బెండపూడి పిల్లల్లా..విజయనగరం అనేదెన్నడో?
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో బెండపూడి అభ్యసన విధానం అమలు చేయాలని, ప్రతి ఉపాధ్యాయుడు చరవాణిలో ‘గూగుల్ రీడ్ లాంగ్ యాప్’ ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. ఈ నేపథ్యంలో జిల్లాలో
చదవడం, రాయడంపై సర్వే నిర్వహిస్తున్న జిల్లా కమిటీ సభ్యులు (పాత చిత్రం)
హాయ్ సర్.. వియ్ ఆర్ ఫ్రమ్ బెండపూడి.. అంటూ ఆంగ్లంలో అదరగొట్టారు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు. ఇప్పుడు ఏ విద్యార్థి నోట విన్నా.. ఏ ఇద్దరు ఉపాధ్యాయులు కలిసినా వీరి గురించే. రాష్ట్రంలో ఇన్ని బడులు ఉండగా.. అక్కడే ఎందుకు అంత చక్కగా మాట్లాడుతున్నారు అన్నదే చర్చ.
మరి మన దగ్గరో..
ఉమ్మడి విజయనగరం జిల్లా విద్యార్థులు ఆంగ్లంలో వెనుకబాటు కనిపిస్తోంది. సగటున 40 శాతం మందికి చదవడం, రాయడం రాదని డైట్ చేసిన సర్వేలో తేటతెల్లమైంది. ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడిన బెండపూడి విద్యార్థులతో పోల్చితే ఎంతో వ్యత్యాసం ఉంది. అక్కడున్న విద్యా విధానాలు జిల్లాకు పూర్తి భిన్నమనే చెప్పొచ్చు. - న్యూస్టుడే, విజయనగరం విద్యావిభాగం
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో బెండపూడి అభ్యసన విధానం అమలు చేయాలని, ప్రతి ఉపాధ్యాయుడు చరవాణిలో ‘గూగుల్ రీడ్ లాంగ్ యాప్’ ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. ఈ నేపథ్యంలో జిల్లాలో ఆంగ్లం అభివృద్ధి కాకపోవడానికి కారణాలు, నేర్చుకునేందుకు విద్యార్థులు పడుతున్న ఇబ్బందులపై ‘న్యూస్టుడే’ కథనం.
కాకినాడ జిల్లా బెండపూడిలో ఆంగ్లం కోసం ఆరేళ్ల కిందటే ప్రత్యేక ప్రాజెక్టును రూపొందించారు. ప్రయోగశాలను ఏర్పాటు చేయడంతో ఉత్తమ ఫలితాలు వచ్చాయి. మన దగ్గర ఎక్కడా ల్యాబ్లు లేవు. నిర్ణీత పీరియడ్లలోనే బోధిస్తున్నారు. భావ వ్యక్తీకరణ నైపుణ్యాల ఊసే లేదు. తరగతి గదుల్లో సాంకేతిక పరిజ్ఞానం కానరాదు. ప్రత్యేకంగా ఉపాధ్యాయుల నియామకం ఉండదు. ఫలితంగా విద్యార్థులు ఆంగ్లమంటేనే భయపడుతున్నారు.
మాట్లాడే ఉపాధ్యాయులేరీ
ఆంగ్ల ఉపాధ్యాయుల కొరత ఉంది. ఉన్న వారు కూడా ఆంగ్లంలో మాట్లాడరు. కొందరిలో ప్రతిభ ఉన్నా బోధనకు అనాసక్తత చూపుతున్నారు. జిల్లాలో ప్రస్తుతమున్న 4,478 ఎస్జీటీల్లో సుమారు 1500 మందే ఆంగ్లంలో మెథడాలజీ, ఎం.ఎ. ఆంగ్లం వంటి కోర్సులు పూర్తిచేశారు. పాఠశాల సహాయకుల్లో 471 మంజూరు పోస్టులకు 440 మంది పనిచేస్తున్నారు. ఇంకా 31 ఖాళీలున్నాయి.
మన తర‘గతి’ ఇంతే..
తరగతి గదిలో అంతర్జాలం, ల్యాప్ట్యాప్లు, మైక్రోఫోన్లు ఉండాలి. వీటి ద్వారా బెండపూడి తరహాలో విదేశీయులతో మాట్లాడించాలి. జిల్లా విషయానికొస్తే ఎక్కడా ఇవి లేవు. గతంలో కంప్యూటర్ విద్యను తీసుకొచ్చినా ఉపాధ్యాయుల తొలగింపుతో మూలకు చేరింది. డిజిటల్ తరగతులు 471, స్మార్ట్ తరగతులు 32, వర్చువల్ తరగతులు 166 పాఠశాలల్లో ఉన్నప్పటికీ మూలకు చేరాయి.
సర్వేలో ఇలా..
చదవడం, రాయడంపై జిల్లా విద్యా శిక్షణ సంస్థ (డైట్) గత నెలలో జిల్లాలో నాలుగుచోట్ల సర్వే నిర్వహించింది. బాగా చదవడం రాయడం వచ్చిన వారు, కొంతవరకు చదవడం రాయగలిగినవారు, రెండూ రానివారు ఏ, బి, సి గ్రూపులుగా విభజించారు. సర్వేలో ఆయా పాఠశాలల్లో ఆంగ్లభాష ప్రగతి దారుణంగా ఉందని తేలింది.
నైపుణ్యాలపై శిక్షణ ఇవ్వాలి
ఉపాధ్యాయులకు ఆంగ్లంలో మాట్లాడే విధానంపై తగిన శిక్షణ ఇవ్వలేదు. భాషా నైపుణ్యాలపై ఏడాదికి కనీసం పదిరోజుల పాటు శిక్షణ ఇవ్వాలి. ల్యాబ్లు ఏర్పాటు చేసి, విద్యార్థులతో ప్రయోగాలు చేయించాలి. ప్రత్యేకంగా ఉపాధ్యాయులను కూడా నియమించాలి. - కుసుమన్న, ఆంగ్లం పాఠశాల సహాయకుడు
విద్యార్థుల్లో ఆసక్తి కలిగించాలి
ఇంగ్లిషు నేర్చుకునేలా విద్యార్థుల్లో ఆసక్తి కలిగించాలి. కృత్యాలు అందించాలి. నిజ జీవితంలో పరిచయమున్న పదాలు, వాక్యాలు మొదటగా నేర్పుతూ భాషపై పట్టు సాధించేలా తరగతి గదిలో వాతావరణం కల్పించాలి. వనరులు, పుస్తకాలు, చిన్న వాక్యాలు గల కార్డులు, పదాలు అందుబాటులో ఉంచాలి. చదవడం, రాయడం, గుర్తుపట్టడం, మౌఖిక కృత్యాలు తరచుగా నేర్పించాలి. చిత్రాలు, సన్నివేశాలు, పదకేళి, ఆటలు, కృత్యాలు ద్వారా నేర్చుకునేలా చూడాలి.
- ఎ.ప్రవీణ్కుమార్, ఆంగ్లం ఉపాధ్యాయుడు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చిలకలపల్లి విద్యార్థికి తెలంగాణ ఈఏపీసెట్లో రెండో ర్యాంకు
[ 18-05-2024]
బలిజిపేట మండలం చిలకలపల్లి గ్రామానికి చెందిన నగుదాసరి రాధాకృష్ణ సత్తా చాటాడు. -
వేణుగోపాలుడికి ప్రత్యేక పూజలు
[ 18-05-2024]
చిలకలపల్లి వేణుగోపాలస్వామి ఆలయంలో స్వామివారికి అర్చలకు కె.రాంబాబు శనివారం పంచామృతాభిషేకాలు నిర్వహించిన అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. -
‘ఈనాడు’ కథనానికి స్పందన
[ 18-05-2024]
మండలంలోని చిలకలపల్లి-జనార్ధనవలస గ్రామాల మధ్య రెండు చోట్ల విరిగిపోయిన తాగునీటి పైపులను నీటిసరఫరా విభాగం అధికారులు శనివారం మార్పిడి చేశారు. -
కనీస మౌలిక సదుపాయాలు కల్పించండి
[ 18-05-2024]
మండుటెండలో ఉపాధి పనులు చేస్తున్న ఉపాధి కూలీలకు అధికారులు కనీస సదుపాయాలు కల్పించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి యమ్మల మన్మథరావు డిమాండు చేశారు. -
నిబంధనలు తొక్కి‘పెట్టే’శారు
[ 18-05-2024]
విజయనగరం అర్బన్, గ్రామీణం: గురువారం మధ్యాహ్నం 3 గంటలు.. విజయనగరం తహసీల్దారు కార్యాలయం.. ఈ ఎన్నికల్లో నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఆఫీసు. ఇక్కడే పోస్టల్ బ్యాలెట్ స్ట్రాంగ్రూమ్ ఉంది. -
ప్రజలకు అందుబాటులో ఉంటాం
[ 18-05-2024]
కూటమిదే విజయమని, నియోజకవర్గ ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ సేవ చేస్తానని కురుపాం కూటమి అభ్యర్థిని తోయక జగదీశ్వరి అన్నారు. -
19 నుంచి తోటపల్లిలో కల్యాణ వేడుకలు
[ 18-05-2024]
తోటపల్లి వేంకటేశ్వర కోదండ రామాలయం దేవస్థానంలో ఈ నెల 19 నుంచి 23 వరకు సీతారామస్వామి వార్షిక కల్యాణ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు దేవస్థానం ఈవో వి.వి.సూర్యనారాయణ తెలిపారు. -
ఏటా రూ.కోట్లు.. పనులకు తూట్లు
[ 18-05-2024]
సాలూరు పట్టణంలోని గాంధీనగర్ నుంచి కొంకివీధి, వేదసమాజం, నాయుడువీధి, శివాజీ, బోసుబొమ్మ కూడలి వరకు ఉండే వన్వే దారి ఇది. అడుగడుగునా గుంతలతో అధ్వానంగా మారింది. -
ఇదే.. సాలూరు స్మార్ట్ టౌన్షిప్
[ 18-05-2024]
జగనన్న స్మార్ట్ టౌన్షిప్లో మధ్య ఆదాయ వర్గాలు, ఉద్యోగులు, ప్రభుత్వ పింఛనుదారులకు తక్కువ ధరకే ఇళ్ల స్థలాలను ప్రభుత్వం సాలూరులో పట్టణ జాతీయ రహదారి పక్కన కేటాయించింది -
ఆందోళనకు గురువులు సిద్ధం
[ 18-05-2024]
పోలింగ్ విధుల్లో పాల్గొన్న ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి సంఘాలు ఆందోళనకు సిద్ధమయ్యాయి. -
రాష్ట్రంలో ఈవీఎంలకు భద్రత లేదు
[ 18-05-2024]
రాష్ట్రంలో జరుగుతున్న దాడులు, దౌర్జన్యకాండను దృష్టిలో ఉంచుకొని ఓట్ల లెక్కింపు రోజున ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టాలని లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ డిమాండు చేశారు. -
బొగ్గు వ్యాగన్ నుంచి పొగలు
[ 18-05-2024]
ఆగి ఉన్న గూడ్స్ రైలు నుంచి పొగలు రావడంతో రైల్వే సిబ్బంది అప్రమత్తమై ప్రమాదాన్ని నిలువరించిన సంఘటన శుక్రవారం గజపతినగరం రైల్వే స్టేషన్లో చోటుచేసుకుంది -
చిరుధాన్యాల సరస్వతికి జాతీయస్థాయి గుర్తింపు
[ 18-05-2024]
సబల స్వచ్ఛంద సంస్థ కార్యదర్శి, చిరుధాన్యాల చెల్లెళ్ల సంఘం వ్యవస్థాపకురాలు మల్లువలస సరస్వతికి జాతీయస్థాయి గుర్తింపు దక్కింది. -
కన్నీటి సంద్రం
[ 18-05-2024]
ఉమ్మడి జిల్లాలో శుక్రవారం జరిగిన వివిధ ఘటనల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. గజపతినగరం, జియ్యమ్మవలస, బొండపల్లి మండలాల్లో రోడ్డు ప్రమాదాల కారణంగా ముగ్గురు మృత్యువాత పడ్డారు. -
దిబ్బలపాలెంలో పులి సంచారం..?
[ 18-05-2024]
భోగాపురం మండలంలోని దిబ్బలపాలెం, కవులవాడ పరిసర ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ప్చ్..ఇదేం నిర్వహణ?
[ 18-05-2024]
ఉమ్మడి జిల్లాలోని నగరపాలక సంస్థ, పురపాలక, నగర పంచాయతీల్లో కాలువల తీరు ఆందోళన కలిగిస్తోంది. నిర్వహణ, పారిశుద్ధ్య పనులకు ఏటా రూ.లక్షల్లో ఖర్చు చేస్తున్నా పరిస్థితి మారడం లేదు.
తాజా వార్తలు (Latest News)
-
అఫ్గాన్లో వరదల బీభత్సం.. 68 మంది మృతి..!
-
‘50-60 ఏళ్ల క్రితం నేను ఇల్లు వదిలి వెళ్లినప్పుడు.. ఇలా అనుకోలేదు’: మోదీ కీలక వ్యాఖ్యలు
-
ఆ విషయంలో నేను ఫెయిల్ అయ్యానేమో: సుధీర్ బాబు
-
పల్నాడులో హింసాత్మక ఘటనలపై భారీగా కేసులు నమోదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
రాహుల్ వద్ద ఉన్నది చైనా రాజ్యాంగం : బిశ్వశర్మ పోస్ట్