కేంద్రం వివక్షను ఎండగట్టండి
పార్లమెంటు ఉభయ సభలు వచ్చే నెల కొలువుదీరనున్నాయి. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థికశాఖా మంత్రి నిర్మలా సీతారామన్ 2023-24 సంవత్సరం ఆర్థిక, రైల్వే బడ్జెట్లు ప్రవేశ పెట్టనున్నారు.
బిజద ఎంపీలకు నవీన్ ఉద్బోధ
బిజద ఎంపీలతో సీఎం నవీన్
భువనేశ్వర్, న్యూస్టుడే: పార్లమెంటు ఉభయ సభలు వచ్చే నెల కొలువుదీరనున్నాయి. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థికశాఖా మంత్రి నిర్మలా సీతారామన్ 2023-24 సంవత్సరం ఆర్థిక, రైల్వే బడ్జెట్లు ప్రవేశ పెట్టనున్నారు. కేంద్రం ప్రవేశపెడుతున్న కీలక బిల్లులన్నింటికీ మద్దతిస్తూ వచ్చిన బిజద ఈసారి స్వరానికి పదును పెట్టాలని నిర్ణయించింది. ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అధ్యక్షతన శనివారం బిజద పార్లమెంటరీ సభ్యుల సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రయోజనాలే ధ్యేయంగా ఎంపీలంతా కలసికట్టుగా ఉభయసభల్లో ఉద్యమించాలని, రాష్ట్రంపై కేంద్రం చూపుతున్న వివక్షను ఎండగట్టాలని సీఎం ఉద్బోధించారు. పార్లమెంటులో లేవనెత్తనున్న అంశాలపై కూలంకషంగా చర్చ జరిగింది. అనంతరం ఎంపీలు విలేకరులతో మాట్లాడారు.
రాష్ట్ర ప్రయోజనాలే ధ్యేయం
లోక్సభ బిజద నేత పినాకి మిశ్ర మాట్లాడుతూ... రాష్ట్ర ప్రయోజనాలే ధ్యేయంగా సభలో గళం వినిపిస్తామన్నారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించాలని ఎంతోకాలంగా నవీన్ కోరుతున్నారని, దీనిపై కేంద్రానికి అన్ని, రాష్ట్రాల సీఎంలకు గతంలో ఆయన లేఖలు రాసిన సంగతి గుర్తు చేశారు. మహిళ బిల్లుపై కేంద్ర పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారని, ఈ విషయమై సానుకూలంగా ఉన్న ఇతర పార్టీలతో కలిసి ‘ప్రెషర్ గ్రూపు’ ఏర్పాటు చేసి ఆమోదం పొందేలా ఉద్యమిస్తామన్నారు. విధాన పరిషత్ ఏర్పాటు బిల్లునూ పట్టించుకోవడం లేదని, శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేసి ప్రతులను కేంద్రానికి పంపించి నాలుగేళ్లు కావస్తోందన్నారు. ఈసారి సమావేశాల్లో దీనిని ఆమోదించాలని డిమాండ్ చేస్తామన్నారు. అసమానతలు, వెనుకబాటు, పేదరికంలో ఉన్న రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న వినతిని కేంద్రం నిర్లక్ష్యం చేసిందని, దీన్ని మరోసారి ప్రముఖంగా ప్రస్తావిస్తామన్నారు.
అన్ని రంగాల్లో వివక్ష
రాజ్యసభ బిజద నేత సస్మిత్ పాత్ర్ మాట్లాడుతూ.. రాష్ట్రం పట్ల కేంద్రం అన్ని రంగాల్లో వివక్ష చూపుతోందన్నారు. కేటాయింపులు తగ్గించిన దిల్లీ పెద్దలు పీఎం ఆవాస్ యోజనలో 4 లక్షల ఇళ్లు తగ్గించారన్నారు. రైల్వేలు, రహదారుల విస్తరణ, డిజిటల్, కమ్యూనికేషన్ రంగాలకు ప్రాధాన్యం కరవైందన్నారు. 169 తెగల గిరిజనులను ఎస్టీల జాబితాలో చేర్చాలన్న వినతులనూ పక్కన పెట్టారన్నారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన నిలిపివేసి రూ.8 వేల కోట్లు ఆదా చేయాలన్న కేంద్రం నిర్ణయం హేయమైనదని, దీన్ని సభలో ఎండగడతామన్నారు. భారత రాజ్యాంగంలో ‘అహింస’ అనే పథం చేర్చాలని నవీన్ కేంద్రాన్ని పలుసార్లు కోరినా పట్టించుకోలేదని, ఈ అంశాన్ని మళ్లీ లేవనెత్తుతామన్నారు. ఎఫ్సీఐ ఉప్పుడు బియ్యం కొనుగోలు చేయడం లేదని, అన్నదాతలు దీనిపై ఆవేదన వ్యక్తం చేస్తున్నా కేంద్రం పట్టించుకోవడం లేదని, ఈ అంశాన్ని ప్రస్తావిస్తామని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గజపతి సేవలు చిరస్మరణీయం: నవీన్
[ 27-04-2024]
స్వతంత్ర ఒడిశా ఏర్పాటు ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన మహారాజా కృష్ణచంద్ర గజపతి సేవలు చిరస్మరణీయమని, రాష్ట్ర ప్రజలకు ఆయన మార్గదర్శిగా నిలిచారని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అభివర్ణించారు. -
కాంగ్రెస్కు పూర్వవైభవం దక్కేనా
[ 27-04-2024]
కొరాపుట్ జిల్లాలోని అయిదు నియోజకవర్గాలు ఒకప్పుడు కాంగ్రెస్కు కంచుకోటగా ఉండేవి. ఆ పార్టీలో నెలకొన్న వివాదాలు పార్టీకి తీవ్ర నష్టాన్ని తీసుకువస్తున్నాయి. -
హింజిలికి ఏం చేశారో శ్వేతపత్రం విడుదల చేయండి
[ 27-04-2024]
‘ముఖ్యమంత్రిగా 25 ఏళ్ల కాలంలో మీ సొంత నియోజకవర్గం హింజిలికి ఏం చేశారు?.. వలసలు నివారించడానికి అక్కడ పరిశ్రమలు ఏవైనా ప్రారంభించగలిగారా? అన్నదానిపై శ్వేతపత్రం విడుదల చేయాలి’ అని నవీన్కు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సవాల్ విసిరారు. -
ధర్మేంద్ర మాతృభూమికి చేసిందేమిటి?
[ 27-04-2024]
స్థిరమైన పాలన అందించిన ఘనచరిత్ర ముఖ్యమంత్రి నవీన్ సొంతమని, ఉత్తమ పాలకునిగా మన్ననలందుకున్నారని, అన్ని రికార్డులు ఆయన సొంతమని సంబల్పూర్ లోక్సభ బిజద అభ్యర్థి ప్రణవ ప్రకాష్ దాస్ (బొబి) పేర్కొన్నారు. -
5 లోక్సభ, 35 అసెంబ్లీ స్థానాలకు నోటిఫికేషన్
[ 27-04-2024]
రాష్ట్రంలో రెండోవిడతగా మే 20న జరగనున్న అస్కా, కొంధమాల్, బొలంగీర్, బరగఢ్, సుందర్గఢ్ లోక్సభ స్థానాలు, వాటి పరిధుల్లోని 35 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. -
రాయగడ జిల్లాలో 62 నామినేషన్లు
[ 27-04-2024]
జిల్లాలో రాయగడ, గుణుపురం, బిసంకటక్ నియోజకవర్గ శాసనసభ స్థానాలకుగాను ప్రధాన పార్టీలతోసహా ఇతర పార్టీ అభ్యర్థులు, స్వతంత్రులతో కలిపి 62 సెట్ల నామినేషన్లు దాఖలు చేసినట్లు శుక్రవారం ఆర్వో సంఘమిత్రా దేవి వెల్లడించారు. -
రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత
[ 27-04-2024]
కేంద్ర హోంమంత్రి, భాజపా సిద్ధాంతకర్త అమిత్షా రాష్ట్ర పర్యటన పార్టీ నేతలు, శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. గురువారం సాయంత్రం పశ్చిమ ఒడిశాలోని సోన్పూర్ బహిరంగ సభలో నవీన్ పట్నాయక్ పాలనా వైఫల్యాలను విమర్శించిన షా తాము బిజదకు అనుకూలం కాదన్న సందేశమిచ్చారు. -
నాడు బిజద.. నేడు భాజపా
[ 27-04-2024]
రాయగడ జిల్లా గుణుపురం నియోజకవర్గంలో కొందరు నిన్నటి వరకు బిజూ జనతా దళ్లో ఉండి ఎన్నికల ముందు భాజపాలో చేరి ఆ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. -
బిజదలో చేరికలు
[ 27-04-2024]
బ్రహ్మపుర మున్సిపల్ కార్పొరేషన్ (బీఈఎంసీ) అయిదో వార్డుకు చెందిన యువ నాయకుడు సనాతన సాహు శుక్రవారం రాత్రి బిజదలో చేరారు. అంతకుముందు ఆయన వందలాది మంది వార్డు ప్రజలు, మద్దతుదారులతో కలిసి వార్డులో పాదయాత్ర నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్
-
రెండు కిలోమీటర్లకే రూ.9 వ్యత్యాసమా..!
-
ఇచ్చేది మెతుకంత.. చిందరవందరే బతుకంతా!!
-
క్రీడలపై గ‘లీజు’ పెత్తనం.. జగన్ జమానాలో అంతా వ్యాపారమే