logo

ప్రేమ జంట ఆత్మహత్య

ఒడిశా, ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతంలో ఉన్న అడవిలోని పొలిమేర సమీపంలో చెట్టుకు వేలాడుతున్న ప్రేమికుల మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Published : 05 May 2024 16:19 IST

నవరంగ్‌పూర్‌: ఒడిశా, ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతంలో ఉన్న అడవిలోని పొలిమేర సమీపంలో చెట్టుకు వేలాడుతున్న ప్రేమికుల మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చందహండి సమితి మాలిగార ఈఈసీగేశ్వర్ ఖోస్లా తెలిపిన వివరాలు ప్రకారం.. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం దెబోగ్ రాణా పరిధిలో ఉన్న కలకుముడి గ్రామునికి చెందిన సుశీల్ కుమార్ జాదవ్(24) చందన జాదవ్ (24) మధ్య ప్రేమ వ్యవహారం నడిచింది. ఇద్దరు పెళ్లి చేసుకుందామని పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. ఇరువురి కులాలు వేర్వేరు కావటంతో కుటుంబసభ్యులు వారి వివాహాన్ని అంగీకరించలేదు. దీంతో ప్రేమికులు ఇద్దరు ఏప్రిల్ 15న ఇంటి నుంచి పారిపోయారు. తమ పిల్లలు కనిపించటంలేదని ఇరువురి కుటుంబసభ్యులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆదివారం ఉదయం జెబోగ్ గ్రామానికి చెందిన కొందరు మంలగావ్ అడవిలో బీడీ ఆకులు సేకరించేందుకు వెళ్లి చెట్టుకు వేలాడుతున్న మృతదేహాలను చూసి పోలీసులకు సమాచారం అందించారు, మలగావ్ అటవీ ప్రాంతం చంద్రహండి పరిధిలోకి వస్తుందని, అక్కడ పోలీస్టేషన్‌లో కుటుంబసభ్యులు ఫిర్యాదులు చేయాలని డెబోస్ ఈఈసీ గౌతమ్ గడ్డ తెలియజేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని