జనం భూమిలో.. జగన్ చిచ్చు
వైకాపా సర్కార్ కుట్రపూరితంగా తీసుకొస్తున్న ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టం (టైటిలింగ్ యాక్ట్-2022) ప్రజల భూముల పాలిటి ముప్పులా మారింది.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’తో స్థిరాస్తులు దోచుకునేందుకు కుట్ర
న్యూస్టుడే, రాజాం, గజపతినగరం, బొబ్బిలి గ్రామీణం
వైకాపా సర్కార్ కుట్రపూరితంగా తీసుకొస్తున్న ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టం (టైటిలింగ్ యాక్ట్-2022) ప్రజల భూముల పాలిటి ముప్పులా మారింది. భూ యాజమాన్య హక్కులను తేల్చే అధికారాన్ని సివిల్ కోర్టుల పరిధి నుంచి తొలగించి.. అధికారులకు అప్పగించడంతో స్థిరాస్తులకు ప్రమాదం పొంచి ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని నిపుణులు వ్యతిరేకిస్తున్నారు.
- దోపిడీ చేసేందుకు ఉద్దేశపూర్వకంగా ఎవరైనా ఆస్తులను వివాదాస్పదంగా మార్చి... నిజమైన భూ యజమానిని ఇబ్బంది పెట్టే ప్రమాదం ఉందని, తనే యజమాని అని నిరూపించుకునేందుకు.. ల్యాండ్ టైటిలింగ్ అప్పీలేట్ అధికారి, హైకోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు.
లోపాల నిలయం
ల్యాండ్ టైటిలింగు చట్టం పూర్తిగా లోపాలమయంగా ఉంది. రైతుకు ఏమాత్రం మేలు జరగదు. ఎవరి భూమి ఎవరైనా హక్కుదారునిగా పొందే అవకాశం ఉంది. ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకోవడం సరికాదు. వివాదాలు పెరిగి శాంతిభద్రతలకు ముప్పువాటిల్లే ప్రమాదం ఉంటుంది.
- జెర్రిపోతుల జగదీష్, న్యాయవాదుల సంఘ సంయుక్త కార్యదర్శి, గజపతినగరం
భూములకు రక్షణ కరవు
రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టంలో భూముల యజమానులకు రక్షణ పూర్తిగా ఉండదు. వారికి తెలియకుండానే భూములు కోల్పోతారు. టైటిలింగ్ అధికారి చెప్పిందే చెల్లుబాటవుతుంది. ఆయన స్వార్థానికి పనిచేస్తే ఇక భూమిలేనట్లే అనుకోవాలి. ఇది పూర్తిగా హక్కుదారుల వ్యతిరేక చట్టం. ప్రజలు గమనించాలి. లేకుంటే ఎవరికీ భూమి ఉండదనేది స్పష్టమవుతోంది. దీనిపై అవగాహన అవసరం.
- బిట్రా సూర్యారావు, న్యాయవాదుల సంఘ అధ్యక్షుడు, గజపతినగరం
అమ్మకానికి అడ్డంకులు
ల్యాండ్ టైటిలింగ్ చట్టం ముసుగులో స్థిరాస్తులు దోచుకునే కుట్ర జరుగుతోంది. నిరక్షరాస్యులు, చిన్న, సన్నకారు రైతుల భూములకు ఇప్పటి వరకూ ఉండే హక్కు పత్రాలు, దస్తావేజులు చిత్తుకాగితాలతో సమానంగా మారిపోతాయి. ఎవరైనా భూమిని వివాదాస్పదం చేస్తే అమ్మకానికి వీలుండదు. బ్యాంకు రుణాలకు నోచుకోలేరు. రాజకీయ పెత్తనానికి అవకాశం ఏర్పడుతుంది. టైౖటిల్ రిజిస్ట్రేషన్ అధికారి ఈ మొత్తం ప్రక్రియలో అత్యంత కీలకంగా మారుతారు. ఇబ్బందులు వస్తాయి.
- గురవాన నారాయణరావు, న్యాయవాది
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిబంధనలు తొక్కి‘పెట్టే’శారు
[ 18-05-2024]
విజయనగరం అర్బన్, గ్రామీణం: గురువారం మధ్యాహ్నం 3 గంటలు.. విజయనగరం తహసీల్దారు కార్యాలయం.. ఈ ఎన్నికల్లో నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఆఫీసు. ఇక్కడే పోస్టల్ బ్యాలెట్ స్ట్రాంగ్రూమ్ ఉంది. -
ప్రజలకు అందుబాటులో ఉంటాం
[ 18-05-2024]
కూటమిదే విజయమని, నియోజకవర్గ ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ సేవ చేస్తానని కురుపాం కూటమి అభ్యర్థిని తోయక జగదీశ్వరి అన్నారు. -
19 నుంచి తోటపల్లిలో కల్యాణ వేడుకలు
[ 18-05-2024]
తోటపల్లి వేంకటేశ్వర కోదండ రామాలయం దేవస్థానంలో ఈ నెల 19 నుంచి 23 వరకు సీతారామస్వామి వార్షిక కల్యాణ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు దేవస్థానం ఈవో వి.వి.సూర్యనారాయణ తెలిపారు. -
ఏటా రూ.కోట్లు.. పనులకు తూట్లు
[ 18-05-2024]
సాలూరు పట్టణంలోని గాంధీనగర్ నుంచి కొంకివీధి, వేదసమాజం, నాయుడువీధి, శివాజీ, బోసుబొమ్మ కూడలి వరకు ఉండే వన్వే దారి ఇది. అడుగడుగునా గుంతలతో అధ్వానంగా మారింది. -
ఇదే.. సాలూరు స్మార్ట్ టౌన్షిప్
[ 18-05-2024]
జగనన్న స్మార్ట్ టౌన్షిప్లో మధ్య ఆదాయ వర్గాలు, ఉద్యోగులు, ప్రభుత్వ పింఛనుదారులకు తక్కువ ధరకే ఇళ్ల స్థలాలను ప్రభుత్వం సాలూరులో పట్టణ జాతీయ రహదారి పక్కన కేటాయించింది -
ఆందోళనకు గురువులు సిద్ధం
[ 18-05-2024]
పోలింగ్ విధుల్లో పాల్గొన్న ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి సంఘాలు ఆందోళనకు సిద్ధమయ్యాయి. -
రాష్ట్రంలో ఈవీఎంలకు భద్రత లేదు
[ 18-05-2024]
రాష్ట్రంలో జరుగుతున్న దాడులు, దౌర్జన్యకాండను దృష్టిలో ఉంచుకొని ఓట్ల లెక్కింపు రోజున ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టాలని లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ డిమాండు చేశారు. -
బొగ్గు వ్యాగన్ నుంచి పొగలు
[ 18-05-2024]
ఆగి ఉన్న గూడ్స్ రైలు నుంచి పొగలు రావడంతో రైల్వే సిబ్బంది అప్రమత్తమై ప్రమాదాన్ని నిలువరించిన సంఘటన శుక్రవారం గజపతినగరం రైల్వే స్టేషన్లో చోటుచేసుకుంది -
చిరుధాన్యాల సరస్వతికి జాతీయస్థాయి గుర్తింపు
[ 18-05-2024]
సబల స్వచ్ఛంద సంస్థ కార్యదర్శి, చిరుధాన్యాల చెల్లెళ్ల సంఘం వ్యవస్థాపకురాలు మల్లువలస సరస్వతికి జాతీయస్థాయి గుర్తింపు దక్కింది. -
కన్నీటి సంద్రం
[ 18-05-2024]
ఉమ్మడి జిల్లాలో శుక్రవారం జరిగిన వివిధ ఘటనల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. గజపతినగరం, జియ్యమ్మవలస, బొండపల్లి మండలాల్లో రోడ్డు ప్రమాదాల కారణంగా ముగ్గురు మృత్యువాత పడ్డారు. -
దిబ్బలపాలెంలో పులి సంచారం..?
[ 18-05-2024]
భోగాపురం మండలంలోని దిబ్బలపాలెం, కవులవాడ పరిసర ప్రాంతాల్లో పులి సంచరిస్తున్నట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ప్చ్..ఇదేం నిర్వహణ?
[ 18-05-2024]
ఉమ్మడి జిల్లాలోని నగరపాలక సంస్థ, పురపాలక, నగర పంచాయతీల్లో కాలువల తీరు ఆందోళన కలిగిస్తోంది. నిర్వహణ, పారిశుద్ధ్య పనులకు ఏటా రూ.లక్షల్లో ఖర్చు చేస్తున్నా పరిస్థితి మారడం లేదు.