సురేష్ మహాపాత్ర్ను కొనసాగిస్తారా?
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) పోస్టులో సురేష్ మహాపాత్ర్ ఉద్యోగ కాలం పొడిగిస్తారా? మరో సీనియర్ ఐఏఎస్ అధికారికి ఈ సర్వోన్నత స్థానంలో నియమిస్తారా అన్నదిప్పుడు చర్చనీయాంశమైంది.
సీఎస్ రేసులో పలువురు ఐఏఎస్లు
భువనేశ్వర్, న్యూస్టుడే
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) పోస్టులో సురేష్ మహాపాత్ర్ ఉద్యోగ కాలం పొడిగిస్తారా? మరో సీనియర్ ఐఏఎస్ అధికారికి ఈ సర్వోన్నత స్థానంలో నియమిస్తారా అన్నదిప్పుడు చర్చనీయాంశమైంది. మరోవైపు ఈ పోస్టు కోసం పలువురు ఐఏఎస్ సీనియర్ అధికారులు రేసులో ఉన్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఏం నిర్ణయం తీసుకుంటారన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది.
రెండుసార్లు పొడిగింపు
సీఎస్గా సురేష్ ఉద్యోగ కాలం గతేడాది (2022) ఫిబ్రవరి నెలాఖరుతో ముగిసింది. ఈ పోస్టు కోసం అప్పట్లో ఎంతోమంది సీనియర్ ఐఏఎస్లు ఆశలు పెంచుకున్నారు. అందరి అంచనాలు తలకిందులు చేసిన సురేష్ ఉద్యోగ కాలాన్ని నవీన్ మరో 6 నెలలు పొడిగించారు. తర్వాత రెండోసారి మరో 6 నెలలు పెంచారు. ఈ వ్యవధి ఈ ఏడాది ఫిబ్రవరి నెలాఖరుతో ముగియనుంది. ఈ నేపథ్యంలో మళ్లీ సురేష్ సేవలను కొనసాగిస్తారా? అన్నది నవీన్ నిర్ణయంపై ఆధారపడి ఉంది. విధేయునిగా ఉన్నారన్న ఉద్దేశంతో ఇలా సర్వీసు కాలం పెంచుతూ ఒక్కరినే కొనసాగించడం తగదని మాజీ సీఎస్ సహదేవ్ సాహు అన్నారు. గురువారం రాత్రి భువనేశ్వర్లో సాహు విలేకరులతో మాట్లాడుతూ... సీఎస్గా బాధ్యతలు చేపట్టడానికి ఐఏఎస్ సీనియర్ అధికారులు ఎందరో ఉండగా సర్వీసు పూర్తి చేసుకున్న వ్యక్తిని కొనసాగించడం సబబు కాదని, దీని వల్ల అధికారుల్లో అసంతృప్తి తలెత్తే అవకాశం లేకపోలేదని పేర్కొన్నారు.
ఆశలు పెంచుకున్న సీనియర్లు.. సురేష్ మహాపాత్ర్ను ఒడిశా విద్యుత్తు రెగ్యులేటరీ కమిషన్ (ఓఈఆర్సీ) అధ్యక్షునిగా నియమించే సూచనలు ఉన్నాయన్న వ్యాఖ్యలూ వినిపిస్తున్నాయి. ఓఈఆర్సీ ఛైర్మన్ పదవి కొన్నాళ్లుగా ఖాళీగా ఉంది. ఈ నేపథ్యంలో సీఎస్ పోస్టు కోసం ఐఏఎస్ సీనియర్ అధికారులు ఆశలు పెట్టుకున్నారు. ఈ జాబితాలో సహాయ సీఎస్ హోదాలో ఉన్న అభివృద్ధి కమిషనర్ ప్రదీప్కుమార్ జెనా మొదటి వరుసలో ఉన్నారు. సీనియర్లలో ప్రదీప్త కుమార్ మహాపాత్ర్, రాజేష్ వర్మ, తృహిణికాంత పాండే, సి.జె.వేణుగోపాల్, నికుంజ బిహారీ దొళొ పోటీ పడుతున్నారు. వీరంతా నవీన్కు విధేయులుగా ఉన్నవారే.
త్వరలో నిర్ణయం.. దీనిపై ముఖ్యమంత్రి త్వరలో నిర్ణయం తీసుకుంటారని తెలిసింది. బిజద ఉపాధ్యక్షుడు దేవీప్రసాద్ మిశ్ర శుక్రవారం భువనేశ్వర్లో విలేకరులతో మాట్లాడుతూ... దూరదృష్టి గల నవీన్ రాష్ట్ర హితాన్ని దృష్టిలో పెట్టుకుని సరైన సమయంలో సముచిత నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాటుదేలిన యోధులు... ఎవరో విజేతలు?
[ 26-04-2024]
రాజకీయాల్లో రాటుదేలిన ముగ్గురు యోధుల మధ్య బాలేశ్వర్ లోక్సభ పరిధిలో ఈసారి ఎన్నికల సంగ్రామం సాగుతోంది. -
కేకేలైన్లో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
[ 26-04-2024]
కొరాపుట్ జిల్లా పాడువా సమీపంలో గురువారం సాయంత్రం గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో మూడు బోగీలు బోల్తా పడ్డాయి. -
జగన్నాథునికి సైనా పూజలు
[ 26-04-2024]
అంతర్జాతీయ బ్యాండ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ గురువారం ఉదయం శ్రీక్షేత్రంలో జగన్నాథుని సన్నిధిలో పూజలు చేశారు. -
నేటి నుంచి పెరగనున్న ఉష్ణోగ్రతలు
[ 26-04-2024]
ఇప్పటికే రాష్ట్రం అగ్నిగుండంలా మారింది. ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు దాటాయి. ఉక్కపోత ఉక్కిరిబిక్కిరికి గురి చేస్తోంది. -
నవీన్ ప్రభుత్వాన్ని గద్దె దించండి
[ 26-04-2024]
సామర్థ్యం కొరవడిన నవీన్ పట్నాయక్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని, అయిదేళ్లు భాజపాకు అవకాశం ఇవ్వాలని, ఒడిశాను దేశంలో అగ్రగామిగా తీర్చిదిద్దుతామని కేంద్ర హోం మంత్రి అమిత్షా పిలుపునిచ్చారు. -
పనిచేయని బిజూ కార్డు.. ఆగిన శస్త్రచికిత్స
[ 26-04-2024]
బిజు కార్డు పని చేయకపోవడంతో ఎనిమిదేళ్ల బాలుడికి చేయవలసిన శస్త్రచికిత్స ఆపేశారు. గత్యంతరం లేక బాలుడిని పట్టుకొని తల్లిదండ్రులు ఇంటికి తిరిగొచ్చిన ఘటన నవరంగపూర్ జిల్లాలో జరిగింది. -
కాంగ్రెస్లో రాజీనామాలు
[ 26-04-2024]
గుణుపురం విధానసభ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్కు సమస్యలు ఎదురవుతున్నాయి. పలువురు నాయకులు ప్రాథమిక సభ్యత్వం నుంచి రాజీనామా చేసినట్లు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బిజయకుమార్ గమాంగ్ తెలిపారు. -
ముగిసిన నామినేషన్ల పర్వం...
[ 26-04-2024]
గజపతి జిల్లాలో మే 13వ తేదీన జరిగే ఎన్నికలకు నామినేషన్ల పర్వం గురువారంతో ముగిసింది. మోహన నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థులుగా రూబెన్ మండల్
తాజా వార్తలు (Latest News)
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం