పోరు.. ఇక హోరు
జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో ప్రధాన పార్టీల అగ్రనేతల ప్రచారానికి రంగం సిద్ధమైంది. కాంగ్రెస్, భారాస, భాజపాలు ఇప్పటికే నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మండల, నియోజకవర్గ స్థాయి సమావేశాలు నిర్వహించి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశాయి
అగ్రనేతల ప్రచారంతో వేడెక్కనున్న రాజకీయం
ఈనాడు, కామారెడ్డి: జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో ప్రధాన పార్టీల అగ్రనేతల ప్రచారానికి రంగం సిద్ధమైంది. కాంగ్రెస్, భారాస, భాజపాలు ఇప్పటికే నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మండల, నియోజకవర్గ స్థాయి సమావేశాలు నిర్వహించి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశాయి. ఇప్పటికే భారాస, భాజపాల అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేశారు. ఈ నెల 24న కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ సమర్పించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ నెల 25వ తేదీతో నామినేషన్ల ఘట్టం ముగియనుంది. పోలింగ్కు గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రచారాన్ని హోరెత్తించేందుకు మూడు పార్టీల అభ్యర్థులు ఆయా పార్టీల అగ్రనేతలను ఆహ్వానిస్తున్నారు.
25న బాన్సువాడకు అమిత్షా
కేంద్ర హోంమంత్రి, భాజపా అగ్రనేత అమిత్షా ఈ నెల 25న బాన్సువాడలో నిర్వహించే బహిరంగ సభకు హాజరుకానున్నారు. జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో పాగా వేయాలనే సంకల్పంతో ఉన్న భాజపా ప్రచారాన్ని హోరెత్తించేందుకు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసింది. ఉత్తర్ప్రదేశ్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రులను సైతం పలు సభల్లో పాల్గొనాలని కోరింది. కామారెడ్డి జిల్లాకేంద్రంలో ప్రధాని మోదీ సభ నిర్వహించేందుకు నాయకులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో జాతీయ నాయకుల పర్యటనలు ఉండేలా చూసుకుంటోంది.
సీఎంతో కాంగ్రెస్ సభలు
అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఊపుమీద ఉన్న కాంగ్రెస్ లోకసభస్థానాన్ని కైవసం చేసుకునేందుకు కసరత్తు చేస్తోంది. 26న జహీరాబాద్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో సభలు నిర్వహించనున్నారు. కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో సైతం సభలు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే విధంగా మంత్రులు దామోదర రాజనర్సింహ, భట్టి విక్రమార్కలతో పాటు ఇతర నేతల సభలు నిర్వహించాలని నిర్ణయించారు. ఒకటి రెండు రోజుల్లో ముఖ్యమంత్రి పాల్గొనే సభల షెడ్యూల్ ఖరారు కానుంది.
మే 7న కామారెడ్డిలో కేసీఆర్ రోడ్ షో
2014, 2019 లోక్సభ ఎన్నికల్లో జహీరాబాద్ నియోజకవర్గంలో విజయం సాధించిన భారాస ఈసారి కూడా గెలుపొందాలనే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి చెందినప్పటికీ సామాజికవర్గాల వారీగా ప్రజలను కలుస్తూ భారాసను గెలిపించాల్సిన ఆవశ్యకతను నాయకులు వివరిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు హామీల అమలులో వైఫల్యాలపై ప్రచారం చేస్తున్నారు. వచ్చే నెల 7న కామారెడ్డిలో అధినేత కేసీఆర్ రోడ్షోను ఏర్పాటు చేశారు. ఇదే విధంగా ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాలతో పాటు అందోల్, నారాయణఖేడ్, జహీరాబాద్లలో భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సభలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. మాజీ మంత్రి హరీశ్రావు సైతం సుడిగాలి పర్యటనలు చేయనున్నట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస అభ్యర్థిని గెలిపించాలి
[ 02-05-2024]
లోక్సభ ఎన్నికల్లో భారాస పార్టీ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి అనిల్కుమార్ను భారీ మెజారిటీతో గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే సురేందర్ కోరారు. -
నీటి నమూనాల సేకరణ
[ 02-05-2024]
మండలంలోని కామారెడ్డి మద్దికుంట, ఇతన్నపల్లి గ్రామాలలో నీటి నమూనాలను జిల్లా భూగర్భజల శాఖ అధికారి సతీశ్ యాదవ్ సేకరించారు. -
తలసేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరం
[ 02-05-2024]
కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఈ నెల 5న మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయనున్నారు. -
అక్రమంగా తరలిస్తున్న టేక్ దుంగలు పట్టివేత
[ 02-05-2024]
అక్రమంగా తరలిస్తున్న టేకు దుంగలను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. -
కాంగ్రెస్ తోనే అన్ని వర్గాల సంక్షేమం
[ 02-05-2024]
కాంగ్రెస్ గెలుపుతోనే అన్ని వర్గాల సంక్షేమం సాధ్యమని పురపాలక ఛైర్మన్ సత్యనారాయణ అన్నారు. -
ఎయిర్టెల్ టవర్కు నిప్పు
[ 02-05-2024]
మండల కేంద్రంలో గల ప్రముఖ సెల్ కంపెనీ ఎయిర్టెల్కు చెందిన టవర్కు గురువారం నిప్పుఅంటుకుంది. -
కాంగ్రెస్ శ్రేణుల ఎన్నికల ప్రచారం
[ 02-05-2024]
పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యే మదన్మోహన్ ఆదేశాల మేరకు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రచారం నిర్వహించారు. -
భాజపా గెలుపే లక్ష్యం
[ 02-05-2024]
దేశం మూడో ఆర్థిక వ్యవస్థగా ఎదగాలంటే ప్రధాని మోదీతోనే సాధ్యం అని భాజపా మండల ప్రధాన కార్యదర్శి నరేష్ అన్నారు. -
నల్ల పోచమ్మకు ప్రత్యేక పూజలు
[ 02-05-2024]
మండల కేంద్రంలో నల్ల పోచమ్మ గుడికి వెళ్లి ఎమ్మెల్యే మదన్మోహన్ ఆదేశాల మేరకు జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సురేష్ షెట్కర్ను భారీ మెజార్టీతో గెలిపించాలని మండల కాంగ్రెస్ నాయకులు ప్రత్యేక పూజలు చేశారు. -
దేశాభివృద్ధి చెందాలంటే భాజపాకి పట్టం కట్టాలి
[ 02-05-2024]
మండలంలోని రాఘవపల్లి గ్రామంలో మండల పార్టీ అధ్యక్షుడు సత్య బోయిన శ్రీకాంత్ ఆధ్వర్యంలో గురువారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
మిగిలింది పది రోజులే..
[ 02-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రచార పర్వానికి ఇంకా పది రోజులే గడువుంది. ఈ నెల 13న పోలింగ్ జరగాల్సి ఉండగా.. రెండు రోజుల ముందుగా 11వ తేదీ సాయంత్రానికే ప్రచారానికి తెరపడనుంది. మూడు ప్రధాన పార్టీలు బహిరంగ సభలు, రోడ్ షోలతో హోరెత్తిస్తున్నాయి. -
కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్
[ 02-05-2024]
నిత్యం ప్రజల్లో ఉండే జీవన్రెడ్డిని ఎంపీగా గెలిపించాలని.. ఈ ప్రాంత అభివృద్ధికి అవసరమైన నిధులు వస్తాయని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. బుధవారం జగిత్యాల జిల్లా కోరుట్ల సమీపంలో నిర్వహించిన జనజాతర సభలో సీఎం ప్రసంగించారు. -
ఐదేళ్లలో పెరిగిన ఓటర్లు 2,19,784 మంది
[ 02-05-2024]
గడిచిన ఐదేళ్ల కాలంలో జిల్లా వ్యాప్తంగా ఓటర్లు పెరిగారు. ఓటు నమోదుకు అధికారులు చేస్తున్న ప్రచారానికి స్పందన కనిపిస్తోంది. ఆరు నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఏటా రెండు సార్లు ఓటు నమోదుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పిస్తోంది. -
మెజార్టీ పోటీ
[ 02-05-2024]
లోక్సభ నియోజకవర్గం పరిధి ఎక్కువగా ఉన్నందున ఇంటింటి ప్రచారం సాధ్యంకాని పరిస్థితి. దీంతో కాంగ్రెస్, భారాస, భాజపాలు అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జులపైనే తమ పార్టీ అభ్యర్థులకు మెజార్టీ తెచ్చే బాధ్యతను మోపాయి. -
మతం పేరుతో భావోద్వేగాలు రెచ్చగొడుతున్నారు: ఆచార్య కోదండరాం
[ 02-05-2024]
స్వలాభం కోసం కొందరు మతం పేరిట ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొడుతున్నారని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ఆచార్య కోదండరాం పేర్కొన్నారు. జిల్లాకేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన ‘ప్రమాదంలో ప్రజాస్వామ్యం- బహిరంగ చర్చ’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. -
‘కాంగ్రెస్ వాగ్దానాలతో మోసపోయిన అన్నివర్గాలు’
[ 02-05-2024]
మోసపూరిత కాంగ్రెస్, భాజపాలను పార్లమెంటు ఎన్నికల్లో పాతర పెట్టాలని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి అన్నారు. -
రక్తం కొరత.. రోగులకు వెత
[ 02-05-2024]
‘జిల్లాకేంద్రానికి చెందిన గర్భిణి భవానికి అత్యవసరంగా బి పాజిటివ్ రక్తం అవసరం కాగా.. ప్రభుత్వ ఆసుపత్రిలోని రక్తనిధి కేంద్రాన్ని సంప్రదించింది. అందులో ఆ రక్త విభాగానికి సంబంధించి ఒకే యూనిట్ నిల్వ ఉంది. -
తీరుతున్న వన్యప్రాణుల దాహార్తి
[ 02-05-2024]
కామారెడ్డి జిల్లాలో అటవీ శాఖ చేపట్టన అభివృద్ధి పనులు వన్యప్రాణుల దాహార్తి తీరుస్తున్నాయి. గతంలో వేసవి వచ్చిందంటే నీళ్ల కోసం జనంలోకి వచ్చే అటవీ జంతువులు.. ప్రస్తుతం అటవీ అధికారులు చేపట్టిన శాశ్వత తాగునీటి పథకాలతో వనంలోనే దాహం తీర్చుకుంటున్నాయి. -
సాహస దీపిక
[ 02-05-2024]
విద్యార్థులు కేవలం తరగతి గదికే పరిమితం కాకూడదని.. సాహస క్రీడల్లో పాల్గొంటే జాతీయస్థాయిలో సత్తాచాటవచ్చని నిరూపించారు గిరిరాజ్ కళాశాలకు చెందిన దీపిక. -
అవగాహనతోనే ప్రమాదాల నివారణ
[ 02-05-2024]
విద్యుత్తు ప్రమాదాల వల్ల ఏటా ఆస్తి, ప్రాణ నష్టాలు సంభవిస్తుంటాయి. అప్రమత్తతతోనే ఆపదలను నివారించవచ్చు అంటున్నారు అధికారులు. మే 1 నుంచి 7వ తేదీ వరకు విద్యుత్తు శాఖ ఆధ్వర్యంలో భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. -
జిజ్ఞాస ప్రాజెక్టులో ప్రతిభ
[ 02-05-2024]
హైదరాబాద్లో రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన ‘జిజ్ఞాస- స్టూడెంట్ స్టడీ ప్రాజెక్టు’లు అనే అంశంలో నగరంలోని గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల సిబ్బందితో పాటు విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చి రెండు, మూడు స్థానాలు కైవసం చేసుకున్నారని ప్రిన్సిపల్ రామ్మోహన్రెడ్డి తెలిపారు. -
ఎవరికి ఓటేశామో తెలుసుకోవచ్చు
[ 02-05-2024]
లోక్సభ ఎన్నికలు మే 13న జరగనున్నాయి. ఈవీఎంలో ఓటు వేసిన తర్వాత అభ్యర్థికి పడిందో లేదో వీవీప్యాట్ యంత్రంలో ఓటర్లు పరిశీలించవచ్చు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్(ఈవీఎం)లోని ఒక భాగమే ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్(వీవీప్యాట్). -
73 ఏళ్లుగా పోలింగ్ కేంద్రం
[ 02-05-2024]
అహింస, సత్యాగ్రహం ఆయుధంగా ఆంగ్లేయులను పారదోలిన మహాత్మా గాంధీ పేరుతో జిల్లా కేంద్రంలో వెలసిన బాపూజీ వచనాలయం పాఠకులకు విజ్ఞాన నేస్తంగా నిలుస్తోంది. ఈ పఠనాలయాన్ని 1951లో ఏర్పాటు చేశారు. -
అభ్యర్థుల తరఫున అన్నీ తామై..
[ 02-05-2024]
లోక్సభ ఎన్నికలకు గడువు సమీపిస్తోంది. ఇప్పటి వరకు ప్రధాన పార్టీల అభ్యర్థులు నియోజకవర్గ, మండల, జిల్లాస్థాయిలో కార్యకర్తల సమావేశాలు నిర్వహించారు. -
లోక్సభ బరిలో నాడు 186.. నేడు 29 మంది
[ 02-05-2024]
నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి 2019లో జరిగిన ఎన్నికల్లో ఏకంగా 186 మంది పోటీ చేయడంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రధాన పార్టీలు భాజపా, భారాస, కాంగ్రెస్, ఇతర గుర్తింపు పొందిన పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్రులు బరిలో నిలిచారు.
తాజా వార్తలు (Latest News)
-
97.76% రూ.2వేల నోట్లు వెనక్కి: ఆర్బీఐ
-
అభిమాని బర్త్డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!
-
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
-
8న ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ.. ధరల శ్రేణి ఇదే..