logo

తెదేపాతోనే గిరిజన సమస్యల పరిష్కారం

తెదేపా అధికారంలోకి వస్తేనే గిరిజనుల కష్టాలు తీరుతాయని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిని గుమ్మిడి సంధ్యారాణి అన్నారు.

Published : 30 Apr 2024 04:43 IST

గిరిజనులతో కలిసి డప్పు కొట్టి, సందడి చేస్తున్న సంధ్యారాణి

పాచిపెంట, న్యూస్‌టుడే: తెదేపా అధికారంలోకి వస్తేనే గిరిజనుల కష్టాలు తీరుతాయని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిని గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. పాచిపెంట మండలంలోని పణుకువలస పంచాయతీలో కందరివలస, గుటమామిడివలస, కోస్టువలస, పెదచీపురువలస, చినచీపురువలస గ్రామాల్లో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భంజ్‌దేవ్‌తో కలిసి సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మండలాధ్యక్షుడు ప్రసాద్‌బాబు ఆధ్వర్యంలో తెట్టడవలస, కూనంబందవలస, గడివలసల్లోనూ పర్యటించారు. పలు గ్రామాల్లో గిరిజనులు సమస్యలను ఏకరవు పెట్టారు. అందరి ఆశీర్వాదంతో గెలుపొంది.. సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని ఆమె వారికి భరోసానిచ్చారు. ఈ సందర్భంగా కందరివలసలో వంద మంది గిరిజనులు తెదేపాలో చేరారు. వారికి కండువాలు వేసి సంధ్యారాణి ఆహ్వానించారు. ప్రచారంలో నాయకులు ముఖిసూర్యనారాయణ, మంచాల పారమ్మ, సావిత్రి, డి.మెహన్‌రావు, పోలినాయుడు, యుగంధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని