logo

రాష్ట్రానికి ఐఐటీఎఫ్‌ అవార్డు

రాష్ట్రానికి ఇండియా ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌ ఫెయిర్‌ (ఐఐటీఎఫ్‌)-2022 అవార్డు వరించింది. దిల్లీలోని ప్రగతి మైదానం వేదికగా ఈ నెల 14వ తేదీ నుంచి 27 వరకు ట్రేడ్‌ ఫెయిర్‌ వేడుక ఏర్పాటైంది.

Published : 29 Nov 2022 02:38 IST

త్రిపాఠికి ప్రశంసాపత్రం అందజేస్తున్న ప్రదీప్‌ సింగ్

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: రాష్ట్రానికి ఇండియా ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌ ఫెయిర్‌ (ఐఐటీఎఫ్‌)-2022 అవార్డు వరించింది. దిల్లీలోని ప్రగతి మైదానం వేదికగా ఈ నెల 14వ తేదీ నుంచి 27 వరకు ట్రేడ్‌ ఫెయిర్‌ వేడుక ఏర్పాటైంది. కార్యక్రమంలో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఉత్పత్తులు, సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. ఆదివారం ఏర్పాటైన ముగింపు ఉత్సవంలో అటవీ, పర్యావరణ శాఖల మంత్రి ప్రదీప్‌ అమత్‌, రాష్ట్రానికి చెందిన ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. విభిన్న రంగాల్లో ఒడిశా ఉత్తమ ప్రతిభ చూపినందున రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ సంచాలకుడు ఇంద్రమణి త్రిపాఠి ఐఐటీఎఫ్‌   ఎండీ ప్రదీప్‌సింగ్‌ చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని