భాజపా మేనిఫెస్టో విడుదల
రాష్ట్రంలో బిజద అవినీతి పాలనకు తెరదించడానికి కృషి చేస్తున్న భాజపా అభివృద్ధే ఎజెండాగా చేసుకుందని, మోదీ గ్యారంటీని ‘విజన్ డాక్యుమెంట్’గా అమలు పరుస్తామని భాజపా కేంద్రశాఖ అధ్యక్షుడు జె.పి.నడ్డా చెప్పారు. ఆదివారం సాయంత్రం భువనేశ్వర్ వచ్చిన ఆయన ఓ హోటల్లో పార్టీ మేనిఫెస్టో విడుదల చేశారు.
భువనేశ్వర్, న్యూస్టుడే
ప్రసంగిస్తున్న జె.పి.నడ్డా
రాష్ట్రంలో బిజద అవినీతి పాలనకు తెరదించడానికి కృషి చేస్తున్న భాజపా అభివృద్ధే ఎజెండాగా చేసుకుందని, మోదీ గ్యారంటీని ‘విజన్ డాక్యుమెంట్’గా అమలు పరుస్తామని భాజపా కేంద్రశాఖ అధ్యక్షుడు జె.పి.నడ్డా చెప్పారు. ఆదివారం సాయంత్రం భువనేశ్వర్ వచ్చిన ఆయన ఓ హోటల్లో పార్టీ మేనిఫెస్టో విడుదల చేశారు.
- యువత, మహిళలు, అన్నదాతలు, పేదల వికాసానికి పెద్దపీట.
- ‘సుభద్ర’ పథకం కింద ప్రతి, మహిళకు రూ.50 వేల నగదు వోచర్లు చెల్లిస్తాం, బ్యాంకుల్లో ఈ సొమ్ము తీసుకోవచ్చు.
- 25 లక్షల మంది మహిళలకు ‘లక్షపతి దీదీ’ లుగా చేస్తాం. అంకురాలు ప్రారంభిస్తాం.
- 2029లోగా 3.5 లక్షల మంది యువతీ యువకులకు ప్రభుత్వోద్యోగాలు.
- మహిళా స్వయం సహాయక సంఘాల (ఎస్హెచ్జీ)తో 500 ఎంఎస్ఎంఈల స్థాపన.
- రాష్ట్రానికి 15 లక్షల పీఎంఏవై ఇళ్లు, పట్టణ ప్రాంతాల్లోని బస్తీల్లో ఉంటున్న పేదకుటుంబాలకు 600 చదరపు అడుగుల ఉచిత స్థలాలు.
- విపత్తుల కాలంలో ఉపాధి కోల్పోతున్న మత్స్యకారులకు రూ.10 వేలు చొప్పున నగదు చెల్లింపులు.
- 75,000 గ్రామాలకు ప్రపంచస్థాయి రోడ్డు సౌకర్యం.
- పంటపొలాలకు సాగునీరు, శీతల గిడ్డంగులకు ప్రాధాన్యం, ధాన్యం క్వింటాలుకు రూ.3,100లు కొనుగోలు, మండీల్లో అవినీతి నిర్మూలన.
- మంచాన పడ్డ ప్రభుత్వాసుపత్రుల ఆధునికీకరణ, వైద్య సిబ్బంది నియామకం, డయాలిసిస్ సౌకర్యాలు.
- అధికారానికి వచ్చిన 18 నెలల్లో చిట్ఫండ్ బాధితులకు చెల్లింపులు.
- ఖనిజ సంపద సద్వినియోగం చేస్తాం, వలసలు పూర్తిగా నివారిస్తాం.
- వృద్ధులు, వితంతువులు, దివ్యాంగుల పింఛన్లు రూ.3 వేలు చేస్తాం.
- అధికారానికి వచ్చిన తొలి రోజు పూరీ జగన్నాథుని రత్న బాంఢాగారం తెరిపిస్తాం. సంపద లెక్కింపు చేయిస్తాం. శ్రీక్షేత్రం నాలుగు ద్వారాలు తెరుస్తాం. భక్తులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలు కల్పిస్తాం. కారిడార్ పనుల్లో తొలగించిన మఠాలు పునర్నిర్మాణం చేయిస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జోయల్, దిలీప్ల మధ్య హోరాహోరీ
[ 18-05-2024]
కేంద్రమాజీ మంత్రి, సుందర్గఢ్ సిటింగ్ ఎంపీ జోయల్ ఓరంకు ఈసారి అగ్నిపరీక్ష ఎదురవుతోంది. -
రాష్ట్రంలో 15 ఎంపీ, 75 కు పైగా అసెంబ్లీ స్థానాలు మావే
[ 18-05-2024]
ఒడిశాలో ఈసారి 15 లోక్సభ, 75కుపైగా అసెంబ్లీ స్థానాల్లో భాజపా విజయం తథ్యమని, తమిళపాలనకిక తెరపడుతుందని కేంద్ర హోం మంత్రి అమిత్షా చెప్పారు. -
రత్నభాండాగారం తాళం చెవి పాండ్యన్ వద్ద ఉంది
[ 18-05-2024]
ప్రధాని నరేంద్ర మోదీ దేశంలోని పేదలందరికీ ఉచితంగా బియ్యం (రేషన్) ఇస్తున్నారని, ఒడిశా సీఎం నవీన్ ఎన్నికల ముందు రాష్ట్ర ప్రజలకు వట్టి గోనె సంచులిచ్చారని, ఈ సంచులు తమిళనాడులో తయారైనవని అసోం ముఖ్యమంత్రి హిమంత విశ్వశర్మ ఎద్దేవా చేశారు. -
కుందిలిలో కృషి బజార్కు మోక్షమెప్పుడో
[ 18-05-2024]
కనీస సౌకర్యాల కరవు.. శిథిల భవనాలు, నిత్యం వెంటాడుతున్న ట్రాఫిక్ ఇబ్బందులు.. వినియోగానికి నోచుకోని బజార్.. ఇదీ కొరాపుట్ జిల్లాలోని కుందిలి వారపు సంతలో పంటలు విక్రయించేందుకు వచ్చిన అన్నదాతలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. -
19న రాష్ట్రానికి మోదీ
[ 18-05-2024]
ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం (19న) రాత్రి 7 గంటలకు భువనేశ్వర్ రానున్నారు. -
గంజాం జిల్లాకు అదనపు కేంద్ర బలగాలు
[ 18-05-2024]
గంజాం జిల్లా అస్కా లోక్సభ నియోజకవర్గం పరిధిలోని కళ్లికోట అసెంబ్లీ సెగ్మెంట్లో పోలింగుకు ముందు చెలరేగిన రాజకీయ హింస నేపథ్యంలో ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. -
నాలుగున్నర కోట్ల ప్రజలు నా ఊపిరి: నవీన్
[ 18-05-2024]
రాష్ట్రంలోని నాలుగున్నర కోట్ల ప్రజలు తన ఊపిరని, అందరి ప్రయోజనాలకు కట్టుబడి ఉన్నానని, తన పాలనలో అన్ని వర్గాలవారికి న్యాయం జరిగిందని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ చెప్పారు. -
నవీన్జీ... మీకు 25 ఏళ్లు చాల్లేేదా?: ధర్మేంద్ర
[ 18-05-2024]
రాష్ట్రాన్ని 25 ఏళ్లు పాలించిన మీకు ఈ వ్యవధి చాలలేదా? సుదీర్ఘపాలనలో మీరు సాధించిందేమిటి?, ప్రజలకు మౌలిక సౌకర్యాలు సమకూర్చగలిగారా? అంటూ సీఎం నవీన్ను కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రశ్నించారు. -
రాష్ట్రంలో అన్నదాతలకు అన్యాయం: విష్ణుదేవ్
[ 18-05-2024]
నవీన్ పట్నాయక్ పాలనలో ఒడిశాలో అన్నదాతలకు అన్యాయం జరిగిందని, ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు (ఎంఎస్పీ) కల్పించడంలో విఫలమయ్యారని ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయె అన్నారు. -
ముగ్గురు భాజపా నేతలపై వేటు
[ 18-05-2024]
-
నిందితుడ్ని తప్పించే యత్నం పోలీసు స్టేషన్లోకి చొరబాటు
[ 18-05-2024]
గంజాం జిల్లాలో శాంతిభద్రతలకు తీవ్ర విఘాతం కలుగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఈఏపీ సెట్ ఫలితాలు.. టాప్ 10 ర్యాంకర్లు వీరే..
-
మాలీవాల్ను బయటకు పంపిన భద్రతా సిబ్బంది.. కేజ్రీవాల్ నివాసం నుంచి మరో వీడియో
-
విచక్షణ మరిచి.. చొక్కాలు పట్టుకుని ఎత్తిపడేసి: తైవాన్ పార్లమెంట్లో ఎంపీల కొట్లాట
-
కేసు పెడితే పెట్టుకోండి.. నా స్థలాన్ని కాపాడుకుంటా: మల్లారెడ్డి
-
ఇక నేను మా మామ ఒకటే జట్టు.. రోహిత్కే మద్దతు: కేఎల్ రాహుల్
-
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..