పది జిల్లాలకు వర్చువల్ హైకోర్టు సౌకర్యం
రాష్ట్రంలోని పది జిల్లాల్లో ఏర్పాటు చేసిన వర్చువల్ హైకోర్టులను శుక్రవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధనుంజయ వై.చంద్రచూడ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు.
ప్రారంభోత్సవంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.మురళీధర్ తదితరులు
కటక్, న్యూస్టుడే: రాష్ట్రంలోని పది జిల్లాల్లో ఏర్పాటు చేసిన వర్చువల్ హైకోర్టులను శుక్రవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధనుంజయ వై.చంద్రచూడ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. సాయంత్రం కటక్లోని జ్యుడీషియల్ అకాడమీ ప్రాంగణంలో హైకోర్టు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వర్చువల్ విధానంలో ఆయన కోర్టులను ప్రారంభించారు. కార్యక్రమంలో పాల్గొన్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.మురళీధర్ మాట్లాడుతూ వర్చువల్ హైకోర్టుల ఏర్పాటు వల్ల రాష్ట్ర ప్రజలకు మరిన్ని న్యాయసేవలు అందుతాయన్నారు. వివిధ జిల్లాలకు చెందినవారు పిటీషన్లను వారి జిల్లాల్లో ఉన్న వర్చువల్ హైకోర్టులో దాఖలు చేయవచ్చన్నారు. కేసుల విచారణ కూడా వీడియో కాన్ఫరెన్సు ద్వారా జరుగుతుందని వివరించారు. పిటీషన్దారులు ఇక కటక్ హైకోర్టుకు రావాల్సిన అవసరం ఉండదన్నారు. ప్రజల వద్దకు న్యాయ సేవలు అందించేందుకు వీటిని ప్రారంభించిందని వివరించారు. తొలివిడతలో బాలేశ్వర్, భద్రక్, బొలంగీర్, గంజాం, కలహండి, ఖుర్దా, కొరాపుట్, పూరీ, సంబల్పూర్, సుందర్గఢ్ జిల్లాల్లో ఏర్పాటు చేశామన్నారు. త్వరలో మిగిలిన 20 జిల్లాల్లో కూడా ఈ న్యాయస్థానాలను ప్రారంభిస్తామన్నారు. దీనివల్ల హైకోర్టును ఆశ్రయించడానికి సాధారణ ప్రజలు పడుతున్న ఇబ్బందులు తొలగిపోతాయన్నారు. కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తులతోపాటు మాజీ న్యాయమూర్తులు హాజరయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాటుదేలిన యోధులు... ఎవరో విజేతలు?
[ 26-04-2024]
రాజకీయాల్లో రాటుదేలిన ముగ్గురు యోధుల మధ్య బాలేశ్వర్ లోక్సభ పరిధిలో ఈసారి ఎన్నికల సంగ్రామం సాగుతోంది. -
కేకేలైన్లో పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
[ 26-04-2024]
కొరాపుట్ జిల్లా పాడువా సమీపంలో గురువారం సాయంత్రం గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో మూడు బోగీలు బోల్తా పడ్డాయి. -
జగన్నాథునికి సైనా పూజలు
[ 26-04-2024]
అంతర్జాతీయ బ్యాండ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ గురువారం ఉదయం శ్రీక్షేత్రంలో జగన్నాథుని సన్నిధిలో పూజలు చేశారు. -
నేటి నుంచి పెరగనున్న ఉష్ణోగ్రతలు
[ 26-04-2024]
ఇప్పటికే రాష్ట్రం అగ్నిగుండంలా మారింది. ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలు దాటాయి. ఉక్కపోత ఉక్కిరిబిక్కిరికి గురి చేస్తోంది. -
నవీన్ ప్రభుత్వాన్ని గద్దె దించండి
[ 26-04-2024]
సామర్థ్యం కొరవడిన నవీన్ పట్నాయక్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని, అయిదేళ్లు భాజపాకు అవకాశం ఇవ్వాలని, ఒడిశాను దేశంలో అగ్రగామిగా తీర్చిదిద్దుతామని కేంద్ర హోం మంత్రి అమిత్షా పిలుపునిచ్చారు. -
పనిచేయని బిజూ కార్డు.. ఆగిన శస్త్రచికిత్స
[ 26-04-2024]
బిజు కార్డు పని చేయకపోవడంతో ఎనిమిదేళ్ల బాలుడికి చేయవలసిన శస్త్రచికిత్స ఆపేశారు. గత్యంతరం లేక బాలుడిని పట్టుకొని తల్లిదండ్రులు ఇంటికి తిరిగొచ్చిన ఘటన నవరంగపూర్ జిల్లాలో జరిగింది. -
కాంగ్రెస్లో రాజీనామాలు
[ 26-04-2024]
గుణుపురం విధానసభ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్కు సమస్యలు ఎదురవుతున్నాయి. పలువురు నాయకులు ప్రాథమిక సభ్యత్వం నుంచి రాజీనామా చేసినట్లు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బిజయకుమార్ గమాంగ్ తెలిపారు. -
ముగిసిన నామినేషన్ల పర్వం...
[ 26-04-2024]
గజపతి జిల్లాలో మే 13వ తేదీన జరిగే ఎన్నికలకు నామినేషన్ల పర్వం గురువారంతో ముగిసింది. మోహన నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థులుగా రూబెన్ మండల్
తాజా వార్తలు (Latest News)
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు