logo

కనుల పండువగా చైత్రోత్సవాలు

శక్తి స్వరూపిణి, శాంతి స్వరూపిణి మజ్జిగౌరీ అమ్మవారి చైత్రోత్సవ సంబరాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.

Published : 20 Apr 2024 03:05 IST

రాయగడ, న్యూస్‌టుడే: శక్తి స్వరూపిణి, శాంతి స్వరూపిణి మజ్జిగౌరీ అమ్మవారి చైత్రోత్సవ సంబరాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. శుక్రవారం సున్నాభేషొ (బంగారు ఆభరణాలతో) అలంకరణలో అమ్మవారిని దర్శించుకున్న భక్తులు తన్మయత్వం చెందారు. హోమ మండపం, ఘట మండపాల శుద్ధి, పుణ్యాహవచనం జరిగింది. అమ్మవారి పాదాలు, అక్క చెల్లెళ్లను తీసుకొచ్చి అఖండ జ్యోతి వెలిగించారు. పురోహితుడు బిరంచి నారాయణ దాస్‌తోపాటు అస్కా జిల్లా కబిసూర్జ్య నగర్‌ నుంచి వచ్చిన దుర్గా ఉపాసకులు పూజలు నిర్వహించారు. ఆలయ ట్రస్టు అధ్యక్షుడు రాయిసింగి బిడిక, ట్రస్టు సభ్యులు ఇప్పిలి సన్యాసిరాజు, వడ్డాది శ్రీనివాసరావు దంపతులు పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మికత నెలకొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని