సెప్టెంబరులో చక్కెర కర్మాగారాలు తెరిపిస్తాం
శాసనసభ ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీ మేరకు నిజాం చక్కెర కర్మాగారాలు తెరిపించేందుకు అవసరమైన చర్యలు చేపట్టినట్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు.
రైతు బిడ్డ జీవన్రెడ్డిని పార్లమెంటుకు పంపండి
ఇందూరు సభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి
అభివాదం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి
ఈనాడు, నిజామాబాద్, న్యూస్టుడే, నిజామాబాద్ అర్బన్: శాసనసభ ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీ మేరకు నిజాం చక్కెర కర్మాగారాలు తెరిపించేందుకు అవసరమైన చర్యలు చేపట్టినట్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. నిజామాబాద్ డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన జనజాతర సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. చక్కెర కర్మాగారాలు తెరిపించే విషయంలో విధివిధానాలు ఖరారు చేసేందుకు పరిశ్రమల మంత్రి శ్రీధర్బాబు అధ్యక్షతన..జీవన్రెడ్డితో కలిపి కమిటీ వేసిన విషయం ప్రస్తావించారు. మూసి ఉన్న చక్కెర కర్మాగారం తలుపులు సెప్టెంబరు కల్లా తెరిపించే బాధ్యత తనదే అన్నారు. ఆరు గ్యారంటీల్లో నాలుగు అమలు చేశామని..మరికొన్ని అమలు చేసేలోపే ఎన్నికల కోడ్ వచ్చేసిందన్నారు. జీవన్రెడ్డిని గెలిపిస్తే ఇండియా కూటమిలో వ్యవసాయశాఖ మంత్రిగా ఆయనే పసుపు బోర్డు ఏర్పాటు చేస్తారన్నారు. వడ్లు కొనడం లేదని ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని.. ఎంత పండించినా కొనటంతో పాటు వచ్చే సీజన్ నుంచి రూ.500 బోనస్ ఇస్తామన్నారు.
వేదికపై సీఎం రేవంత్రెడ్డి, చిత్రంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్రెడ్డి, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, ఎమ్మెల్యేలు సుదర్శన్రెడ్డి, భూపతిరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్కుమార్, ఎమ్మెల్సీ మహేశ్కుమార్ గౌడ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్ తదితరులు
కవితను మించి అర్వింద్ను ఓడించండి..
వంద రోజుల్లో చక్కెర పరిశ్రమ తెరిపిస్తానని, పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానని విఫలమైన కేసీఆర్ కూతుర్ని ఇక్కడి రైతులు ఓడించారన్నారు. ఆ దెబ్బతో కోలుకోలేని స్థితిలో కవిత..ఎన్నికల్లో పోటీ చేయటానికే భయపడినట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత గెలిచిన భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్ ఐదు రోజుల్లో పసుపు బోర్డు తెస్తానంటూ బాండ్ పేపర్ రాసిచ్చి మోసగించారన్నారు. వంద రోజుల మోసానికే ఆ తీరున బుద్ధి చెప్పిన ఇక్కడి రైతులు.. కేవలం అయిదు రోజులు అంటూ మోసగించిన అర్వింద్ను అంతకు మించి ఓడించాలని కోరారు. సుగంధ ద్రవ్యాల బోర్డునే పసుపు బోర్డుగా నమ్మించి బుకాయించే ప్రయత్నం చేశారన్నారు. తాతకు దగ్గు నేర్పినట్లు.. రైతుల దగ్గర అబద్ధం అడితే తెలుసుకోలేరనుకోవడం అవివేకం అన్నారు. వ్యవసాయం తెలియని అర్వింద్ను గెలిపించుకుంటే.. పల్లికాయలు ఏడ కాస్తాయంటే చెట్టుపైన అంటాడంటూ ఎద్దేవా చేశారు. రైతు కష్టాలపై అవగాహన లేని అర్వింద్ కంటే.. స్వయాన రైతు జీవన్రెడ్డిని గెలిపిస్తే మీలో ఒకడిగా ఉండిపోతారన్నారు.
నిజామాబాద్పై ప్రత్యేక అభిమానం
ఆర్మూర్లో 2021లో నిర్వహించిన పసుపు రైతుల దీక్షతో అధిష్ఠానం వద్ద గుర్తింపు లభించి పీసీసీ పగ్గాలు అప్పగించిందన్నారు. తనకు అండగా నిలిచిన ఈ ప్రాంతమన్నా, ఇక్కడి రైతులన్నా తనకు ప్రత్యేక అభిమానమని చెప్పారు. దశరథి ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ జైలు గోడలపై రాసి ఈ జిల్లా ఖ్యాతిని ఇనుపడింపజేశారన్నారు. బాక్సింగ్లో నిఖత్ జరీన్, పర్వతారోహణతో మలావత్ పూర్ణ, పలువురు రాజకీయ నాయకులు జిల్లా కీర్తిని చాటారన్నారు. ప్రజాజీవితంలో విశేష అనుభవం కలిగిన జీవన్రెడ్డిని ఎంపీగా పంపితే జిల్లా పేరును నిలబెడతారన్నారు. జీవన్రెడ్డికి వేసే ఓటు తనకు వేసినట్లే అని.. ఆయన గెలుపునకు రైతులు, యువత కృషి చేయాలని పిలుపునిచ్చారు.
పెట్టుబడి వర్గాలకు.. రైతులకు మధ్య ఎన్నికలు
అన్నివర్గాలకు సమన్యాయం, సంక్షేమం అందించటం కాంగ్రెస్తోనే సాధ్యమని ఆ పార్టీ లోక్సభ అభ్యర్థి తాటిపర్తి జీవన్రెడ్డి అన్నారు. ప్రత్యర్థి పార్టీలు గడిచిన పదేళ్లలో రైతు సమస్యలు విస్మరించాయని పేర్కొన్నారు. పసుపు బోర్డు కోసం బాండ్ పేపర్ రాసిచ్చి అయిదేళ్లు కాలయాపన చేసిన అర్వింద్.. ఇప్పుడు మళ్లీ అవకాశం ఇవ్వాలని అడగటం విడ్డూరంగా ఉందన్నారు. మోదీ అక్టోబరు 4న బోర్డు ఎక్కడ ఏర్పాటు చేస్తాం..ఎప్పుడు ఏర్పాటు చేస్తామనే వివరాలు లేకుండా రాసివ్వటమంటే మళ్లీ మోసం చేయటమే అన్నారు. నాడు కష్టాల్లో ఉన్న కాంగ్రెస్ను వైఎస్సార్ అధికారంలోకి తెచ్చారని..నేడు రేవంత్రెడ్డి తెచ్చారని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్కుమార్ గౌడ్ పేర్కొన్నారు. నిజామాబాద్ స్థానంలో కాంగ్రెస్ను గెలిపించి ముఖ్యమంత్రికి అండగా నిలవాలని కోరారు. అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లో 31 వేల ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. మైనార్టీలు అత్యధికంగా ఉన్న ఈ ప్రాంతంలో ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. రాహుల్ గాంధీని ప్రధాని చేసేందుకు మనమంతా పనిచేయాలని, రాష్ట్రంలో 14 సీట్లు గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాస్కీ తెలిపారు. భాజపా నల్ల చట్టాలు తెచ్చింది, ఆ పార్టీ రైతు వ్యతిరేకి అని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి ఆరోపించారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రతి పంటకు మద్దతు ధర ఇస్తామన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన బాజిరెడ్డి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు, ఆయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేమీ లేదని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి విమర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస అభ్యర్థిని గెలిపించాలి
[ 02-05-2024]
లోక్సభ ఎన్నికల్లో భారాస పార్టీ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి అనిల్కుమార్ను భారీ మెజారిటీతో గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే సురేందర్ కోరారు. -
నీటి నమూనాల సేకరణ
[ 02-05-2024]
మండలంలోని కామారెడ్డి మద్దికుంట, ఇతన్నపల్లి గ్రామాలలో నీటి నమూనాలను జిల్లా భూగర్భజల శాఖ అధికారి సతీశ్ యాదవ్ సేకరించారు. -
తలసేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరం
[ 02-05-2024]
కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఈ నెల 5న మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయనున్నారు. -
అక్రమంగా తరలిస్తున్న టేక్ దుంగలు పట్టివేత
[ 02-05-2024]
అక్రమంగా తరలిస్తున్న టేకు దుంగలను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. -
కాంగ్రెస్ తోనే అన్ని వర్గాల సంక్షేమం
[ 02-05-2024]
కాంగ్రెస్ గెలుపుతోనే అన్ని వర్గాల సంక్షేమం సాధ్యమని పురపాలక ఛైర్మన్ సత్యనారాయణ అన్నారు. -
ఎయిర్టెల్ టవర్కు నిప్పు
[ 02-05-2024]
మండల కేంద్రంలో గల ప్రముఖ సెల్ కంపెనీ ఎయిర్టెల్కు చెందిన టవర్కు గురువారం నిప్పుఅంటుకుంది. -
కాంగ్రెస్ శ్రేణుల ఎన్నికల ప్రచారం
[ 02-05-2024]
పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యే మదన్మోహన్ ఆదేశాల మేరకు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రచారం నిర్వహించారు. -
భాజపా గెలుపే లక్ష్యం
[ 02-05-2024]
దేశం మూడో ఆర్థిక వ్యవస్థగా ఎదగాలంటే ప్రధాని మోదీతోనే సాధ్యం అని భాజపా మండల ప్రధాన కార్యదర్శి నరేష్ అన్నారు. -
నల్ల పోచమ్మకు ప్రత్యేక పూజలు
[ 02-05-2024]
మండల కేంద్రంలో నల్ల పోచమ్మ గుడికి వెళ్లి ఎమ్మెల్యే మదన్మోహన్ ఆదేశాల మేరకు జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సురేష్ షెట్కర్ను భారీ మెజార్టీతో గెలిపించాలని మండల కాంగ్రెస్ నాయకులు ప్రత్యేక పూజలు చేశారు. -
దేశాభివృద్ధి చెందాలంటే భాజపాకి పట్టం కట్టాలి
[ 02-05-2024]
మండలంలోని రాఘవపల్లి గ్రామంలో మండల పార్టీ అధ్యక్షుడు సత్య బోయిన శ్రీకాంత్ ఆధ్వర్యంలో గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
మిగిలింది పది రోజులే..
[ 02-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రచార పర్వానికి ఇంకా పది రోజులే గడువుంది. ఈ నెల 13న పోలింగ్ జరగాల్సి ఉండగా.. రెండు రోజుల ముందుగా 11వ తేదీ సాయంత్రానికే ప్రచారానికి తెరపడనుంది. మూడు ప్రధాన పార్టీలు బహిరంగ సభలు, రోడ్ షోలతో హోరెత్తిస్తున్నాయి. -
కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్
[ 02-05-2024]
నిత్యం ప్రజల్లో ఉండే జీవన్రెడ్డిని ఎంపీగా గెలిపించాలని.. ఈ ప్రాంత అభివృద్ధికి అవసరమైన నిధులు వస్తాయని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. బుధవారం జగిత్యాల జిల్లా కోరుట్ల సమీపంలో నిర్వహించిన జనజాతర సభలో సీఎం ప్రసంగించారు. -
ఐదేళ్లలో పెరిగిన ఓటర్లు 2,19,784 మంది
[ 02-05-2024]
గడిచిన ఐదేళ్ల కాలంలో జిల్లా వ్యాప్తంగా ఓటర్లు పెరిగారు. ఓటు నమోదుకు అధికారులు చేస్తున్న ప్రచారానికి స్పందన కనిపిస్తోంది. ఆరు నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఏటా రెండు సార్లు ఓటు నమోదుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పిస్తోంది. -
మెజార్టీ పోటీ
[ 02-05-2024]
లోక్సభ నియోజకవర్గం పరిధి ఎక్కువగా ఉన్నందున ఇంటింటి ప్రచారం సాధ్యంకాని పరిస్థితి. దీంతో కాంగ్రెస్, భారాస, భాజపాలు అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జులపైనే తమ పార్టీ అభ్యర్థులకు మెజార్టీ తెచ్చే బాధ్యతను మోపాయి. -
మతం పేరుతో భావోద్వేగాలు రెచ్చగొడుతున్నారు: ఆచార్య కోదండరాం
[ 02-05-2024]
స్వలాభం కోసం కొందరు మతం పేరిట ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొడుతున్నారని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ఆచార్య కోదండరాం పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన ‘ప్రమాదంలో ప్రజాస్వామ్యం- బహిరంగ చర్చ’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. -
‘కాంగ్రెస్ వాగ్దానాలతో మోసపోయిన అన్నివర్గాలు’
[ 02-05-2024]
మోసపూరిత కాంగ్రెస్, భాజపాలను పార్లమెంటు ఎన్నికల్లో పాతర పెట్టాలని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. -
రక్తం కొరత.. రోగులకు వెత
[ 02-05-2024]
‘జిల్లాకేంద్రానికి చెందిన గర్భిణి భవానికి అత్యవసరంగా బి పాజిటివ్ రక్తం అవసరం కాగా.. ప్రభుత్వ ఆసుపత్రిలోని రక్తనిధి కేంద్రాన్ని సంప్రదించింది. అందులో ఆ రక్త విభాగానికి సంబంధించి ఒకే యూనిట్ నిల్వ ఉంది. -
తీరుతున్న వన్యప్రాణుల దాహార్తి
[ 02-05-2024]
కామారెడ్డి జిల్లాలో అటవీ శాఖ చేపట్టన అభివృద్ధి పనులు వన్యప్రాణుల దాహార్తి తీరుస్తున్నాయి. గతంలో వేసవి వచ్చిందంటే నీళ్ల కోసం జనంలోకి వచ్చే అటవీ జంతువులు.. ప్రస్తుతం అటవీ అధికారులు చేపట్టిన శాశ్వత తాగునీటి పథకాలతో వనంలోనే దాహం తీర్చుకుంటున్నాయి. -
సాహస దీపిక
[ 02-05-2024]
విద్యార్థులు కేవలం తరగతి గదికే పరిమితం కాకూడదని.. సాహస క్రీడల్లో పాల్గొంటే జాతీయస్థాయిలో సత్తాచాటవచ్చని నిరూపించారు గిరిరాజ్ కళాశాలకు చెందిన దీపిక. -
అవగాహనతోనే ప్రమాదాల నివారణ
[ 02-05-2024]
విద్యుత్తు ప్రమాదాల వల్ల ఏటా ఆస్తి, ప్రాణ నష్టాలు సంభవిస్తుంటాయి. అప్రమత్తతతోనే ఆపదలను నివారించవచ్చు అంటున్నారు అధికారులు. మే 1 నుంచి 7వ తేదీ వరకు విద్యుత్తు శాఖ ఆధ్వర్యంలో భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. -
జిజ్ఞాస ప్రాజెక్టులో ప్రతిభ
[ 02-05-2024]
హైదరాబాద్లో రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన ‘జిజ్ఞాస- స్టూడెంట్ స్టడీ ప్రాజెక్టు’లు అనే అంశంలో నగరంలోని గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల సిబ్బందితో పాటు విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చి రెండు, మూడు స్థానాలు కైవసం చేసుకున్నారని ప్రిన్సిపల్ రామ్మోహన్రెడ్డి తెలిపారు. -
ఎవరికి ఓటేశామో తెలుసుకోవచ్చు
[ 02-05-2024]
లోక్సభ ఎన్నికలు మే 13న జరగనున్నాయి. ఈవీఎంలో ఓటు వేసిన తర్వాత అభ్యర్థికి పడిందో లేదో వీవీప్యాట్ యంత్రంలో ఓటర్లు పరిశీలించవచ్చు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్(ఈవీఎం)లోని ఒక భాగమే ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్(వీవీప్యాట్). -
73 ఏళ్లుగా పోలింగ్ కేంద్రం
[ 02-05-2024]
అహింస, సత్యాగ్రహం ఆయుధంగా ఆంగ్లేయులను పారదోలిన మహాత్మా గాంధీ పేరుతో జిల్లా కేంద్రంలో వెలసిన బాపూజీ వచనాలయం పాఠకులకు విజ్ఞాన నేస్తంగా నిలుస్తోంది. ఈ పఠనాలయాన్ని 1951లో ఏర్పాటు చేశారు. -
అభ్యర్థుల తరఫున అన్నీ తామై..
[ 02-05-2024]
లోక్సభ ఎన్నికలకు గడువు సమీపిస్తోంది. ఇప్పటి వరకు ప్రధాన పార్టీల అభ్యర్థులు నియోజకవర్గ, మండల, జిల్లాస్థాయిలో కార్యకర్తల సమావేశాలు నిర్వహించారు. -
లోక్సభ బరిలో నాడు 186.. నేడు 29 మంది
[ 02-05-2024]
నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి 2019లో జరిగిన ఎన్నికల్లో ఏకంగా 186 మంది పోటీ చేయడంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రధాన పార్టీలు భాజపా, భారాస, కాంగ్రెస్, ఇతర గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు బరిలో నిలిచారు.
తాజా వార్తలు (Latest News)
-
బ్యాంకు ఖాతాల్లో పింఛన్ జమకాని వారికి.. మే 4న ఇస్తాం: శశి భూషణ్
-
97.76% రూ.2వేల నోట్లు వెనక్కి: ఆర్బీఐ
-
అభిమాని బర్త్డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!
-
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా