కుటుంబ కధా చిత్రం
విశ్వసనీయత, విద్యార్హత, ఆదరణ ఉన్నవారికే ఈసారి ఎన్నికల బరిలో దించుతామన్న ప్రధాన పార్టీలు మాట నెలబెట్టుకోలేదు
మయూర్భంజ్ లోక్సభ, బొంగిరిపోషి అసెంబ్లీ బిజద అభ్యర్థులు సుధాం మారండి, రంజిత్ మరాండి (దంపతులు)
భువనేశ్వర్, న్యూస్టుడే: విశ్వసనీయత, విద్యార్హత, ఆదరణ ఉన్నవారికే ఈసారి ఎన్నికల బరిలో దించుతామన్న ప్రధాన పార్టీలు మాట నెలబెట్టుకోలేదు. కుటుంబంలో ఒక్కరికే టికెట్ అన్న ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ చెప్పిందానికి కట్టుబడలేదు. పార్టీలు ఫిరాయించిన నేతలకు బిజద, భాజపా నాయకత్వాలు ప్రాధాన్యమిచ్చాయి. జాబితా ఖరారులో చివరి నిమిషం వరకు మార్పులు, చేర్పులు జరిగాయి. కొందరికి టికెట్లు కేటాయించి తర్వాత మార్చేశారు. దీంతో స్పష్టత లోపించింది. అయోమయం నెలకొంది. ఎట్టకేలకు జాబితాలు ఖరారు కాగా 41 మంది సిటింగ్ ఎమ్మెల్యేలు ఈసారి పోటీ చేసే అవకాశం కోల్పోయారు.
33 మందికి నిరాకరణ
నవీన్ సిటింగ్ ఎమ్మెల్యేల్లో 33 మందికి ఈసారి టికెట్లు కేటాయించలేదు. వీరిలో 9 మంది భార్యలు, కుమారులు, రక్త సంబంధీకులకు అవకాశమిచ్చారు. మంత్రి ఉషాదేవి సొంత నియోజకవర్గం చికిటిలో ఆమె కుమారుడు బిజద అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఎమ్మెల్యేలు ప్రతాప్జెనా, రాజకిశోర్ దాస్, రజనీకాంత్ సింగ్, సంబిత్ రౌత్రాయి, ప్రకాశ్ చంద్ర మాఝి, పూర్ణచంద్ర స్వయిన్, సదాశివ ప్రదాని, సుభ్రత్ తరైలలో కొందరి భార్యలకు, మరికొందరి కొడుకులకు సీఎం అవకాశమిచ్చారు.
ఆరోపణలున్నవారికి టికెట్లు
క్రిమినల్ కేసులు, ఆరోపణలున్న వారికి టికెట్లు కేటాయించబోమన్న బిజద నాయకత్వం చెప్పిందానికి కట్టుబడలేదు. హత్య కేసుల ఆరోపణలు ఎదుర్కొంటున్న కొందరు నేతలు మళ్లీ అభ్యర్థులయ్యారు. మరికొందరు తమ భార్యలు, కొడుకులకు టికెట్లు ఖరారు చేయించుకున్నారు.
భర్త, భార్య, తల్లి, కొడుకు
రెవెన్యూ, విద్యాశాఖల మంత్రి సుధాం మరాండికి సీఎం మయూర్భంజ్ లోక్సభ అభ్యర్థిగా చేశారు. ఆయన భార్య రంజితా మరాండికి మయూర్భంజ్ జిల్లాలోని బంగిరిపోషి అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దించారు. జాజ్పూర్ ఎమ్మెల్యే, బిజద రాజకీయ వ్యవహారాల ప్రత్యేక కార్యదర్శి ప్రణవ ప్రకాష్ దాస్ (బొబి) సంబల్పూర్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తుండగా, ఆయన తల్లి సంధ్యారాణి దాస్ జాజ్పూర్ జిల్లా కొరై అసెంబ్లీ అభ్యర్థి.
భాజపాలో ఒకరు, కాంగ్రెస్లో ముగ్గురు
భాజపాలో ఒకరు, కాంగ్రెస్కు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఈసారి పోటీ నుంచి తప్పుకొని తమ భార్యలు, కుమారులను నిలబెట్టారు. మునుపెన్నడూ లేనంతగా నేతలు పార్టీలు ఫిరాయించారు. వీరిని బిజద, భాజపా నాయకత్వాలు అక్కున చేర్చుకుని టికెట్లు కేటాయించాయి. ప్రధాన పార్టీలు విలువలకు సమాధి కట్టాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బిజద టికెట్ల కేటాయింపులో వి.కార్తికేయ పాండ్యన్, బొబి కీలకపాత్ర పోషించారు. వారికి విధేయులుగా ఉన్నవారికి అవకాశమిచ్చారు. అంకితభావం ఉన్నవారిని పక్కన పెట్టారన్న అసంతృప్తి పార్టీలో ఉంది. తమ పార్టీలో విజయావకాశాలున్న నేతలు పలువురు ఉన్నారని చెప్పుకున్న భాజపా ఆయారాంలకు అందలమెక్కించింది. కాంగ్రెస్ విషయానికొస్తే.. కొత్త ముఖాలను పెద్ద సంఖ్యలో నిలబెట్టింది. కొంతమంది సీనియర్లకు అవకాశమిచ్చింది. కొత్తగా ఎన్నికల బరిలో దిగిన వారిలో ఎంతో మందికి అనుభవం, ప్రజా సంబంధాలు లేవని ఆ పార్టీ కార్యకర్తలంటున్నారు.
గెలుపు గుర్రాలకే టికెట్లు
బిజద రాజ్యసభ ఎంపీ సస్మిత్ పాత్ర్ శుక్రవారం రాత్రి భువనేశ్వర్లో విలేకరులతో మాట్లాడుతూ... గెలుపు గుర్రాలకే నాయకత్వం టికెట్లు కేటాయించినట్లు చెప్పారు. నవీన్ ఆదరణ, ఆకర్షణ పోటీలో ఉన్న పార్టీ అభ్యర్థులకు విజయసోపానాలు అవుతున్నాయని పేర్కొన్నారు.
మోదీ గ్యారంటీ విజయానికి సోపానం
భాజపా రాష్ట్రశాఖ ఉపాధ్యక్షుడు గోలక్ మహాపాత్ర్ శనివారం భువనేశ్వర్లో విలేకరులతో మాట్లాడుతూ.. మోదీ గ్యారంటీ పార్టీ అభ్యర్థుల విజయ సోపానమన్నారు. అర్హులకే టికెట్లు కేటాయించారన్నారు.
ఈసారి అధికారం తథ్యం
పీసీసీ అధ్యక్షుడు శరత్ పట్నాయక్ ఆదివారం నువాపడలో విలేకరులతో మాట్లాడుతూ... ఏఐసీసీ నాయకత్వం ఉత్తమ చరిత్రకలవారిని అభ్యర్థులుగా చేసిందని ఓటర్లు, ఆదరిస్తారన్న ఆశాభావం ఉందన్నారు. కాంగ్రెస్ గ్యారంటీలు విశ్వసిస్తున్న ప్రజలు ఈసారి హస్తానికి గెలిపిస్తారని, కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
[ 18-05-2024]
గంజాం జిల్లా బ్రహ్మపుర సమీపాన చత్రపురంలో కుర్దావైపు వెళుతున్న గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. -
జోయల్, దిలీప్ల మధ్య హోరాహోరీ
[ 18-05-2024]
కేంద్రమాజీ మంత్రి, సుందర్గఢ్ సిటింగ్ ఎంపీ జోయల్ ఓరంకు ఈసారి అగ్నిపరీక్ష ఎదురవుతోంది. -
రాష్ట్రంలో 15 ఎంపీ, 75 కు పైగా అసెంబ్లీ స్థానాలు మావే
[ 18-05-2024]
ఒడిశాలో ఈసారి 15 లోక్సభ, 75కుపైగా అసెంబ్లీ స్థానాల్లో భాజపా విజయం తథ్యమని, తమిళపాలనకిక తెరపడుతుందని కేంద్ర హోం మంత్రి అమిత్షా చెప్పారు. -
రత్నభాండాగారం తాళం చెవి పాండ్యన్ వద్ద ఉంది
[ 18-05-2024]
ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోని పేదలందరికీ ఉచితంగా బియ్యం (రేషన్) ఇస్తున్నారని, ఒడిశా సీఎం నవీన్ ఎన్నికల ముందు రాష్ట్ర ప్రజలకు వట్టి గోనె సంచులిచ్చారని, ఈ సంచులు తమిళనాడులో తయారైనవని అసోం ముఖ్యమంత్రి హిమంత విశ్వశర్మ ఎద్దేవా చేశారు. -
కుందిలిలో కృషి బజార్కు మోక్షమెప్పుడో
[ 18-05-2024]
కనీస సౌకర్యాల కరవు.. శిథిల భవనాలు, నిత్యం వెంటాడుతున్న ట్రాఫిక్ ఇబ్బందులు.. వినియోగానికి నోచుకోని బజార్.. ఇదీ కొరాపుట్ జిల్లాలోని కుందిలి వారపు సంతలో పంటలు విక్రయించేందుకు వచ్చిన అన్నదాతలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. -
19న రాష్ట్రానికి మోదీ
[ 18-05-2024]
ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం (19న) రాత్రి 7 గంటలకు భువనేశ్వర్ రానున్నారు. -
గంజాం జిల్లాకు అదనపు కేంద్ర బలగాలు
[ 18-05-2024]
గంజాం జిల్లా అస్కా లోక్సభ నియోజకవర్గం పరిధిలోని కళ్లికోట అసెంబ్లీ సెగ్మెంట్లో పోలింగుకు ముందు చెలరేగిన రాజకీయ హింస నేపథ్యంలో ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. -
నాలుగున్నర కోట్ల ప్రజలు నా ఊపిరి: నవీన్
[ 18-05-2024]
రాష్ట్రంలోని నాలుగున్నర కోట్ల ప్రజలు తన ఊపిరని, అందరి ప్రయోజనాలకు కట్టుబడి ఉన్నానని, తన పాలనలో అన్ని వర్గాలవారికి న్యాయం జరిగిందని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ చెప్పారు. -
నవీన్జీ... మీకు 25 ఏళ్లు చాల్లేేదా?: ధర్మేంద్ర
[ 18-05-2024]
రాష్ట్రాన్ని 25 ఏళ్లు పాలించిన మీకు ఈ వ్యవధి చాలలేదా? సుదీర్ఘపాలనలో మీరు సాధించిందేమిటి?, ప్రజలకు మౌలిక సౌకర్యాలు సమకూర్చగలిగారా? అంటూ సీఎం నవీన్ను కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రశ్నించారు. -
రాష్ట్రంలో అన్నదాతలకు అన్యాయం: విష్ణుదేవ్
[ 18-05-2024]
నవీన్ పట్నాయక్ పాలనలో ఒడిశాలో అన్నదాతలకు అన్యాయం జరిగిందని, ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు (ఎంఎస్పీ) కల్పించడంలో విఫలమయ్యారని ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయె అన్నారు. -
ముగ్గురు భాజపా నేతలపై వేటు
[ 18-05-2024]
-
నిందితుడ్ని తప్పించే యత్నం పోలీసు స్టేషన్లోకి చొరబాటు
[ 18-05-2024]
గంజాం జిల్లాలో శాంతిభద్రతలకు తీవ్ర విఘాతం కలుగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
పల్నాడులో హింసాత్మక ఘటనలపై భారీగా కేసులు నమోదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
రాహుల్ వద్ద ఉన్నది చైనా రాజ్యాంగం : బిశ్వశర్మ పోస్ట్
-
పుతిన్ పర్యటన వేళ.. చైనాకు జెలెన్స్కీ అభ్యర్థన
-
మోదీ వ్యాఖ్యలపై ఈసీ చర్యలు తీసుకోవాలి: మల్లికార్జున్ ఖర్గే
-
రీడర్స్ డైజెస్ట్.. యూకేలో ముగిసిన 86 ఏళ్ల ప్రయాణం