logo

కాంగ్రెస్ పార్టీతోనే గ్రామాల అభివృద్ధి

కాంగ్రెస్ పార్టీ తోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు.

Published : 08 May 2024 19:28 IST

రామారెడ్డి: కాంగ్రెస్ పార్టీ తోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. బుధవారం అన్నారం మాజీ ఉపసర్పంచ్ శ్రీనివాస్, పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని చూసి పార్టీలో చేరుతున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థులను లోక్ సభ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ వర్కింగ్ మండలాధ్యక్షుడు మద్దికుంట నర్సా గౌడ్, నర్సింలు, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని