logo

అభివృద్ధికి ఓటేసి మద్దతివ్వండి

కొరాపుట్‌ జిల్లాలో అభివృద్ధికి ఓటేసి బిజదకు మద్దతివ్వాలని ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ పిలుపునిచ్చారు.

Published : 05 May 2024 03:43 IST

వేదికపై ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌, కొరాపుట్‌ జిల్లాలోనినియోజకవర్గాల అభ్యర్థులు, లోక్‌సభ అభ్యర్థి కౌసల్య హికాక

క్రొరాపుట్‌, న్యూస్‌టుడే: కొరాపుట్‌ జిల్లాలో అభివృద్ధికి ఓటేసి బిజదకు మద్దతివ్వాలని ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ పిలుపునిచ్చారు. శనివారం 3వ బెటాలియన్‌ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ కొరాపుట్‌ జిల్లాలో బిజద అభ్యర్థులు రఘురామ్‌ పడాల్‌, ప్రఫుల్ల పంగి, ప్రభు జాని, కౌసల్య హికాకలను గెలిపించాలని కోరారు. గిరిజన సంక్షేమం బిజదతోనే సాధ్యమన్నారు. మరోసారి పార్టీని గెలిపించి రాష్ట్రాన్ని, కొరాపుట్‌ జిల్లాను మరింత అభివృద్ధిపథంలో నడిపించే అవకాశం ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో 5టీ అధ్యక్షుడు పాండ్యన్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి పథ]కాలను వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని