logo

అభివృద్ధికి పట్టం కట్టాలి

భారతీయ జనతా పార్టీ యువమోర్చా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు బీజేవైఎం మండల అధ్యక్షుడు రాజగౌడ్ ఆధ్వర్యంలో మంగళవారం యువ సంకల్ప కార్యక్రమం నిర్వహించారు.

Updated : 07 May 2024 16:34 IST

నాగిరెడ్డి పెట్: భారతీయ జనతా పార్టీ యువమోర్చా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు బీజేవైఎం మండల అధ్యక్షుడు రాజగౌడ్ ఆధ్వర్యంలో మంగళవారం యువ సంకల్ప కార్యక్రమం నిర్వహించారు. గత పది సంవత్సరాల కాలంలో మోదీ చేసిన అభివృద్ధిని చూసి అభివృద్ధికి పట్టం కట్టాలని సూచించారు. పార్టీ అభ్యర్థి బీబీ పాటిల్‌కు మద్దతుగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పాటిల్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ప్రధానకార్యదర్శి ప్రభాకర్ రావు, జిల్లా సెక్రటరీ  నరేష్, ఎల్లారెడ్డి బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ అచ్యుత్ రెడ్డి, మండల అధ్యక్షుడు శ్రీకాంత్, కార్యదర్శి మల్లేష్, బూత్ అధ్యక్షుడు పోశయ్య, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని