కలహండి... ఎవరిదో విజయమండీ ?
పశ్చిమ ఒడిశాలోని కలహండి లోక్సభ స్థానంలో విజేత ఎవరు? ఓటర్లు ఈసారి ఎవరికి పట్టం కడతారు? అన్నదిప్పుడు చర్చనీయాంశంగా మారింది. బిజద, భాజపా, కాంగ్రెస్ నాయకత్వాలు ఈసారి కొత్త అభ్యర్థులకు అవకాశమిచ్చాయి. విజయానికి ఇక్కడ కొన్ని కులాలు నిర్ణయాత్మకమవుతున్నాయి.
కొత్త అభ్యర్థుల మధ్య ముక్కోణపోటీ
భువనేశ్వర్, న్యూస్టుడే
ఇంద్రావతి ప్రాజెక్టు
పశ్చిమ ఒడిశాలోని కలహండి లోక్సభ స్థానంలో విజేత ఎవరు? ఓటర్లు ఈసారి ఎవరికి పట్టం కడతారు? అన్నదిప్పుడు చర్చనీయాంశంగా మారింది. బిజద, భాజపా, కాంగ్రెస్ నాయకత్వాలు ఈసారి కొత్త అభ్యర్థులకు అవకాశమిచ్చాయి. విజయానికి ఇక్కడ కొన్ని కులాలు నిర్ణయాత్మకమవుతున్నాయి.
పీవీ అండదండలతో ముందంజ
కలహండి ఒకప్పుడు కరవు కాటకాల జిల్లాగా గుర్తింపు పొంది. ఆకలిచావులు జిల్లాగా జాతీయ ప్రసార సాధనాల్లో చర్చనీయాంశమైంది. కన్నబిడ్డల్ని అమ్ముకుంటున్నారన్న కథనాలు ప్రసారమైన తర్వాత నాటి (దివంగత) ప్రధాని పి.వి.నరసింహారావు స్వయంగా దృష్టి సారించారు. కలహండి, బొలంగీర్, కొరాపుట్ (కేబీకే) ఉమ్మడి జిల్లా సమగ్ర వికాసమే ధ్యేయంగా నాటి ప్రణాళికా సంఘం నివేదిక సిద్ధం చేసింది. దీన్ని ఆధారంగా చేసుకుని ఆర్థిక సంఘం ఈ జిల్లాల ప్రగతికి కేబీకే పథకం అమలుకు సిఫార్సు చేసింది. కేంద్రం నిధులు మంజూరు చేసింది. ‘ఓటికుండ’గా అంతా చెప్పుకున్న కలహండిలో ఇంద్రావతి నీటిపారుదల ప్రాజెక్టు నిర్మాణంతో పచ్చదనం వెల్లివిరిసింది. పంట పొలాలు సస్యశ్యామలమయ్యాయి. కరవుకాటకాలు దూరమయ్యాయి. కేంద్రంలో నరేంద్రమోదీ సర్కారు పాలనా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రణాళికా సంఘం స్థానంలో నీతి ఆయోగ్ ఏర్పాటైంది. కేబీకే కార్యక్రమం నిలిపివేసిన కేంద్ర పాలకులు ‘ఆకాంక్ష’ పేరిట వెనుకబడిన జిల్లాల ప్రగతికి దేశవ్యాప్త కార్యక్రమాలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందులో కేబీకే జిల్లాలకు చోటు కల్పించారు.
మొగ్గతొడిగిన చైతన్యం
ఎస్సీ, ఎస్టీలు, యాదవులు (ఓబీసీ) ఎక్కువగా ఉన్న కలహండి ప్రాంతంలో రాజకీయ చైతన్యం ఇటీవల కాలంలో ప్రారంభమైంది. అప్పట్లో రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ పాలకులు ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేశారన్న అపవాదు మూటకట్టుకున్నారు. ఈ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ అగ్రనేత భక్తచరణ్ దాస్ కేంద్రమంత్రిగా విధులు నిర్వహించినా జన్మభూమి వికాసానికి చిత్తశుద్ధి కనబరచలేదన్న అసంతృప్తి ఉంది. తర్వాత రాజవంశానికి చెందిన పుష్పేంద్ర సింగ్దేవ్ బిజదలో చేరి కలహండి ఎంపీగా, తర్వాత నవీన కేబినెట్లో పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా విధులు నిర్వహించారు. ఆయన హయాంలో కలహండి వాసులకు మౌలిక సౌకర్యాలు కల్పించారు. ఆకాంక్ష నిధులతో అభివృద్ధి పనులు జరిగాయి.
రాజవంశీకులకు ఆదరణ
రాజవంశీకులకు కలహండిలో ఆదరణ ఉంది. ఈ జిల్లా కేంద్రం భవానీపాట్నా రాజప్రసాదానికి చెందిన అర్కకేసరిదేవ్, ఆయన భార్య మాళవిక దేవి 2014 ఎన్నికల ముందు బిజదలో చేరారు. కలహండి లోక్సభ అభ్యర్థిగా అర్కకేసరి ఆ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచారు. 2019లో ఆయనకు టికెట్ నిరాకరించిన సీఎం మళ్లీ పుష్పేంద్ర సింగ్దేవ్ను నిలిపారు. నాటి భాజపా రాష్ట్రశాఖ అధ్యక్షుడు బసంత పండా ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు.
అంతా కొత్తవారే
ఇటీవల అర్కకేసరి దంపతులు కాషాయం కండువాలు ధరించారు. భాజపా నాయకత్వం సిటింగ్ ఎంపీ బసంత పండా స్థానంలో రాణి మాళవిక దేవిని అభ్యర్థిగా నిలిపింది. రాజపరివారానికి జనాల్లో ఆదరణ ఉన్నందున ఆమెకు అవకాశమిచ్చింది. నవీన్ ఎత్తుగడలో భాగంగా యాదవ తెగకు చెందిన లంబోధర్ నియార్ను ఇక్కడ పోటీకి అవకాశమిచ్చారు. కాంగ్రెస్ నాయకత్వం ఎస్టీ వర్గానికి ద్రౌపదీ మాఝిని బరిలో దించింది. యాదవుల ఓటు బ్యాంకు ధ్యేయంగా లంబోధర్, దళిత, గిరిజనుల ఓట్ల కోసం ద్రౌపదీ మాఝి ప్రచారం చేస్తున్నారు. అన్నివర్గాల వారికి చేరువయ్యేందుకు రాణి భర్త అర్కకేసరితో కలిసి గ్రామాల్లో పాదయాత్రలు, రోడ్షోలు, జనసభలు చేపడుతున్నారు. ప్రధాన పార్టీలకు చెందిన ఈ ముగ్గురు అభ్యర్థులు తొలిసారిగా లోక్సభకు పోటీ చేస్తున్నారు. విజయలక్ష్మి ఎవర్ని వరిస్తుందో వేచి చూడాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్వల్ప ఘటనలు మినహా.. రెండో విడత ప్రశాంతం
[ 21-05-2024]
రాష్ట్రంలో సోమవారం రెండోవిడత పోలింగ్ స్వల్ప ఘటనలు మినహా ప్రశాంతంగా జరిగినట్లు ప్రధాన ఎన్నికల అధికారి నికుంజ బిహారీ ధొళొ భువనేశ్వర్లో విలేకరులకు చెప్పారు. -
మందకొడిగా ప్రారంభం... తర్వాత ఉత్సాహం
[ 21-05-2024]
గంజాం జిల్లాలో రెండోవిడత సోమవారం అస్కా లోక్సభ, ఎనిమిది అసెంబ్లీ సెగ్మెంట్లలో చెదురుమదురు ఘటనలు మినహా పోలింగు ప్రశాంతంగా జరిగింది. -
నవీన్ పాలన రాష్ట్రానికి శాపం
[ 21-05-2024]
నవీన్ పట్నాయక్ 25 ఏళ్ల పాలన రాష్ట్రానికి తీరని శాపమని, ఖనిజ సంపదలున్నా పేదరికానికి చిరునామా అయిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. -
కొరాపుట్లో భారీ వర్షం: ఇళ్లు ధ్వంసం
[ 21-05-2024]
కొరాపుట్ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో సోమవారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షానికి జనజీవనం అస్తవ్యస్థమైంది. -
ఉత్కళీయులు ఆశీర్వదిస్తున్నారు: మోదీ
[ 21-05-2024]
ఉత్కళీయులు ఈసారి భాజపాను ఆశీర్వదిస్తున్నారని, రాష్ట్ర ప్రజలకు సేవ చేసే అవకాశం మనకు కలగనుందని, జగన్నాథుని కటాక్షం పార్టీపై ఉందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. -
మహానదితో కేంద్ర నేతల రాజకీయాలు: పాండ్యన్
[ 21-05-2024]
ఉత్తర కోస్తా, పశ్చిమ ఒడిశాలోని 15 జిల్లాలకు ‘జీవధార’గా నిలుస్తున్న మహానదితో కేంద్ర మంత్రులు దిగజారుడు రాజకీయాలు చేశారని బిజద నేత వి.కార్తికేయ పాండ్యన్ ఆరోపించారు. -
ఎన్నికల బహిష్కరణ
[ 21-05-2024]
గంజాం జిల్లా సన్నొఖెముండి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని గుడియాపటనా గ్రామస్థులు తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని డిమాండు చేస్తూ సోమవారం ఎన్నికల్ని బహిష్కరించారు. -
జగన్నాథుని సన్నిధిలో మోదీ విశ్వశాంతి పూజలు
[ 21-05-2024]
ఒడిశాలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన ప్రధాని నరేంద్రమోదీ సోమవారం ఉదయం 7.30 గంటలకు పూరీ చేరుకున్నారు. -
నోట్ల కట్టలతో బ్యాగు కలకలం..
[ 21-05-2024]
లక్షలాది రూపాయల నోట్ల కట్టలతో ఒక బ్యాగ్ లభించడం జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది. పోలీసుల వివరాలు ప్రకారం.. ఖరగ్పూర్ గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఒక హోటల్ గదిలో రూ.500 నోట్ల కట్టలతో రూ.లక్షల నగదు ఆదివారం లభిచిందిత.