ఆదిలోనే ఆశాభంగం
నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ను నమ్ముకొని వచ్చే ఆమ్చూర్ రైతులకు ఈ సారి ఆశాభంగం తప్పడం లేదు. గతేడాది ఊరించిన ధరలు ఈసారి అడియాసలయ్యాయి. ఇప్పుడిప్పుడే పంట యార్డుకు వస్తోంది. క్వింటా ధర సగటున రూ.20 వేలకు చేరుకోవడం లేదు.
ఆమ్చూర్ ధర గతేడాది కంటే దిగదుడుపే
న్యూస్టుడే, నిజామాబాద్ వ్యవసాయం
నిజామాబాద్ యార్డులో ఆమ్చూర్
నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ను నమ్ముకొని వచ్చే ఆమ్చూర్ రైతులకు ఈ సారి ఆశాభంగం తప్పడం లేదు. గతేడాది ఊరించిన ధరలు ఈసారి అడియాసలయ్యాయి. ఇప్పుడిప్పుడే పంట యార్డుకు వస్తోంది. క్వింటా ధర సగటున రూ.20 వేలకు చేరుకోవడం లేదు. గతేడాది నమూనా ధర రూ. 25 వేలకు పైగా కొనసాగింది. గరిష్ఠ ధరలు రూ.39 వేల వరకు వెళ్లాయి. పరిస్థితిని సాగుదారులు జీర్ణించుకోలేకపోతున్నారు.
దిగుబడి పెరగడమే కారణం
మామిడి కాయను ఒలిచి పీచుగా మార్చి ఆమ్చూర్ తయారుచేస్తారు. దక్షిణ భారతంలో వంటల్లో చింతపండు ఎలా వాడతారో ఉత్తరాదిన ఈ ఆమ్చూర్ను వినియోగిస్తారు. గల్ఫ్, యూరప్ దేశాలకు దీన్ని ఎగుమతి చేస్తారు. పంట క్రయవిక్రయాలకు హైదరాబాద్తో పాటు అక్కడక్కడ మార్కెట్లు ఉన్నప్పటికీ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పండిన పంట ఎక్కువగా ఇక్కడికే తెచ్చి అమ్ముతారు. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్లోని వ్యాపారులు దీని ఎగుమతుల్లో అనుభవం ఉండటంతో ఇతర మార్కెట్లతో పోల్చుకుంటే గిట్టుబాటు ధర దక్కుతుందనే ఆశతో ఇక్కడికి వస్తున్నారు. ఈ సారి మామిడి దిగుబడులు గణనీయంగా ఉన్నాయి. దీంతో కాయకు అంతగా డిమాండ్ లేకుండాపోయింది. అది ఆమ్చూర్పై పడింది. దీనిని పండించేవారికంటే కౌలుదారులే ఎక్కువ సంఖ్యలో ఉంటారు. వడగాల్పులు వచ్చి పిందె రాలిన, మార్కెట్లో కాయకు డిమాండ్ తగ్గిన వీరు నష్టపోయే అవకాశం ఉంది.
క్వింటా రూ. పాతిక వేలొస్తేనే..
ఆమ్చూర్ పంటను విక్రయిస్తే క్వింటా రూ.పాతిక వేల ధర వస్తేనే గిట్టుబాటవుతుందని రైతులు వాపోతున్నారు. నిజామాబాద్ యార్డులో గత వారం రోజులుగా పంట రావడం మొదలైంది. ఇప్పుడిప్పుడే వంద నుంచి 500 క్వింటాళ్ల వరకు వస్తోంది. మరో వారం ఆగితే 5 వేల క్వింటాళ్ల వరకు వచ్చే అవకాశం ఉంది. కానీ, ప్రారంభ ధర రూ. 8,500 నుంచి మొదలై రూ.30 వేల లోపే ఆగిపోతోంది. గతేడాది దిగుబడులు తక్కువగా ఉన్న నేపథ్యంలో గరిష్ఠ ధరలు రూ.39 వేల వరకు వెళ్లడం విశేషం. ఈసారి నమూనా ధర రూ.20 వేల లోపే ఉంటోంది. దీనిపై మార్కెట్ కమిటీ సెలక్షన్ గ్రేడ్ కార్యదర్శి వెంకటేశంను ‘న్యూస్టుడే’ వివరణ కోరగా పంట తొలుత పచ్చిగా వస్తోందని, తేమ లేకుండా చేస్తే రానున్న రోజుల్లో ధర పెరిగే వీలుందని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంఘాల లోకోస్ డాటా ఎంట్రీ త్వరితగతిన పూర్తి చేయాలి..
[ 18-05-2024]
నాగిరెడ్డిపేట్ మండల సమాఖ్య కార్యాలయంలో వీవోఏలకు సమీక్ష సమావేశం ఏర్పాటు చేశారు. -
ఘనంగా వాసవి మాత జయంతి ఉత్సవాలు
[ 18-05-2024]
నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో వాసవి మాత జయంతి ఉత్సవాలను ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు. -
ఇక స్థానిక సమరమే..
[ 18-05-2024]
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సర్పంచి ఎన్నికలపై దృష్టి సారించింది. -
నియంత్రికల ధ్వంసం.. రైతన్నలకు నష్టం
[ 18-05-2024]
నందిపేట్ మండలంలో వారం రోజుల వ్యవధిలోనే తల్వేద, సి.హెచ్.కొండూర్ ఎత్తిపోతల పథకాల పంపుహౌస్ల నుంచి దుండగులు నియంత్రికలను ఎత్తుకెళ్లారు. -
వివాదాల వైద్యశాఖ
[ 18-05-2024]
కామారెడ్డి జిల్లా వైద్యశాఖ ఆది నుంచి వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది. వివిధ విభాగాల్లో అవినీతి ఆరోపణలు దుమారం రేపాయి. -
ఆలయాల్లో సౌరవిద్యుత్తు
[ 18-05-2024]
ఇటీవల రామారెడ్డి కాళభైరవస్వామి ఆలయంలో వైశాఖ మాస పూజలు పెద్దఎత్తున ప్రారంభించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. -
తగ్గిన గృహజ్యోతి లబ్ధిదారులు
[ 18-05-2024]
గృహావసరాల విద్యుత్తుకు డిమాండ్ పెరగడంతో గృహజ్యోతి పథకం లబ్ధిదారుల సంఖ్యలో తగ్గుదల కనిపించింది. -
‘అమ్మ ఆదర్శ’ంగా నిలిచేలా..
[ 18-05-2024]
కామారెడ్డి జిల్లాకేంద్రం శివారులోని టేక్రియాల్ ప్రభుత్వ ఉన్నత బడిలో విద్యార్థుల సౌకర్యార్థం మంచి నీటి వసతి కల్పనకు యంత్రాంగం చర్యలు చేపట్టింది. -
కౌంటింగ్ కేంద్రాల్లో మూడంచెల భద్రత
[ 18-05-2024]
కౌంటింగ్ కేంద్రాల్లో మూడంచెల భద్రత ఏర్పాటు చేశామని రాష్ట్ర అదనపు ఎన్నికల కమిషనర్ లోకేష్కుమార్ అన్నారు. -
వరదనీటికి దారేది?
[ 18-05-2024]
ఈ ఏడాది రుతు పవనాల రాక ముందుగానే ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
తాజా వార్తలు (Latest News)
-
దీదీతో పొత్తుపై హైకమాండ్ నిర్ణయం తీసుకోవాలి.. అధీర్ కాదు: ఖర్గే
-
కోనసీమ జిల్లాలో విషాదం.. ముగ్గురు యువకులు మృతి
-
కోడ్పై ఈసీకి ‘విజిల్’ వేశారు.. 2 నెలల్లో 4.24 లక్షల ఫిర్యాదులు
-
టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో దాయాదుల పోరు చూడాలనుంది: కైఫ్
-
జగన్ విధానాలపై ప్రశ్నిస్తే.. వేధిస్తారా?: ఎన్ఆర్ఐ వైద్యుడు లోకేశ్
-
హైదరాబాద్లో భారీ వర్షం.. వనస్థలిపురం వద్ద భారీగా వరదనీరు