భాజపా, వైకాపా వర్గాల మధ్య కొట్లాట
నెల్లిమర్లలో సోమవారం భాజపా, వైకాపా కార్యకర్తల మధ్య కొట్లాట చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. బిర్యానీ తగాదా ఘర్షణకు దారితీసింది. ఇక్కడ కొత్తపేట సమీపంలో భాజపా కార్యకర్తలకు మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేశారు.
బిర్యానీ విషయమై తగాదా..పలువురికి గాయాలు
ఎస్ఐతో మాట్లాడుతున్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు
నెల్లిమర్ల, న్యూస్టుడే: నెల్లిమర్లలో సోమవారం భాజపా, వైకాపా కార్యకర్తల మధ్య కొట్లాట చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల వివరాల ప్రకారం.. బిర్యానీ తగాదా ఘర్షణకు దారితీసింది. ఇక్కడ కొత్తపేట సమీపంలో భాజపా కార్యకర్తలకు మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేశారు. ఆ సమయంలో వైకాపా సానుభూతిపరుడు బిర్యానీ కోసం వెళ్లి గొడవ పడ్డాడు. భాజపా కార్యకర్తలు కొట్టడంతో అతనికి స్వల్పగాయాలయ్యాయి. దీనిపై బాధితుడు వార్డు కౌన్సిలర్ మైపాడ ప్రసాద్కు ఫిర్యాదు చేయగా.. ఆయన కార్యకర్తలతో కలసి అక్కడికి వెళ్లి ప్రశ్నించడంతో మళ్లీ దాడికి పాల్పడ్డారు. దాంతో ఆయన చేతికి గాయమైంది. ఈ విషయం తెలిసి వైకాపా కార్యకర్తలు, బంధువులు అక్కడికి చేరుకున్నారు. ఈ కొట్లాటలో పలువురు భాజపా కార్యకర్తలు గాయపడ్డారు. ఆ తర్వాత పోలీసులు రంగంలోకి దిగి అందరిని చెదరగొట్టారు. ఈ ఘటనపై డీఎస్పీ త్రినాథరావు విచారణ జరిపారు. ఇరువర్గాలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులకు భాజపా ఫిర్యాదు
భాజపా కార్యకర్తలపై దాడి చేసినవారు ఎంతటివారైనా క్షమించేది లేదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ఈ ఘటనపై నెల్లిమర్ల పోలీసుస్టేషన్కు వెళ్లి ఆయన ఫిర్యాదు చేశారు. దోషులను అదుపులోకి తీసుకోకపోతే పోలీసుస్టేషన్ వద్ద నిరసనకు దిగుతామన్నారు. తమ కార్యకర్తలపై దాడికి దిగినవారిని, మద్దతు పలికినవారిని వదిలిపెట్టేది లేదని పేర్కొన్నారు. ఆయన వెంట ఎమ్మెల్సీ పి.మాధవ్, ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి పావని, నాయకులు ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగనాసురుడి పన్నాగం.. పండుటాకుల విలాపం
[ 04-05-2024]
ఎందరో అభాగ్యులకు పింఛనే ఆధారం. ఆ డబ్బులు వస్తేనే పూట గడిచేది. అనారోగ్యంతో బాధపడుతున్న వారు మరెందరో.. ఆ సొమ్ములతోనే మందులు కొనుక్కొని ప్రాణాలు నిలబెట్టుకునేది.. -
గద్దెనెక్కావ్.. చెరబట్టావ్
[ 04-05-2024]
ఆయనో పెద్దన్న.. అధికారం.. అహంకారం.. ఆక్రమణలు.. ఒక్కటేమిటి.. అతడు చేయని దౌర్జన్యం లేదు.. ఆవు చేలో మేస్తే.. దూడ గట్టున మేస్తుందా.. అతడి హయాంలో అనుచరులు.. ఆ పార్టీ నాయకులదీ అదే తీరు.. ఈ ఐదేళ్లలో పాలనను.. ప్రజా సమస్యలను పక్కనెట్టి.. తవ్వకాలు, ఆక్రమణలపైనే దృష్టి పెట్టారు. -
జగన్మోసం ఇంటింత కాదయా!
[ 04-05-2024]
పదేళ్ల కిందట సంభవించిన హుద్హుద్ తుపాను జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. తీరంతో పాటు వందలాది గ్రామాల్లో బీభత్సం సృష్టించి తీవ్ర నష్టం మిగిల్చింది. -
తరుణీ.. ఛీకొట్టాల్సిన తరుణమిదే!
[ 04-05-2024]
మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. నువ్వా నేనా అన్నట్లు అభ్యర్థులు ప్రచారాలకు పదును పెడుతున్నారు. అధికార పార్టీ మహిళా ఓట్లపై దృష్టి పెట్టి తాయిలాల పంపిణీకి పథకాలు రూపొందిస్తోంది. నోటిఫికేషన్ రాక ముందే ఉమ్మడి జిల్లాకు చెందిన ఒక అభ్యర్థి మహిళలకు చీర, రూ.500 నోటు పంపిణీ చేస్తున్న వీడియో ఇటీవల చక్కర్లు కొట్టింది. -
ఆమె నేత్రాలు సజీవం
[ 04-05-2024]
మనిషి మరణించాక.. దేహంతో పాటు నేత్రాలను మట్టిలో కలిపేయడం కంటే వాటిని దానం చేస్తే మరో ఇద్దరికి కంటిచూపును ప్రసాదించొచ్చు. రాజాం మండలం పెనుబాక గ్రామానికి చెందిన బండి సత్యవతి (73) వయోభారంతో గురువారం మృతి చెందగా కుటుంబ సభ్యులు ఆమె నేత్రాలు దానం చేసేందుకు ముందుకు వచ్చారు. -
అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య
[ 04-05-2024]
అప్పుల బాధ తాళలేక చున్నీతో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడిన ఘటన చందులూరు గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై ఆర్.గోపాలరావు తెలిపిన వివరాల ప్రకారం.. చందులూరు గ్రామానికి చెందిన వాడబోయిన అప్పలరాజు (36) అప్పులు చేసి తీర్చలేక అవస్థలు పడుతున్నాడు. -
కూటమితోనే రాష్ట్రానికి భవిష్యత్తు
[ 04-05-2024]
కూటమి విజయంతోనే రాష్ట్రానికి భవిష్యత్తు అని జిల్లాలోని సాలూరు, పాలకొండ, పార్వతీపురం, కురుపాం నియోజకవర్గాల కూటమి అభ్యర్థులు గుమ్మిడి సంధ్యారాణి, నిమ్మక జయకృష్ణ, బోనెల విజయచంద్ర, తోయక జగదీశ్వరి అన్నారు. -
దళితవాడలని వదిలేశారా?
[ 04-05-2024]
పురపాలక పరిధిలోని ఎక్కువ జనాభా ఉన్న దళితవాడ నందమూరి కాలనీ సమస్యలు నెలవుగా మారింది. ఇక్కడి నివాసితులు శిథిÅల గృహాల్లో భయంతో జీవనం సాగిస్తున్నారు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత దళితులకు 150 గృహాలతో నందమూరి కాలనీ నిర్మించారు. -
పాలకా.. ఇది మీ పాపమే
[ 04-05-2024]
భామిని మండలంలోని అంపోలు-బత్తిలి మార్గంలో కొరమ నుంచి బత్తిలి వరకు వెళ్లాలంటే నరకయాతన పడాల్సి వస్తోంది. ఆరు నెలల కిందట రోడ్డును పూర్తిగా తవ్వేశారు. తారురోడ్డు వేయకుండా అలాగే వదిలేయడంతో దుమ్ము రేగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
లైంగిక దౌర్జన్యం కేసు.. ప్రజ్వల్ రేవణ్ణ ఇంటికి సిట్
-
రింకుకు అందుకే చోటు దక్కలేదు.. బెస్ట్ టీమ్ సెలక్షన్: గంగూలీ
-
విరాట్ స్ట్రైక్రేట్పై విమర్శల్లో వారిది ద్వంద్వ వైఖరి: భారత మాజీ క్రికెటర్లు
-
ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు ఎత్తివేత.. ఎన్నికల వేళ కేంద్రం నిర్ణయం
-
17మంది రోగులను హత్య చేసిన నర్సు..700 ఏళ్ల జైలు శిక్ష
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM