logo

అయిదు పదుల వయసులోనూ పది పరీక్షకు హాజరు

చదువుకోవాలనే తపన ఉండాలే కాని వయసుతో సంబంధం లేదని నిరూపిస్తున్నారు గుమ్మలక్ష్మీపురం మండలంలోని మూలపాడుకు చెందిన పెద్దమ్మి.

Published : 19 Mar 2024 04:12 IST

న్యూస్‌టుడే, గుమ్మలక్ష్మీపురం: చదువుకోవాలనే తపన ఉండాలే కాని వయసుతో సంబంధం లేదని నిరూపిస్తున్నారు గుమ్మలక్ష్మీపురం మండలంలోని మూలపాడుకు చెందిన పెద్దమ్మి. ప్రస్తుతం ఆమె వయసు 53 ఏళ్లు. సోమవారం నుంచి ప్రారంభమైన పదో తరగతి సార్వత్రిక పరీక్ష రాసేందుకు భద్రగిరి ఏపీఆర్‌ కేంద్రానికి వచ్చారు. అనివార్య కారణాలతో ఏడో తరగతిలో చదువు మానేశానని, ఆసక్తి ఉండటంతో మళ్లీ పరీక్షలకు వస్తున్నానని పెద్దమ్మి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని