మన్మోహన్ చేతికి రాష్ట్ర కమలం పగ్గాలు
భాజపా రాష్ట్రశాఖ అధ్యక్షునిగా మన్మోహన్ సామల్ నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షుడు జె.పి.నడ్డా గురువారం సామల్కు ఈ కీలక బాధ్యతలు అప్పగించారు.
త్వరలో నూతన కార్యవర్గం?
ఇక బిజదతో పోరేనా?
భువనేశ్వర్, భువనేశ్వర్ అర్బన్, న్యూస్టుడే: భాజపా రాష్ట్రశాఖ అధ్యక్షునిగా మన్మోహన్ సామల్ నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షుడు జె.పి.నడ్డా గురువారం సామల్కు ఈ కీలక బాధ్యతలు అప్పగించారు. రాష్ట్ర కమలం పగ్గాలు చేపట్టిన ఆయన భాజపాలో అతివాదిగా ముద్రపడ్డారు. ఈ నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు మారనున్నాయని పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. త్వరలో సామల్ నూతన కార్యవర్గం ఏర్పాటు చేసి సాధారణ ఎన్నికల ముందుగా పార్టీ శ్రేణులను సమాయత్తం చేసే అవకాశం ఉంది.
వరుసగా మూడోసారి.. రాష్ట్ర భాజపాశాఖ అధ్యక్షునిగా 1999-20, 2001-04లో (రెండుసార్లు) విధులు నిర్వహించిన మన్మోహన్కు విశేషానుభవం ఉంది. బిజద, భాజపా కూటమి ప్రభుత్వంలో ఆయన రెవెన్యూ, ఆహార పౌరసరఫరాలశాఖ మంత్రిగా చేశారు. ఉత్తరకోస్తా (భద్రక్ జిల్లా)కు చెందిన సామల్కు కేంద్ర నాయకత్వం మూడోసారి అధ్యక్ష పదవి కేటాయించడం వెనక ఎత్తుగడ ఉంది. రాజకీయ అతివాది అయిన ఆయన నవీన్ పట్నాయక్ పాలనా వైఫల్యాలు ఎండగట్టడానికి, ఉద్యమాలకు ఊపిరిలూదడానికి కీలకమవుతారు. 2024 ఎన్నికల్లో తూర్పు భారతంలోని ఒడిశాలో కమల వికాసం తథ్యమని భాజపా నేతలంటున్నారు. రాజకీయ వ్యూహంలో భాగంగా ఇటీవల జయనారాయణ మిశ్రను విపక్షనేతగా నియమించారు. అతివాది అయిన మిశ్ర శాసనసభలో పాలక పక్షానికి దీటుగా సమాధానాలు ఇస్తున్నారు. నవీన్ ప్రభుత్వ వైఫల్యాలను తూర్పార పడుతున్నారు.
సర్దుబాటును చెరిపేస్తారా?.. బిజద, భాజపాలు పరస్పరం విమర్శలు చేసుకుంటున్నా, ఈ రెండు పార్టీలు మధ్య లోపాయికారీ బంధం ఉందన్న భావన ప్రజల్లో ఉంది. ముఖ్యమంత్రి నవీన్కు, ప్రధానికి, ఇతర కేంద్ర నాయకులతో సత్సంబంధాలున్నాయి. ఇచ్చిపుచ్చుకునే రీతిలో వ్యవహరిస్తున్నారన్న వాస్తవాన్ని తుడిచేయడానికే కేంద్ర నాయకత్వం ఏరికోరి అతివాదులకు కీలక బాధ్యతలు కేటాయించినట్లు రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. దీనిపై విపక్షనేత జయనారాయణ గురువారం భువనేశ్వర్లో విలేకరులతో మాట్లాడుతూ.. ఇక బిజదతో పోరు రసవత్తరంగా ఉంటుందని, మన్మోహన్ నియామకంతో శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేస్తుందని, రానున్న ఎన్నికల్లో కేంద్రంలో, రాష్ట్రంలో భాజపా విజయం తథ్యమని జోస్యం చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
[ 25-04-2024]
ఒడిశాలో కోరాపుట్ జిల్లా పాడువా సమీపంలో గురువారం సాయంత్రం గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. -
అభివృద్ధి కొనసాగుతుంది..శంక ద్వయాన్ని ఆశీర్వదించండి
[ 25-04-2024]
రాష్ట్రంలో అభివృద్ధి కొనసాగుతుందని, బిజదను ఆశీర్వదించాలని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రజల్ని కోరారు. -
భాజపాకు 40 మంది స్టార్ ప్రచారకులు
[ 25-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో భాజపా స్టార్ ప్రచారకుల జాబితా మంగళవారం రాత్రి విడుదల చేశారు. -
ఇంకెన్నాళ్లీ దుస్థితి?
[ 25-04-2024]
అధ్వానంరాష్ట్రంలో ఉన్నత విద్యా ప్రమాణాలు అధ్వానంగా ఉన్నాయన్న నివేదికలు దిగజారిన ‘నాక్’ గ్రేడేషన్లు దుస్థితిని తెలియజేస్తున్నాయని కేంద్రమంత్రి నిలదీశారు. విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో భర్తీకాని టీచింగ్ సిబ్బంది, అసౌకర్యాలు, ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల డ్రాపౌట్ల గురించి ఏం సమాధానం చెబుతారన్నారు. -
ఓ తండ్రి...ఇద్దరు కొడుకులు
[ 25-04-2024]
గత అయిదున్నర దశాబ్దాల కాలంగా రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగిన నేత ఆయన. అన్ని పార్టీల నేతల మన్ననలు అందుకున్న వ్యక్తి. వయసుతోపాటు గౌరవం, నిక్కచ్చితనం పెంచుకున్న నికార్సయిన నేత. 80 ఏళ్ల వయసులో కొడుకు నిర్వాకంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
నామినేషన్ల సందడి
[ 25-04-2024]
బ్రహ్మపుర లోకసభ పరిధిలోని పర్లాఖెముండి నియోజకవర్గ భాజపా ఎమ్మెల్యే అభ్యర్థిగా కోడూరు నారాయణరావు నామినేషన్ పత్రాన్ని సబ్ కలెక్టర్ అనూప్ పండాకు అందజేశారు. -
భాజపాలో సీమారాణి చేరిక
[ 25-04-2024]
బిజదకు రాజీనామా చేసిన హిందళ్ సిటింగ్ ఎమ్మెల్యే సీమారాణి నాయక్ బుధవారం భాజపాలో చేరారు. పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు మన్మోహన్ సామల్, ఇతర నాయకులు ఆమెను స్వాగతించారు. -
నేడు అమిత్షా రాక
[ 25-04-2024]
కేంద్ర హోంమంత్రి అమిత్షా గురువారం రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. మధ్యాహ్నం సోన్పూర్లో ఏర్పాటయ్యే ఎన్నికల బహిరంగ సభలో ప్రసంగిస్తారు. -
నా ఓటు.. నా బాధ్యత
[ 25-04-2024]
నా ఓటు నా బాధ్యత అంటూ, తప్పకుండా ఓటు వినియోగించుకుంటామని నూతన ఓటర్లు, కళాశాల విద్యార్థులన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?