logo

తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధిగా గొంప కృష్ణ

తెదేపా రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న శృంగవరపుకోట నియోజకవర్గానికి చెందిన గొంప కృష్ణను రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నియమించారు.

Published : 15 Apr 2024 03:18 IST

శృంగవరపుకోట, న్యూస్‌టుడే: తెదేపా రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న శృంగవరపుకోట నియోజకవర్గానికి చెందిన గొంప కృష్ణను రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నియమించారు. కృష్ణ శృంగవరపుకోట అసెంబ్లీ టికెట్‌ ఆశించారు. కోళ్ల లలితకుమారికి ఇచ్చి ఈయనకు అధిష్ఠానం నచ్చజెప్పింది. ఇటీవల వైకాపా నుంచి తెదేపాలో చేరిన ఎమ్మెల్సీ రఘురాజు సతీమణి ఇందుకూరి సుధారాజు, మండలానికి చెందిన రాయవరపు చంద్రశేఖర్‌లను పార్టీ రాష్ట్ర కార్యదర్శులుగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఆ పార్టీ నాయకులు, శ్రేణులు వీరికి అభినందనలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని