logo

సంక్షేమ కార్యక్రమాలు ఆగవు

భాజపా అధికారానికొస్తే రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోతాయని బిజద నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని, దీన్ని నమ్మొద్దని భాజపా కేంద్రశాఖ ఉపాధ్యక్షుడు, కేంద్రపడ లోక్‌సభ అభ్యర్థి బైజయంత్‌ పండా చెప్పారు.

Updated : 08 May 2024 01:36 IST

బైజయంత్‌

బైజయంత్‌ పండా

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: భాజపా అధికారానికొస్తే రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోతాయని బిజద నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని, దీన్ని నమ్మొద్దని భాజపా కేంద్రశాఖ ఉపాధ్యక్షుడు, కేంద్రపడ లోక్‌సభ అభ్యర్థి బైజయంత్‌ పండా చెప్పారు. మంగళవారం భువనేశ్వర్‌ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... నవీన్‌ ప్రభుత్వం ఇంతవరకు అమలు చేసిన పథకాలన్నీ కేంద్రానివని, నిధులు కేంద్రం నుంచే వస్తున్నాయని వివరించారు. ఈసారి పరాజయం తథ్యమని తెలిసిన నవీన్‌, కార్తికేయ పాండ్యన్‌ హెలికాప్టర్లలో తిరుగుతూ ప్రజలకు అవాస్తవాలు చెబుతున్నారన్నారు. జూన్‌ 10న ప్రజల సమక్షంలో భాజపా ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేస్తుందని, మోదీ విజన్‌ ప్రకారం పాలన సాగుతుందని, రిమోట్‌ ప్రజల చేతుల్లో ఉంటుందన్నారు. మేనిఫెస్టోలో చెప్పినవన్నీ అమలవుతాయని, యువత, మహిళలు, అన్నదాతల భవితకు గ్యారంటీ ఉంటుందని చెప్పారు. సమావేశంలో భాజపా అధికార ప్రతినిధి సజ్జన్‌ శర్మ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని