామని రాష్ట్ర అదనపు ఎన్నికల కమిషనర్ లోకేష్కుమార్ అన్నారు. -
వరదనీటికి దారేది?
[ 18-05-2024]
ఈ ఏడాది రుతు పవనాల రాక ముందుగానే ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
తాజా వార్తలు (Latest News)
-
కోనసీమ జిల్లాలో విషాదం.. ముగ్గురు యువకులు మృతి
-
కోడ్పై ఈసీకి ‘విజిల్’ వేశారు.. 2 నెలల్లో 4.24 లక్షల ఫిర్యాదులు
-
టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో దాయాదుల పోరు చూడాలనుంది: కైఫ్
-
జగన్ విధానాలపై ప్రశ్నిస్తే.. వేధిస్తారా?: ఎన్ఆర్ఐ వైద్యుడు లోకేశ్
-
హైదరాబాద్లో భారీ వర్షం.. వనస్థలిపురం వద్ద భారీగా వరదనీరు
-
దేవాలయాల్లో లైబ్రరీలు..ఆసక్తికర సూచన చేసిన ఇస్రో ఛైర్మన్