logo

సమ్మర్‌ క్యాంపును సద్వినియోగం చేసుకోండి

సమ్మర్‌ క్యాంపును విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కామారెడ్డి జిల్లా యువజన క్రీడా అధికారి దామోదర్ రెడ్డి విద్యార్థులకు సూచించారు.

Published : 09 May 2024 12:37 IST

నాగిరెడ్డిపేట: సమ్మర్‌ క్యాంపును విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కామారెడ్డి జిల్లా యువజన క్రీడా అధికారి దామోదర్ రెడ్డి విద్యార్థులకు సూచించారు. ఆయన గురువారం నాగిరెడ్డిపేట మండలం బొల్లారంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న సమ్మర్‌ క్యాంపును సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  విద్యార్థులకు నిర్వహిస్తున్న సమ్మర్‌ క్యాంప్‌ గురించి నిర్వాహకులు మామిళ్ల నరేష్ రెడ్డిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం చిన్నారులతో  కాసేపు ముచ్చటించారు.  ఆశయ సాధనకు  పట్టుదలతో కృషి చేయాలని కోరారు.  విద్యార్థులు చిన్నతనం నుంచే  పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని